జూపూడి ప్రభాకర్ పై వైసీపీ క్యాడర్ ఆగ్రహం...

Publish Date:Oct 16, 2019

Advertisement

 

ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జూపూడి ప్రభాకర్ పై వైసీపీ క్యాడర్ తెగ మండిపడుతోంది. పార్టీ ఓటమిపాలైనప్పుడు టిడిపి లో చేరి ఇప్పుడు అధికారంలోకి రాగానే తిరిగి వైసీపీ లో చేరారని ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీలో క్యాడర్ తో పాటు కొంత మంది నాయకులు కూడా జూపూడిపై ఫైర్ అవుతున్నారట, ఎన్నికల ఫలితాల ముందు వరకూ తెలుగు దేశం పార్టీలో జూపూడి ప్రభాకర్ ముఖ్య నేతగా పని చేశారు. 

అయితే 2014 ఎన్నికల ఫలితాల ముందు వరకూ ఆయన వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. 2014 ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లా కొండపి నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి జూపూడి ప్రభాకర్ ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో వైసిపి పరాజయం పాలవడంతో పెద్దగా టైం తీసుకోకుండా జూపూడి ప్రభాకర్ టిడిపిలోకి జంపైపోయారు. ఎమ్మెల్సీ పదవి గుమ్మం ముందు వరకూ వచ్చినా సాంకేతిక కారణాలు అడ్డం పడ్డాయి, ఆ వెంటనే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి జూపూడి ప్రభాకర్ ని వరించింది. దీంతో తెలుగు దేశం పార్టీలో ఆయన కీలకంగా వ్యవహరించారు.

పార్టీ కార్యక్రమాల్లో ప్రెస్ మీట్లలో ఆయన ప్రభావం స్పష్టంగా కనిపించేది. వైసిపిలో ఉన్నప్పుడు జగన్ కి సన్నిహితంగా వ్యవహరించిన జూపూడి ప్రభాకర్.. టీడీపీలో చేరాక ఆయనపైనే విమర్శలు, సెటైర్ లు కూడా వేశారు. 2019 ఎన్నికల్లో తిరిగి పోటీ చేయాలని జూపూడి భావించారు. గతంలో ఓటమి పాలయిన కొండపి నుండి మరోసారి పోటీ చేసేందుకు ఆయన ప్రయత్నించారు. టిడిపి టికెట్ దక్కించుకునేందుకు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే స్వామితో పోటీ పడ్డారు. కానీ, చివరి నిమిషంలో పార్టీ టికెట్ స్వామికే దక్కింది. దీంతో నామినేటెడ్ పదవిపై ఆశతో ఎన్నికల బరి నుండి తప్పుకున్న జూపూడికి టిడిపి ఓటమి జీర్ణించుకోలేని అంశంగా మారింది. ఆ క్రమంలో సొంత గూటికి చేరుకునేందుకు జూపూడి వైసీపీ నేతలతో చర్చలు జరిపి సక్సెస్ అయ్యారు.

అయితే వైసీపీ నుండి బయటకు వెళ్లిన సమయంలో జూపూడి ప్రభాకర్ చేసిన కామెంట్ లను వైసీపీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతుందట.  జూపూడి ప్రభాకర్ టిడిపి లో ఉన్న సమయంలో చేసిన కామెంట్ లకు సంబంధించి తేదీలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూపూడి ప్రభాకర్ ని వైసిపి అధిష్టానం తిరిగి పార్టీలో చేర్చుకున్నా వైసీపీ క్యాడర్ మాత్రం తాము క్షమించబోమని పోస్టులు పెడుతోంది. జూపూడి ప్రభాకర్ తప్పి పోయిన గొర్రెపిల్లలా పక్కదారి పట్టామని బహిరంగంగా చెప్పినా వైసీపీ క్యాడర్ మాత్రం జూపూడిపై విమర్శలు గుప్పిస్తూనే ఉంది. సొంత గూటికి చేరుకున్న జూపూడిపై వైసీపీ క్యాడర్ ఆగ్రహం ఎప్పటికి చల్లారుతుందో చూడాలి.
 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.