Publish Date:May 30, 2021
నీలం, తెలుపు, ఆకుపచ్చ.. ఈ మూడు వైసీపీ జెండా రంగులు. ఏపీని ఈ మూడు రంగుల్లో ముంచెత్తాలని గతంలో ప్రయత్నించారు. గ్రామ సచివాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, రేషన్ షాపులు, ప్రభుత్వం అనే పేరున్న దేనికైనా.. ఈ మూడు రంగులనే పులిమేవారు. కోర్టు మొట్టికాయలతో ఈ మధ్య కాస్త కంట్రోల్ అయ్యారు.
తాజాగా, మరోసారి ఓవరాక్షన్ చేశారు అధికారులు. ఈసారి ఏకంగా గుళ్లోనే ఆ మూడు రంగులతో అలంకరణ చేసేశారు. దేవుడంటే భయంలేదో.. లేక, ముఖ్యమంత్రి అంటే భయమో తెలీదు కానీ.. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల ఆలయ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను రాజకీయ కార్యక్రమంగా మార్చేశారంటూ విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
ద్వారకా తిరుమలలో ఈ నెల 22 నుంచి 29 వరకు.. వైశాఖమాస తిరు కల్యాణోత్సవాలు జరిగాయి. శనివారం బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు కావడంతో రాత్రి స్వామి వారి పవళింపు సేవ నిర్వహించారు. ఆ సందర్భంగా గర్భాలయంలో పూలు, పళ్లతో అలంకరణ చేశారు. ఈ అలంకరణలో భాగంగా.. వైసీపీ రంగులతో కూడిన ప్లాస్టిక్ పూల దండలను వినియోగించడం ప్రస్తుత వివాదానికి కేంద్రం.
గర్భాలయంతో పాటు ఆలయ ముఖద్వారాలకు గజ మాలలుగా వైసీపీ జెండా రంగుల ప్లాస్టిక్ పూలను వేలాడ దీయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ ఈవో జీవీ సుబ్బారెడ్డితో పాటు అధికారుల తీరుపై భక్తులు భక్తులు మండిపడుతున్నారు. దేవాలయంలో ఈ రాజకీయ రంగులు ఏంటంటూ తప్పుబడుతున్నారు. సహజమైన పూలతో అలంకరించకుండా.. కావాలని ఇలా వైసీపీ రంగులు ఉన్న ప్లాస్టిక్ పూలదండను తెప్పించడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. ప్లాస్టిక్ పూలను పెట్టడం.. వెంకన్న స్వామి వైభవాన్ని కించపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయినా.. మంచి పాలన అందిస్తే ప్రజల మన్ననలు పొందుతారు కానీ.. ఇలా రంగులను చూసి.. ఎవరబ్బా ఓట్లు వేసేది? ఇంత చిన్న లాజిక్ మరిచి.. ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు.. దేవాదాయ శాఖ అధికారులు ఇలా ద్వారకా తిరుమలను రాజకీయ రంగుల క్షేత్రంగా మార్చడాన్ని భక్తులు చీదరించుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-colours-in-dwaraka-tirumala-temple-25-116571.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.