వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా క‌ష్ట‌మే.. తేల్చేసిన జన్మత్ పోల్

Publish Date:Apr 11, 2024

Advertisement

కడపలో లోక్ సభ స్థానంలో అవినాష్ రెడ్డి మూడో స్థానానికే పరిమితం
ప్రధాన పోటీ కూటమి అభ్యర్థి, షర్మిల మధ్యే

ఏపీలో మే13న జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల లో అధికార వైసీపీకి  జనం బిగ్ షాక్ ఇవ్వనున్నారు.  వచ్చే ఎన్నికలలో వైసీపీ పరాజయం ఖాయమన్న విషయాన్ని ఇప్పటికే  జాతీయ‌, రాష్ట్ర స్థాయిలోని ప్ర‌ముఖ స‌ర్వేల‌న్నీ కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశాయి. మెజార్టీ   స‌ర్వేలు వైసీపీకి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 30 నుంచి 35 స్థానాలు ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నాయి. అయితే పోలింగ్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఆ సంఖ్య త‌గ్గే అవకాశం ఉందని సర్వేలన్నీ అంచనా వేశాయి. ఇక తాజాగా జ‌న్మ‌త్ పోల్ స‌ర్వే అయితే వైసీపీకి విపక్ష హోదా కూడా దక్కే అవకాశం లేదని తేల్చేసింది.  జన్మత్ పోల్ స‌ర్వే   వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా  క‌ష్ట‌మేనని పేర్కొంది. ఐదేళ్ల పాల‌న‌లో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌క్ష‌పూరిత‌ పాల‌న సాగించారని, రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలు కూడా కనిపించడం లేదనీ, జగన్ పాలనలో సమాజంలోకి ఏ ఒక్క వర్గమూ కూడా సంతోషంగా లేదనీ సర్వే ఫలితాలను బట్టి తేటతెల్లం అవుతోంది. జగన్ అస్తవ్యస్త, అరాచక పాలన పట్ల ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నార‌నీ, అన్ని వ‌ర్గాల వారూ ఏకతాటిపైకి వ‌స్తూ వైసీపీ ప్ర‌భుత్వానికి గ‌ట్టి గుణ‌పాఠం చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని జ‌న్మ‌త్ పోల్ త‌న స‌ర్వే ఫలితం స్ప‌ష్టం చేసింది. జ‌న్మ‌త్ పోల్ స‌ర్వే పేర్కొన్నమేరకు వైసీపీ గ్రాఫ్ ఏపీలో రోజురోజుకు ప‌డిపోతుంది. అందుకు ప్రత్యక్ష నిదర్శనం  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర‌కు ప్ర‌జాద‌ర‌ణ క‌రువైంది. వైసీపీ కార్య‌క‌ర్త‌లు సైతం బ‌స్సు యాత్ర‌లో పాల్గొనేందుకు ఆస‌క్తి చూప‌డం లేదు. 

జన్మత్ పోల్స్ సర్వే ఫలితాల ప్ర‌కారం.. ఏపీలోని   175 శాసనసభ స్థానాల్లో అత్య‌ధిక స్థానాలు కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తారు. తెలుగుదేశం, బీజేపీ, జ‌న‌సేన పార్టీలు కూట‌మిగా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే మూడు పార్టీలు సీట్ల పంప‌కాల ప్ర‌క్రియ, అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌  పూర్త‌యింది. మూడు పార్టీల అధ్య‌క్షులు చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, పురందేశ్వ‌రిలు ప్ర‌చార ప‌ర్వంలో దూసుకెళ్తున్నారు. వీరి ప్ర‌చారానికి ప్ర‌జ‌ల మంచి మంచి స్పంద‌న ల‌భిస్తుంది. తెలుగుదేశం పార్టీ మొత్తం 144 స్థానాల్లో పోటీ చేస్తుండ‌గా.. ఇందులో 110 నుంచి 115 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ పార్టీ అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని జ‌న్మ‌త్ పోల్స్ స‌ర్వే పేర్కొంది. జనసేన పార్టీ  అభ్య‌ర్థులు 21 స్థానాల్లో పోటీ చేస్తుండ‌గా.. 17 నుంచి 19 నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధిస్తార‌ని, బీజేపీ పోటీ చేస్తున్న 10 స్థానాల‌కుగాను రెండు నుంచి మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ పార్టీ అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని జ‌న్మ‌త్ పోల్స్ స‌ర్వే ఫ‌లితాల్లో తేలింది. ఇక అధికార వైసీపీకి ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని జ‌న్మ‌త్ పోల్స్ స‌ర్వేలో స్ప‌ష్ట‌మైంది. వైసీపీ   175 నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్యర్ధులను రంగంలోకి దింపింది. అయితే వైసీపీ అభ్యర్థులు కేవలం  15 నుంచి 18 స్థానాల్లో మాత్ర‌మే   విజ‌యం సాధించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు జ‌న్మ‌త్ పోల్స్ స‌ర్వే పేర్కొంది. దీంతో వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదాకూడా రాద‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. పోలింగ్ స‌మ‌యం నాటికి వైసీపీ గ్రాఫ్ మ‌రింత‌గా ప‌డిపోయే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

