చింత చచ్చినా పులుపు చావలేదంటారు… అలాగే ఉంది తిరుపతిలో వైసీపీ నాయకుల ధోరణి… అధికారులపై వైసీపీ నాయకుల పెత్తనం ఇంకా తగ్గడం లేదు. తమ ప్రభుత్వ హయాంలో ఉన్న విధంగానే ఇంకా అయ్యా సార్ అనేలాగే అధికారులు ఉండాలనే ఆశిస్తున్నారు. కాదు… కాదు ఆదేశిస్తున్నారు. ఓవైపు అధినేత జగన్ ఉన్నతాధికారులను హెచ్చరిస్తుంటే.. మరోవైపు జిల్లా స్థాయి నాయకులు కిందిస్థాయి అధికారులను బెదిరిస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలను ప్రచారం చేయడానికి ఓ కొత్త అంశంతో తెర పైకి వచ్చింది. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి నారాయణస్వామి, శ్రీకాళహస్తి ఇంఛార్జ్ బియ్యపు మధుసూదన్ రెడ్డి, సత్యవేడు ఇంఛార్జ్ రాజేష్, మేయర్ డాక్టర్ శిరీష, నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్ వంశి సహా వైసీపీ నాయకులు తరలి వచ్చారు.
కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లేకపోవడంతో డీఆర్వో నరసింహులు, ఇతర అధికారులు ప్రజలు నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. అక్కడికి వచ్చిన వారు నేరుగా డీఆర్వో దగ్గరికి చేరుకున్నారు. అప్పటికే ఇతరుల నుంచి అర్జీలు తీసుకుంటున్న డీఆర్వో వారితో మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులు హడావుడితో అర్జీదారులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో అర్జీ పత్రాన్ని భూమన కరుణాకర్ రెడ్డి డీఆర్వోకు ఇవ్వడానికి సిద్దం కాగా.. డీఆర్వో నరసింహులు తన సీటులో కూర్చోని చేయి చాచారు. దీంతో వైసీపీ నాయకులు డీఆర్వోపై ఆగ్రహిస్తూ.. సీటులో నుంచి లేచి వినతి పత్రం తీసుకోవాలని హూంకరించారు . తొలుత లేచి వినతి పత్రం తీసుకోవడానికి ఇష్టపడని డీఆర్వో, మరోసారి వైసీపీ నాయకులు గద్దించడంతో సీటులంచి లేచి నిలబడి తీసుకున్నారు. అయితే వైసీపీయుల దాష్టీకం, అహంభావం జనానికి ఇసుమంతైనా నచ్చలేదు. అక్కడ ఉన్న ప్రజలు మాత్రం చింత చచ్చినా పులుపు చావలేదనే సామెతను తలుచుకుంటూ అధికారం పోయినా అహంకారం తగ్గడం లేదని వ్యాఖ్యానించడమే ఇందుకు తార్కానం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-arrogance-continue-even-after-power-loss-39-203529.html
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు