కోనసీమ చిచ్చు తెరవెనుక బాగోతం ఇదే! విధ్వంసం వెనుక ఉన్నది వైసీపీయే

Publish Date:May 25, 2022

Advertisement

ప్రశాంతంగా ఉండే కోనసీమలో ఒక్కసారిగా చిచ్చు రేగడానికి తెరవెనుక బాగోతం బైటపడిపోయింది. జగన్ మార్క్ రాజకీయ వికృత స్వరూపం మరో సారి బట్టబయలైంది. రాష్ట్రంలో జిల్లాల పెంపునకు శ్రీకారం చుట్టినప్పుడే కోనసీమలో స్కెచ్ కు రూపకల్పన జరిగింది. అదీ తాడేపల్లి ప్యాలెస్ వేదికగానే జరిగిందన్నది పరిశీలకుల విశ్లేషణ. ఇంతకీ ఆ తెరవెనక బాగోతం ఏమిటంటే..కోససీమలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు నియోజకవర్గం ఉన్నాయి. వాటిలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడే. రాజోలు మాత్రమే జనరల్ సీటు. అలాంటి కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టడానికి ఎవరూ అభ్యంతరం చెప్పే అవకాశం లేదు. అయితే జిల్లాకు కోనసీమ అనే పేరు ఉండాలన్నది మాత్రం కోనసీమ వాసుల దశాబ్దాల కల. అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా కోసం దశాబ్దాలుగా అక్కడి ప్రజలు వినతులు చేస్తూనే ఉన్నారు. సరే వారి ఆకాంక్ష ఎట్టకేలకు నెరవేరింది.  

అయితే అది సజావుగా కాకుండా ప్రశాంతతకు మారు పేరైన కోనసీమ వాసుల మధ్య విద్వేషాలు రగిలేలా. కొత్త జిల్లాల ప్రతిపాదన వచ్చినప్పుడే కోనసీమ జిల్లాకు బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలన్న వినతులు వెల్లువెత్తాయి. అప్పుడే వాటిని పరిగణనలోనికి తీసుకుని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అనే పేరు ఖరారు చేస్తే ఇప్పుడీ రచ్చ, చిచ్చు ఉండేది కాదని కోనసీమ సాధన సమితి నాయకులే అంటున్నారు. అలా కాకుండా కోనసీమ అనే పేరు ఖరారు చేసేసి.. నిర్ణయం తీసేసుకున్నాం ఇక మార్పు ఉండదని ప్రభుత్వ సలహాదారు, మంత్రులు ప్రకటనలు గుప్పించే.. ఆ తరువాత తీరిగ్గా దళిత సంఘాల నుంచి వినతులు అందాయంటూ మళ్లీ పేరు మార్పునకు నోటిఫికేషన్ జారీ చేశారు.

అక్కడి నుంచి కోనసీమ రగిలిపోయేందుకు జగన్ మార్కు రాజకీయం వేగంగా అడుగులు వేసింది. జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ ఆందోళనలు ప్రశాంతంగా సాగుతుంటే.. ఓ వ్యక్తి కలెక్టరేట్ ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసి ఉద్రిక్తలు పెచ్చరిల్లడానికి కారణమయ్యాడు.  ఆ వ్యక్తి పేరు అన్యం సాయి. అమలాపురం పట్టణానికి చెందిన అన్యం సాయి వైకాపాలో చురుకైన కార్యకర్త.  మంత్రి పిపిపే విశ్వరూప్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన వ్యక్తి. అలాగే వైకాపా అధినేత జగన్ జన్మదిన వేడుకలను అమలాపురంలో ఘనంగా నిర్వహించాడు. వైకాపా ప్రతి కార్యక్రమాన్ని భుజాన వేసుకుని ముందుండి నిర్వహించే అన్యం సాయి.. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ కోనసీమ సాధన సమితి ముఖ్యులు జిల్లా కలెక్టరేట్ లో వినతి పత్రం ఇస్తున్న సమయంలో ఆ కలెక్టరేట్ ఆవరణలోనే ఆత్మహత్యాయత్నం చేసి ఉద్రిక్తతలు పెచ్చరిల్లేందుకు కారకుడయ్యారు.

