ఎంపి భరత్ ఆధ్వర్యంలో అమరావతి రైతులపై దాడి

Publish Date:Oct 18, 2022

Advertisement

శాంతియుతంగా మహాపాదయాత్ర సాగనివ్వకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమౌతున్నాయి. మహాపాదయాత్ర ఉత్తరాంధ్రకు చేరువ అవుతున్న కొద్దీ వైసీపీలో ఉన్మాదం కట్టలు తెంచుకుంటోంది. శాంతి భద్రతల సమస్య సృష్టించైనా సరే యాత్రను ఆపడానికి అన్ని విలువలనూ తుంగలోకి తొక్కి రౌడీమూకల్లా రెచ్చిపోతున్నారు. దాడికి పాల్పడడానికి వెనుకాడటం లేదు. పెట్రోలు చల్లైనా సరే రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. రాజమండ్రిలో అదే జరిగింది. ప్రశాంతంగా సాగుతున్న పాదయాత్రను అడ్డుకోవడానికి వైసీపీ ఎంపీ నేతృత్వంలో ఆ పార్టీ శ్రేణులు రౌడీ మూకల్లా వ్యవహరించాయి.

పాదయాత్ర దారిలో సభ ఏర్పాటు చేసిన రాజమండ్రి ఎంపీ ఎంపీ భరత్ రెండు మూడు వందల మందిని సమీకరించి పాదయాత్రలో ఉన్న రైతులపై దాడి చేయించారు. అసలు రైతుల మహాపాదయాత్ర రాజమండ్రి చేరడంతోనే కవ్వింపులకు దిగిన వైసీపీ శ్రేణులు రైతులపైకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరారు. వారిని ఎంపీ భరత్ ప్రోత్సహించారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.  

రైతుల మహాపాదయాత్రకు భద్రత కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. అసలు మహాపాదయాత్ర జరుగుతున్న మార్గంలో నడి రోడ్డు మీద సభకు పోలీసులు ఎలా ఎందుకు అనుమతించారో అర్థం కావడంలేదని స్థానికులే విస్తుపోతున్నారు

.వైసీపీ దాడులు జరిపినా రైతులు మొక్కవోని ధైర్యంతో యాత్ర కొనసాగించారు. ప్రజలు రైతులకు బ్రహ్మరథం పట్టారు. పూలవర్షం కురిపించారు. ఇంత బహిరంగంగా ఎంపీ పర్యవేక్షణలో రైతులపై దాడి జరిగినా పోలీసులు ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం గమనార్హం.