వాస్త‌వానికి 2014, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీకి రాయ‌ల‌సీమ ప్రాంత ప్ర‌జ‌లు గట్టగా మద్దతు ఇచ్చారు. ముఖ్యంగా 2019 ఎన్నిక‌ల్లో అయితే.. రాయ‌ల‌సీమ జిల్లాల్లో  వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. కానీ, ప్ర‌స్తుతం ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేత‌ల‌కు అధికారం మ‌త్తు త‌ల‌కెక్క‌డంతో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను మ‌రిచి ప్ర‌శ్నించిన వారిని హింసించ‌డం మొద‌లు పెట్టారు.  దీంతో వైసీపీ ప్ర‌భుత్వంపై రాయ‌ల‌సీమ ప్రాంత ప్ర‌జలు సైతం తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. దీనికితోడు వివేకానంద రెడ్డి హ‌త్య‌,   వైఎస్ ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉండ‌టం, చంద్ర‌బాబు సీఎంగా ఉంటేనే అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌న్న ప్ర‌జ‌ల నమ్మకం ఇలా అన్నీ కలిసి ఇప్పటికే సీమలోని మెజారిటీ స్థానాలలో   వైసీపీ అభ్య‌ర్థుల ఓట‌మిని ఖరారు చేసేశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాయ‌ల‌సీమ ప్రాంతంలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల మ‌ధ్యే పోటీ ఉంటుంద‌ని, వైసీపీ మూడో స్థానానికి ప‌డిపోవ‌టం ఖాయ‌మ‌ని జ‌న్మత్ పోల్స్ స‌ర్వేలో  తేలింది. ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ముఖంగా చ‌ర్చించుకునే స్థానం క‌డ‌ప ఎంపీ   స్థానం. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ త‌ర‌పున ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ అవినాశ్ రెడ్డి బ‌రిలోఉన్నారు. అవినాశ్ రెడ్డికి పోటీగా సీఎం జ‌గ‌న్ సోద‌రి, ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్‌ ష‌ర్మిల పోటీ చేస్తున్నారు. అయితే, వీరిద్ద‌రి మ‌ధ్య హోరాహోరీ పోరు ఉంటుంద‌ని ఇప్పటి వరకూ అంతా భావిస్తున్నారు. అయితే  అవినాశ్ రెడ్డి  ష‌ర్మిల‌కు పోటీ ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని జ‌న్మ‌త్ పోల్స్ స‌ర్వే పేర్కొంది. 

క‌డ‌ప పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో అవినాశ్ రెడ్డి మూడో స్థానంలో ఉంటారనీ, ప్ర‌ధాన పోటీ వైఎస్ ష‌ర్మిల, కూట‌మి అభ్య‌ర్థి మధ్యే ఉంటుంద‌ని జ‌న్మత్ పోల్స్ స‌ర్వే చెప్పింది. వివేకానంద రెడ్డి హ‌త్య‌కేసులో ప్ర‌ధాన నిందితుడుగా అవినాశ్ రెడ్డి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ద‌ర్యాప్తు సంస్థ‌లు సైతం అవినాశ్ రెడ్డి వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా చెబుతున్నాయి. అవినాశ్ రెడ్డి అరెస్టు కాకుండా సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారాన్ని ఉప‌యోగిస్తున్నాడ‌ని ఆయ‌న చెల్లెళ్లు ష‌ర్మిల‌, వివేకా కుమార్తె సునీత రెడ్డి  ఆరోపిస్తున్నారు. వివేకా హ‌త్య వెనుక అవినాశ్ రెడ్డి ఉన్నారని క‌డ‌ప లోక్ సభ నియోజ‌క‌వ‌ర్గంలోని మెజార్టీ శాతం ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారు. ఈ క్ర‌మంలో అవినాశ్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ క్ర‌మంలో వైసీపీ ఓటు బ్యాంకు అధిక శాతం వైఎస్ ష‌ర్మిల‌కు వెళ్లే అవ‌కాశం ఉంది. దీంతో కూట‌మి అభ్య‌ర్థి వ‌ర్సెస్ ష‌ర్మిల మ‌ధ్య హోరాహోరు పోటీ ఉండే అవ‌కాశం ఉంద‌ని   రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఇదే విష‌యాన్ని జ‌న్మత్ పోల్స్ స‌ర్వే సంస్థ స్ప‌ష్టం చేసింది. మొత్తానికి ఇన్నాళ్లు వైసీపీకి కంచుకోట‌గాఉన్న క‌డ‌ప‌లోనూ ఆ పార్టీకి ఎదురుగాలి త‌ప్ప‌ద‌ని ప్ర‌ముఖ స‌ర్వేల‌న్నీ తేల్చేస్తున్నాయి.

By
en-us Political News

  
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.