Publish Date:Jul 26, 2022
వైసీపీకి కష్టాలన్నీ ఒకే సారి కట్టకట్టుకుని వస్తున్నట్లున్నాయి. నిన్న మొన్నటి వరకూ విపక్షం ఎంతగా విమర్శించినా గుట్టుగా ఉన్న అడ్డగోలు అప్పుల వ్యవహారం కేంద్రంపార్లమెంటు సాక్షిగా బట్టబయలు చేసేసింది. అసలు అడ్డగోలుగా, ఇష్టారీతిగా అప్పులు తీసుకోవడానికి పచ్చ జెండా ఊపిన కేంద్రమే ఇప్పుడు రెడ్ ఫ్లాగ్ చూపేసింది. కేవలం జగన్ సర్కార్ ను సహాయపడటానికే, అడ్డగోలుగా అప్పులు తీసుకోవడానికే జగన్ సర్కార్ కేవలం అప్పుల కోసమే రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎ్సడీసీ)ను ఏర్పాటు చేసింది. అడ్డగోలుగా ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి అప్పులు దండుకుంది.
యూపీ సహా పలు రాష్ట్రాలూ దీనినే అనుసరించాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తినా కేంద్రం కళ్లు మూసుకుని పాలు తాగుతున్న పిల్లిలా వ్యవహరించింది. ఇప్పుడు మాత్రం అడ్డగొలు అప్పులపై శ్రీలంకను బూచిగా చూపి రాష్ట్రాలను హెచ్చరిస్తున్నది. కేంద్రం రాష్ట్రం అప్పులకు చెక్ పెట్టడంతో ముందు ముందు జగన్ సర్కార్ పీకలోతు ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్రం నుంచి ఇక ఈ స్థాయి సహకారం ఉండదని స్పష్టంగా తేలిపోవడంతో ప్రభుత్వంలో గాభరా మొదలైంది. అదే సమయంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కూడా జగన్ సర్కార్ కు ప్రతికూలంగా మారుతున్నట్లు కనిపిస్తున్నది.
జగన్ సర్కార్ గ్రాఫ్ వేగంగా పడిపోతోందని సర్వేలో తేలింది. అలాగే గడప గడపకూ కార్యక్రమంలో ఎదురౌతున్న నిరసనలు.. ఇవి చాలవన్నట్లు ప్రతిష్టాత్మక అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పరాజయం ఎదురైంది. అక్కడా ఇక్కడా కాదు సాక్షాత్తూ హోంమంత్రి తానేటి వనిత సొంత నియోజకవర్గమైన కొవ్వూరులో. అది కూడా ఏకగ్రీవంగా విపక్ష తెలుగుదేశం కైవశం చేసుకుంది.
కొవ్వూరు నియోజకవర్గంలో జరిగిన అర్బన్ బ్యాంకు ఎన్నికలలో సొంత అభ్యర్థులను గెలిపించుకోలేక మొత్తం 11డైరెక్టర్ స్థానాలనూ విపక్ష తెలుగుదేశం పార్టీకి ధారాదత్తం చేసేశారు. 2019లో విజయం తరువాత వైసీపీకి తగిలిన భారీ షాక్ ఇదేనని చెప్పాలి. బ్యాంకుచైర్మన్ గా తెలుగుదేశంకు చెందిన మద్దిపట్ల శివరామృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే11మంది డైరెక్టర్లూ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పరాజయం తానేటి వనిత సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం సత్తాను, వైసీపీ బలహీనతను చాటాయని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-defeat-in-urban-bank-elections-in-taneti-vanitas-constituenct-25-140584.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.