By
en-us Political News

  
పోలింగ్ శాతం పెర‌గ‌డంతో వైసీపీ మ‌రింత డీలా ప‌డింది. ఎందుకంటే 70 శాతానికి మించి పోలింగ్ న‌మోదైతే.. అది ప్ర‌తిప‌క్షానికి క‌లిసి వ‌స్తుంది. మ‌రోవైపు.. యువ‌త పోటెత్తారు. కొత్త‌గా ఓటు హ‌క్కు ద‌క్కించుకున్న‌వారు కూడా ఈ సారి ఓటేశారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీలో జోష్ క‌నిపించ‌డం లేదు. ఇదిలా వుంటే.. మ‌రోవైపు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష కూట‌మి పార్టీ టీడీపీలో మాత్రం జోష్ క‌నిపిస్తోంది.
వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయా.. ఆ పార్టీ నమ్ముకున్న గూండాయిజం వైసీపీకి గులుపు ఉన్న స్థానాలలో కూడా ఓటమిని శాశించిందా? అంటే జనం ఔననే అంటున్నారు. పరిశీలకులు కంసుడి పతనానికి ముందు కనిపించిన శకునాలను నిన్నటి పోలింగ్ లో జరిగిన సంఘటనలతో పోలుస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితం పోలింగ్ రోజే వెల్లడైపోయింది. ఓటరు ఉత్సాహంలో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను విస్పష్టంగా కనిపించింది. దేశ, విదేశాల నుంచి అనేక వ్యయ ప్రయాసలకోర్చి మరీ వచ్చి తమ ఓటు హక్కను వినియోగించుకున్న ప్రజలు. ప్రలోభాలు కాదు, తమకు రాష్ట్ర ప్రగతి, పురోభివృద్ధి ముఖ్యమని విస్పష్టంగా చాటారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (మే 14) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఎనిమిది కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
వైసీపీ భ్రమలు తొలగిపోయాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారులూ ఆ పార్టీకీ ఛీ కొట్టేశారు. సంక్షేమం అంటూ తమ ఇంత కాలం భ్రమల్లో ఉంచి చేసిన నిర్వాకం చాలన్నట్లుగా వైసీపీకి వ్యతిరేకంగా పోలింగ్ బూత్ లకు పోటెత్తారు. సంక్షేమ లబ్ధాదారులు కదా, మనకే ఓటేస్తారు అన్న భ్రమల్లో ఉన్న వైసీపీకి తామెటు వైపో తమ ధిక్కారం ద్వారా విస్పష్టంగా తెలియజేశారు. నమస్కారానికి ప్రతినమస్కారం, తిరస్కారానికి తిరస్కారం అన్నట్లుగా ఏకంగా పోలింగ్ బూత్ లలోనే వైసీపీ నేతలపై తిరగబడ్డారు.
వైసీపీ ప్ర‌భుత్వం దిగిపోవ‌టం ఖాయ‌మైంది. ఐదేళ్ల‌ పాటు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌క్ష‌పూరిత‌, అరాచ‌క పాల‌న‌కు విసిగిపోయిన ఏపీ ప్ర‌జలు ఓటు ద్వారా వీడ్కోలు ప‌లికేశారు. వైసీపీ శ్రేణుల హింసకు పాల్పడుతూ రెచ్చిపోయి భ‌యాందోళ‌న‌కు గురిచేసినా, ప‌లు పోలింగ్ కేంద్రాల్లో దాడుల చేసినా బెద‌రకుండా, అద‌ర‌కుండా ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ ల వ‌ద్ద‌కు ఓట‌ర్లు పోటెత్తారు.
ముంబైలో పలు ప్రాంతాల్లో భారీ గాలులు, వర్షం బీభత్సం సృష్టించాయి. బలమైన గాలుల కారణంగా ఘట్కోపర్ ప్రాంతంలో ఒక భారీ హోర్డింగ్ కుప్పకూలింది. ఆ హోర్డింగ్ పక్కనే వున్న పెట్రోల్ బంక్‌పై పడటంతో ఎనిమిది మంది మరణించారు.
పోలింగ్ ముగిశాక టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. వైసీపీ వర్గాలు మాత్రం నిరాశ, నిస్పృహల్లో మునిగిపోయి కనిపిస్తున్నారు.
నగరి నియోజకవర్గానికి పట్టిన దరిద్రం వదలబోతోంది. ఆ నియోజకవర్గ వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే రోజా ఓడిపోబోతోంది.
నాలుగో విడత పోలింగ్ సమాప్తం
పోలింగ్ బూత్‌లో బుర్ఖా వేసుకున్న మహిళల ఐడీ ప్రూఫ్ చెక్ చేసిన నేపథ్యంలో తనపై నమోదైన కేసు అంశం మీద హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత స్పందించారు. తాను హైదరాబాద్ నుంచి లోక్ సభ అభ్యర్థిని అని... పైగా మహిళా అభ్యర్థిని అన్నారు. వారి ఫొటో ఐడెంటింటీని చెక్ చేసుకునే హక్కు తనకు ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వేళ అధికార వైసీపీ అన్ని విలువలకూ వలువలు విప్పేసి యథేచ్ఛగా దాడులు, దౌర్జన్యాలకు తెగబడింది. అదే సమయంలో ఎన్నికల సంఘం కూడా హింసాత్మక ఘటనలపై సీరియస్ గా స్పందించి ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.