షియోమి నుంచి కొత్త ఫోన్, టాబ్లెట్
Publish Date:Mar 12, 2015
Advertisement
చైనా యాపిల్ గా పేరొందిన షియోమి కంపెనీ రెడ్ ఎంఐ2 స్మార్ట్ ఫోన్ తోపాటు ఎంఐ ప్యాడ్ టాబ్లెట్ పేరుతో మరో రెండు కొత్త డివైజ్ లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిలో రెడ్ ఎంఐ2 ధరను రూ. 6999గా, ఎంఐ ప్యాడ్ ధరను రూ. 12,999గా నిర్ణయించింది. రెడ్ ఎంఐ2 స్మార్ట్ ఫోన్ రిజిస్ట్రేషన్ గురువారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం.మార్చి 24వ తేదీ నుండి ఫ్లిప్ కార్ట్ల్ లో ఫ్లాష్ అమ్మకాలు ఉంటాయి. మొదటి విడతలో 30 వేల నుండి 40 వేల ఫోన్లు అమ్మే అవకాశం ఉందని షియోమి ఇండియా హెడ్ మను జైన్ చెప్పారు.
రెడ్ ఎంఐ2 ప్రత్యేకతలు:
* 4.7 అంగుళాల డిస్ప్లే
* క్వాడ్ కోర్ 64 బిట్ స్నాప్డ్రాగన్ 410 ప్రాసెసర్,
* 4జి డ్యూయల్ సిమ్
* 8 ఎంపీ బ్యాక్ కెమెరా
* 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా
ఎంఐ ప్యాడ్ ప్రత్యేకతలు: 7.9 అంగుళాల డిస్ప్లే. అయితే వీటిలో కేవలం వై-ఫై ఆధారంగానే నెట్ అందుబాటులోకి వస్తుంది.
http://www.teluguone.com/news/content/xiaomi-new-products-33-43993.html
మైక్రోమాక్స్ మొబైల్ సంస్థకు అనుబంధ సంస్థ అయిన యు టెలివెంచర్స్ తన సరికొత్త రెండో స్మార్ట్ ఫోన్ యుఫొరియా మోడల్ ను భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది.
'గూగుల్ హ్యాండ్ రైటింగ్ ఇన్ పుట్' అంటే చేత్తే రాస్తే టెక్ట్స్ గా మార్చే సరికొత్త యాప్ విడుదలైంది. దాదాపు 82 భాషలను ఈ యాప్ సాధారణ టెక్ట్స్ గా మారుస్తుంది.
ఏదో ఒక సందర్భంలో మనం ఫోన్ మర్చిపోతుంటాం. తెలిసిన తరువాత గాబరా పడిపోతాం. ఇప్పుడు దాని గురించి కంగారు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే కనిపించకుండా పోయిన ఫోన్ వెతికేందుకు గూగుల్ కొత్తగా ఓ ఫీచర్ ను రూపొందించింది.
ఇప్పుడు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ఎంత మాత్రం స్మార్ట్ ఫోన్లు అయినా అవి కూడా అప్పుడప్పుడు సతాయిస్తుంటాయి. అయితే స్మార్ట్ఫోన్తో చిక్కులు అందరికీ కామనే. అయితే వాటిలో కొన్ని మనం సులభంగా పరిష్కరించుకోవచ్చు.
మనం ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలని అనుకున్నప్పుడే మొబైల్ లో ఛార్జింగ్ అయిపోతుంది. మళ్లీ అది ఛార్జ్ అవ్వాలంటే ఎలా లేదనుకున్నా ఓ 15 నిమిషాలు పడుతుంది. అలా కాకుండా ఒక్క నిమిషంలోనే రీఛార్జయ్యే అల్యూమినియం బ్యాటరీని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
మైక్రోసాఫ్ట్ సంస్థ మరో రెండు కొత్త మొబైల్ మోడల్స్ లూమియా 640, లూమియా 640 xL లను భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. లూమియా 640 ధర రూ. 11,999 లూమియా 640 xL ధర 15,799 గా ఉన్నాయి. రెండు మోడల్స్ ఎల్టీఈ వెర్షన్ లో కూడా అందుబాటులో ఉన్నాయి.
కంప్యూటర్ దిగ్గజం ఆపిల్ సెల్ఫోన్ల రంగంలోకి కూడా ప్రవేశించి తన సత్తా ఏమిటో నిరూపించుకుంది. ఇటీవలి కాలంలో ఆపిల్ సంస్థ తన పరిధిని మరింత విస్తృతం చేసుకుంటూ ఇతర రంగాలలో కూడా ప్రవేశించే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆపిల్ సంస్థ కారును రూపొందించే పనిలో నిమగ్నమై వుంది. ఇప్పుడు ఈ సంస్థ ఇళ్ళకు, కార్యాలయాలకు వేసే తాళాల తయారీ రంగంలో కూడా కృషిని ప్రారంభించింది. తాళం చేతుల అవసరం లేకుండా కేవలం ఫోన్ల ద్వారా వేయగలిగిన తాళాలను రూపొందించే పనిలో ఆపిల్ సంస్థ వుంది.





