Publish Date:Apr 24, 2024
వైసీపీలో ఇప్పుడు కొత్త ఏడుపు మొదలైంది. తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్కి వేల కోట్లలో వున్న ఆస్తులను చూసి వైసీపీ వర్గాలు కుళ్ళుకు చస్తున్నాయి. పెమ్మసానికి ఇన్ని ఆస్తులు వున్నాయి.. అన్ని ఆస్తులు వున్నాయి అని వైసీపీ మీడియాలో ఏవేవో కట్టుకథలు వండి వార్చుతున్నారు. అన్ని ఆస్తులు వుండటం వల్లే చంద్రబాబుకు ఎన్నో కోట్లు ఇచ్చి టిక్కెట్ కొనుక్కున్నారనే ప్రచారం మొదలుపెట్టారు. ఈ చెత్త ప్రచారాన్ని పెమ్మసాని చంద్రశేఖర్ విజయవంతంగా తిప్పికొడుతున్నారు. భగవంతుడు తనకు చిన్నతనంలోనే ఎంతో సంపద వచ్చేలా అనుగ్రహించారని, తాను వైసీపీ నాయకుల మాదిరిగా అడ్డదారుల్లో డబ్బు సంపాదించలేదని కౌంటర్ ఇస్తున్నారు. తాను వైసీపీ నాయకుల తరహాలో డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదని, తన మాతృభూమికి సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని వైసీపీ నాయకుల కర్ణభేరులు బద్దలయ్యేలా చాటుతున్నారు.
చంద్రబాబుకు డబ్బిచ్చి టిక్కెట్లు కొనుకున్నారంటే ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులకు కర్రుకాల్చి వాత పెట్టేలాంటి ఫ్లాష్బ్యాక్ని పెమ్మసాని రివీల్ చేశారు. 2019 ఎన్నికల సందర్భంగా పెమ్మసానిని రాజకీయాల్లోకి రప్పించడానికి జగన్ తీవ్రంగా ప్రయత్నించాడట.. ఎమ్మెల్యే, ఎంపీ ఏ సీటు కావాలంటే ఆ సీటుకి టిక్కెట్ ఇస్తాం.. ఎలక్షన్లో పోటీ చేయడం ఇష్టం లేదంటే ఎమ్మెల్సీగానో, రాజ్యసభ సభ్యుడిగానో ఉంటానన్నా ఓకే... మీరు మా పార్టీలో చేరితే చాలు అంటే భారీ స్థాయిలో రాయబారాలు నడిపారట. వీళ్ళు ఎంత కాళ్ళావేళ్ళఆ పడినప్పటికీ, వైసీపీ విధానాలు, వ్యక్తుల పద్ధతులు నచ్చని పెమ్మసాని వైసీపీకి నో చెప్పారట. అప్పుడు తమ పార్టీలో చేరాలంటూ కాళ్ళావేళ్ళా పడిన వైసీపీ నాయకులు ఇప్పుడు తాను టీడీపీలో చేరితే ఇష్టమొచ్చిన ప్రచారాలు చేయడం వాళ్ళ సంస్కారాన్ని బహిర్గతం చేస్తోందని పెమ్మసాని అంటున్నారు.
టీడీపీకి ప్రస్తుత గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఈసారి ఎన్నికలలో పోటీ చేయకుండా తప్పుకున్నారు. ఇక్కడ నుంచి కొత్తగా పోటీకి దిగిన టీడీపి అభ్యర్థిని ఒక ఆట ఆడుకోవాలని అనుకున్న వైసీపీ నాయకులు పెమ్మసాని దూకుడు చూసి బిత్తరపోతున్నారు. పెమ్మసాని ఆడించేవాడే తప్ప, వేరేవాళ్ళు ఆడుకునేవారు కాదని అర్థమై నీళ్ళు నములుతున్నారు. ఎన్నారై కదా, ఏసీ కార్లో వచ్చి, జనానికి చేతులు ఊపి వెళ్ళిపోతాళ్ళే అనుకుంటే, నియోజగకవర్గంలోని గడపగడపనూ పెమ్మసాని సందర్శిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్య కంటే ప్రచారంలో చాలా ముందున్నారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ అనేది డిసైట్ అయిపోయిందని భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-comments-on-pemmasani-39-174444.html
ఏపీలో ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి రోజాకు సొంత పార్టీ నేతల నుంచే ఎదురౌతున్న వ్యతిరేకత, నిరసనలు హాట్ టాపిక్ గా మారాయి. రెండు సార్లు వరుసగా విజయం సాధించిన ఆమె.. మూడోసారి విజయంతో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని ఆశపడుతున్నారు.
