Publish Date:Oct 18, 2022
శాంతియుతంగా మహాపాదయాత్ర సాగనివ్వకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమౌతున్నాయి. మహాపాదయాత్ర ఉత్తరాంధ్రకు చేరువ అవుతున్న కొద్దీ వైసీపీలో ఉన్మాదం కట్టలు తెంచుకుంటోంది. శాంతి భద్రతల సమస్య సృష్టించైనా సరే యాత్రను ఆపడానికి అన్ని విలువలనూ తుంగలోకి తొక్కి రౌడీమూకల్లా రెచ్చిపోతున్నారు. దాడికి పాల్పడడానికి వెనుకాడటం లేదు. పెట్రోలు చల్లైనా సరే రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. రాజమండ్రిలో అదే జరిగింది. ప్రశాంతంగా సాగుతున్న పాదయాత్రను అడ్డుకోవడానికి వైసీపీ ఎంపీ నేతృత్వంలో ఆ పార్టీ శ్రేణులు రౌడీ మూకల్లా వ్యవహరించాయి.
పాదయాత్ర దారిలో సభ ఏర్పాటు చేసిన రాజమండ్రి ఎంపీ ఎంపీ భరత్ రెండు మూడు వందల మందిని సమీకరించి పాదయాత్రలో ఉన్న రైతులపై దాడి చేయించారు. అసలు రైతుల మహాపాదయాత్ర రాజమండ్రి చేరడంతోనే కవ్వింపులకు దిగిన వైసీపీ శ్రేణులు రైతులపైకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరారు. వారిని ఎంపీ భరత్ ప్రోత్సహించారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
రైతుల మహాపాదయాత్రకు భద్రత కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. అసలు మహాపాదయాత్ర జరుగుతున్న మార్గంలో నడి రోడ్డు మీద సభకు పోలీసులు ఎలా ఎందుకు అనుమతించారో అర్థం కావడంలేదని స్థానికులే విస్తుపోతున్నారు
.వైసీపీ దాడులు జరిపినా రైతులు మొక్కవోని ధైర్యంతో యాత్ర కొనసాగించారు. ప్రజలు రైతులకు బ్రహ్మరథం పట్టారు. పూలవర్షం కురిపించారు. ఇంత బహిరంగంగా ఎంపీ పర్యవేక్షణలో రైతులపై దాడి జరిగినా పోలీసులు ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం గమనార్హం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-attack-on-amarawati-farmers-in-mp-bharat-presence-25-145661.html
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి కొందరు గుర్తుతెలియని ఆగంతకులు ఫోన్ చేసి వేధింపులకు గురిచేశారు.
జూన్ 14వ తేదీలోపే తల్లికి వందనం అమలు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15వేల చొప్పున జమ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
చివరాఖరికి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంచు మించుగా ఏడాదికి పైగా సాగుతున్న మంత్రివర్గ విస్తరణ మెగా సీరియల్ కు కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు తెర దించింది.
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అస్వస్థకు గురి అయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టును తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ గ్రీన్ కో ప్రాజెక్టు దేశానికి, ప్రపంచానికి మార్గదర్శిలా నిలిచిందని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో తనను కావాలని లాగుతున్నరని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరం కమీషన్ ఎదుట బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్ని అబద్దాలు చెప్పారని తుమ్మల తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపైనా, మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణం రాజు, ఒక టీవీ చానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుపైనా ఏపీ డిప్యూటీ స్వీకర్ రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
వైసీపీ అధినేత జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారని లోకేష్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండ ఉక్కపోతతో అల్లడుతున్న ప్రజలకు వర్షంతో ఉపశమనం కలిగింది. ఉన్నపళంగా వాతావరణం మొత్తం చల్లబడింది.
తీవ్ర అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.
అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ ఒక చానెల్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు మ్యాగజైన్ ఎడిటర్ కృష్ణం రాజు, ఆయనను ఇంటర్వ్యూ చేసిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు క్యాబినెట్ విస్తరణకు ఉండే అవకాశముంది.