అదీ సంగతి.. కోనసీమ జిల్లా పేరు మార్పునకు నోటిఫికేషన్ జారీ చేసింది వైసీపీ సర్కార్.. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రశాంతంగా సాగుతున్న ఆందోళనలను పక్కదారి పట్టి ఉద్రిక్తతలు పెచ్చరిల్లడానికి కారకుడయ్యాడు. ఇక ఆ తరువాత జరిగిందంతా విధ్వంసమే. తాడేపల్లి ప్యాలస్ ఆదేశాలకు అనుగుణంగా.. చలో అమలాపురం కార్యక్రమంలో విధ్వంసం చెలరేగడానికి అనువుగా పోలీసులు తమ వంతు పాత్ర పోషించారు. శాంతి భద్రతల పరిరక్షణను గాలికి వదిలేసి మంత్రి పినిపే విశ్వరూప్ కుటుంబ సభ్యులకు నివాసం ఖాలీ చేయమని సూచనలు ఇచ్చారంటేనే ఆయన నివాసంపై దాడి జరుగుతుందన్న సంగతి వారికి ముందే తెలుసునన్న సంగతి అవగతమౌతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  

By
en-us Political News

  
బాధిత తల్లితో సిఐ నాగరాజు మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఆయన ప్రదర్శించిన దురుసు ప్రవర్తన ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమై ప్రపంచమంతటా సంచలనం సృష్టించాయన్నారు.
ఈ శిలాఫలకంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరు ఎక్కడా కనిపించలేదు. ఈ వింత పరిస్థితిని గమనించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో ఉత్సాహంగా కార్యక్రమానికి వచ్చిన ఆయన, ఆ శిలాఫలకంపై తన పేరు లేకపోవడంతో నిరాశకు లోనయ్యారు.
కాంగ్రెస్ నేతల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి..
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎప్పుడూ ఊహించని మలుపులు చోటుచేసుకుంటూనే ఉంటాయి
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా.. కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్ పంపించారన్నారు.
కూటమి ప్రభుత్వంలో పరిపాలనా లోపాలు, రాజకీయ సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా లభించిన 80 శాతం ప్రజా సంతృప్తి కేవలం కాగితాలకే పరిమితమైందనీ.. డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తమ సర్వేలో తేలిందని చెప్పారు.
ఎన్నికల బరిలో కేసీఆర్, బీఆర్ఎస్ కూటమిని ఢీకొట్టడం ఎవరికైనా పెద్ద సవాలే. గతంలో కేసీఆర్ వాడే ఘాటైన రాజకీయ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలపై ఆయనకు మాత్రమే పేటెంట్ హక్కు ఉందనే భావన ఉండేది. కానీ రేవంత్ రెడ్డి రాకతో.. ఆ ముద్రను పూర్తిగా చెరిపివేశారు. కేసీఆర్, కేటీఆర్ ల కంటే మరింత దూకుడుగా, ఘాటుగా రేవంత్ ప్రజల్లోకి వెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం పాలసీలు లేదా ప్రాజెక్టులను ఏ ఒక్కరి కోసమో కాకుండా దేశ ప్రజలందరి కోసమే ప్రవేశపెడుతుందని బదులిచ్చారు. అయితే.. ఆ ప్రాజెక్టులను అందుకోవడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా, సానుకూలంగా స్పందిస్తుందనే దానిపైనే వాటి రాక ఆధారపడి ఉంటుందని చెప్పారు.
చంద్రబాబు నాయుడు కుమారుడిగా, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతగా మాత్రమే గుర్తింపు ఉన్న యువకుడు నారా లోకేష్. అదే నారా లోకేష్ ఇప్పుడు ప్రజా క్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు.
ఈ చర్చోపచర్చలు, ఊహాగాన సభలపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా వేదికగా క్లారిటీ ఇచ్చారు. దేశానికి నరేంద్ర మోదీ రూపంలో ఒక బలమైన ప్రధానమంత్రి ఉన్నారన్న లోకేష్.. చంద్రబాబు ప్రధాని అన్న చర్చకు, వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
ఆయనకు పార్టీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదన్న చర్చ గత కొంత కాలంగా జనసేనలో అంతర్గతంగా సాగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా, మీడియా ముఖంగా చేస్తున్న విమర్శలను, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం వెనుకబడిందన్న భావన సర్వత్రా వ్యక్తమౌతోంది.
నగర ప్రజల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రో విస్తరణ, నిధుల విడుదలే లక్ష్యంగా వీరిద్దరూ కలిసి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీ చాలా సానుకూల వాతావరణంలో జరిగిందనీ, మెట్రో ప్రాజెక్టుకు ఎదురవుతున్న ఆర్థిక అవరోధాలను అధిగమించడానికి ఇదొక కీలక ముందడుగని సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.