చింత చచ్చినా పులుపు చావలేదంటారు… అలాగే ఉంది తిరుపతిలో వైసీపీ నాయకుల ధోరణి… అధికారులపై వైసీపీ నాయకుల పెత్తనం ఇంకా తగ్గడం లేదు. తమ ప్రభుత్వ హయాంలో ఉన్న విధంగానే ఇంకా అయ్యా సార్ అనేలాగే అధికారులు ఉండాలనే ఆశిస్తున్నారు. కాదు… కాదు ఆదేశిస్తున్నారు. ఓవైపు అధినేత జగన్ ఉన్నతాధికారులను హెచ్చరిస్తుంటే.. మరోవైపు జిల్లా స్థాయి నాయకులు కిందిస్థాయి అధికారులను బెదిరిస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలను ప్రచారం చేయడానికి ఓ కొత్త అంశంతో తెర పైకి వచ్చింది. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి నారాయణస్వామి, శ్రీకాళహస్తి ఇంఛార్జ్ బియ్యపు మధుసూదన్ రెడ్డి, సత్యవేడు ఇంఛార్జ్ రాజేష్, మేయర్ డాక్టర్ శిరీష, నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్ వంశి సహా వైసీపీ నాయకులు తరలి వచ్చారు.
కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లేకపోవడంతో డీఆర్వో నరసింహులు, ఇతర అధికారులు ప్రజలు నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. అక్కడికి వచ్చిన వారు నేరుగా డీఆర్వో దగ్గరికి చేరుకున్నారు. అప్పటికే ఇతరుల నుంచి అర్జీలు తీసుకుంటున్న డీఆర్వో వారితో మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులు హడావుడితో అర్జీదారులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో అర్జీ పత్రాన్ని భూమన కరుణాకర్ రెడ్డి డీఆర్వోకు ఇవ్వడానికి సిద్దం కాగా.. డీఆర్వో నరసింహులు తన సీటులో కూర్చోని చేయి చాచారు. దీంతో వైసీపీ నాయకులు డీఆర్వోపై ఆగ్రహిస్తూ.. సీటులో నుంచి లేచి వినతి పత్రం తీసుకోవాలని హూంకరించారు . తొలుత లేచి వినతి పత్రం తీసుకోవడానికి ఇష్టపడని డీఆర్వో, మరోసారి వైసీపీ నాయకులు గద్దించడంతో సీటులంచి లేచి నిలబడి తీసుకున్నారు. అయితే వైసీపీయుల దాష్టీకం, అహంభావం జనానికి ఇసుమంతైనా నచ్చలేదు. అక్కడ ఉన్న ప్రజలు మాత్రం చింత చచ్చినా పులుపు చావలేదనే సామెతను తలుచుకుంటూ అధికారం పోయినా అహంకారం తగ్గడం లేదని వ్యాఖ్యానించడమే ఇందుకు తార్కానం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-arrogance-continue-even-after-power-loss-39-203529.html
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.