హెల్త్ ఇన్స్యూరెన్స్ పేరుతో ప్రీమియం లు వసూళ్ళకే పరిమితం అవుతూ క్లెయిమ్ ల విషయాలకు వచ్చేసరికి ఇలా వేధింపులకు గురి చేసి ఎగొట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్న TATA AIG GENERAL INSURANCE కంపెనీ వంటి సంస్థలపై, వాటి ఆగడాలకు చెక్ పెట్టేదెవరు
కాపు సామాజిక వర్గంపై బలమైన ‘ముద్ర’ గడ సొంతం. అయితే అది ఇప్పుడు కాదు. ఒకప్పుడు. సొంత సామాజికవర్గంపై తన ఆధిపత్యం పోతుందా అన్న సందేహం ఇసుమంతైనా ఆయనలో కనిపించని రోజుల్లో కాపుజాతి కోసం అంటూ ఆయన ఉద్యమాలు చేశారు. కాపు రిజర్వేషన్ అంశాన్ని రాజకీయ పార్టీలు పట్టించుకోక తప్పని పరిస్థితి కల్పించారు. అయితే ఇదంతా గతం.
ఎపిలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే గడువు ఉంది. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. కూటమి అభ్యర్థుల తరపున ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది.. పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి.
నగరిలో రోజా ఓటమే ధ్యేయంగా వైసీపీ స్థానిక నేతలు పని చేస్తున్నారా? వారికి మంత్రి పెద్దిరెడ్డి మద్దతు ఫుల్ గా ఉందా? అన్న అనుమానాలు చాలా కాలంగా ఉన్నాయి. ఆమెపై సొంత పార్టీ నేతలు గతంలో చేసిన అవినీతి ఆరోపణలు ఇందుకు నిదర్శనం.
యథారాజా తథా ప్రజా అన్నది నానుడి. కానీ వైసీపీ విషయంలో మాత్రం యథా అధినేత, తథా ఆ పార్టీ నాయకులు అని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల వేళ వైసీపీ అరాచకాలు రోజు రోజుకూ పెచ్చరిల్లుతున్నాయి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్య చేసుకున్నవిద్యార్థి రోహిత్ వేముల దళితుడు కాదని,
మరో పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో సంపన్న అభ్యర్థి ఎవరు అన్నది చర్చనీయాంశమైంది.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు.. అవమానాలు, అభినందనలు సర్వసాధారణమే. నాకు వాళ్లు గౌరవం ఇవ్వలేదు.. నన్ను వాళ్లు విమర్శించారంటూ.. వ్యక్తిగతంగా కక్ష పెంచుకుంటే సదరు నేతకు రాజకీయ భవిష్యత్తుతో పాటు.. మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అదే పరిస్థితి ప్రస్తుతం మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ఎదురవుతోంది.
మీరేదో పనిలో వుంటారు.. లేదా ట్రావెల్ చేస్తూ వుంటారు... లేదా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ వుంటారు.
కోవిషీల్డ్ తో గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయని ఆస్ట్రాజెనికా అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమైంది. వ్యాక్సిన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న ఈ సమయంలో ఆ సర్టిఫికెట్లపై ప్రధాని ఫోటో మాయమవ్వడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది.