మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం.. రేవంత్ రెడ్డి శ‌పథం.. బీఆర్ఎస్ కింకర్తవ్యం!

Publish Date:Nov 8, 2024

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికారపగ్గాలు చేపట్టిన నాటి నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్ పై దూకుడుగానే ముందుకెళ్తున్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో అధికార బీఆర్ఎస్ పార్టీపై విమ‌ర్శ‌ల దాడి చేసిన రేవంత్‌.. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా అదే ఫార్ములాను అమ‌లు చేస్తున్నారు. త‌ద్వారా రేవంత్ దూకుడుతో  బీఆర్ఎస్ తేలిపోతున్న ప‌రిస్థితి. తెలంగాణ రాజ‌కీయాల్లో ప‌దేళ్లుగా పెద్ద‌దిక్కుగా ఉంటూ వ‌చ్చిన మాజీ సీఎం కేసీఆర్‌ అధికారం కోల్పోయిన త‌రువాత కేవ‌లం త‌న ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఒక ప‌క్క అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు కేటీఆర్ ఆధ్వ‌ర్యంలో బీఆర్ఎస్ నేత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. కేసీఆర్  మాత్రం నోరు మెద‌ప‌డం లేదు. దీంతో అధికార కాంగ్రెస్ ను ఎదుర్కోవ‌టంలో బీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో స‌ఫ‌లం కావ‌డం లేదు.

దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న నేత‌ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయం మేమే అని చెప్పుకుంటున్న బీజేపీ నేత‌లు సైతం ప్ర‌జాస‌మ‌స్య‌లపై గ‌ళ‌మెత్త‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నారు.  బీజేపీలో ఒక‌రిద్ద‌రు నేత‌లు మిన‌హా మిగిలిన నేత‌లు రేవంత్ స‌ర్కార్ వైఫ‌ల్యాల‌ను ఎత్తిచూపేందుకు అసలు ప్రయత్నమే చేయడం లేదు. తాజాగా హైడ్రా, మూసీ ప్ర‌క్షాళ‌న విష‌యంలోనూ బీఆర్ఎస్ నేతల నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యలోపం  కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. అలాగే బీజీపీ కూడా మూసీ ప్రక్షాళన, హైడ్రా విషయంలో  ఉదాశీనంగానే ఉంటోందని రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. 

మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి  (మూసీ నది ప్రక్షాళన) ప్రాజెక్టు తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్ర‌క్షాళ‌న‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. హైదరాబాద్‌ను వరదల నుంచి రక్షించేందుకు, ఆక్రమణకు గురైన మూసీ నది పరివాహక ప్రాంతాలను పునరుద్ధరించి, కాలుష్య కోరల నుంచి మూసీని కాపాడేందుకు   మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. అధికారులు ముందుగా మూసీ నది ఎఫ్‌టీఎల్‌ పరిధిని సర్వే చేశారు. ఈ సర్వేలో దాదాపు 16 వేల నివాసాలు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నట్లు తేలింది. అందులో పేద, మధ్యతరగతి వారు నివసిస్తున్నారు. దీంతో ప్రభుత్వం  మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న పేదలకు ఉచితంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వాలని   నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే జీఓ కూడా జారీ చేసింది. పోలీసు భద్రత మధ్య కూల్చి వేయాల్సిన ఇళ్లకు అధికారులు మార్క్ వేశారు. ప‌లు ప్రాంతాల్లో ఇళ్ల‌ను   కూల్చివేశారు. దీంతో స్థానికంగా మెజార్టీ ప్ర‌జ‌ల నుంచి తెలంగాణ ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌య్యింది. త‌మ ఇళ్ల‌ను కూల్చొద్దంటూ మూసీ బాధితులు ఆందోళ‌న‌కు దిగారు. వారికి అండ‌గా ఉంటామ‌ని బీఆర్ఎస్‌, బీజేపీ నేత‌లు హామీలిచ్చారు. కొంద‌రు నేతలు బుల్డోజ‌ర్లు బాధితుల‌ ఇళ్ల‌పైకి వెళ్లాలంటే మ‌మ్మ‌ల్ని దాటుకొని వెళ్లాలంటూ రేవంత్ స‌ర్కార్ కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. కానీ, రేవంత్ స‌ర్కార్ మాత్రం మూసీ సుంద‌రీక‌ర‌ణ విష‌యంలో ఏమాత్రం వెన‌క్కు త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. 

తాజాగా సీఎం రేవంత్ రెడ్డి త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మూసీ పున‌రుజ్జీవ‌న పాద‌యాత్ర చేప‌ట్టారు. సంగెంలోని మూసీ న‌ది ఒడ్డున ఉన్న శివ‌లింగానికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి యాత్ర‌ను మొద‌లు పెట్టారు. యాదాద్రి జిల్లా వ‌లిగొండ మండ‌లం సంగెం నుంచి భీమ‌లింగం వ‌ర‌కు సుమారు మూడు కిలో మీట‌ర్ల మేర రేవంత్ పాద‌యాత్ర కొన‌సాగింది. అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీ ప్ర‌క్షాళ‌న చేసి తీరుతామ‌ని, వెన‌క్కు త‌గ్గేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. చారిత్రాత్మ‌క‌మైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవాల‌ని చూస్తే కేసీఆర్ కుక్క‌చావు చ‌స్తార‌ని, కేటీఆర్, హ‌రీశ్ రావుల‌పై బుల్డోజ‌ర్ల‌తో తొక్కుకుంటూ ముందుకు వెళ్తామ‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

ఈ పాద‌యాత్ర కేవ‌లం ట్రైల‌ర్ మాత్ర‌మే.. అస‌లు సినిమా ముందుందని రేవంత్ పేర్కొన్నారు. 2025 జనవరి మొదటి వారంలో వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర మొదలు పెడతానని, ముఫ్పై రోజుల్లో మూసి ప్రక్షాళన ప్రాజెక్టు డిజైన్లు ఖరారు అవుతాయన్నారు. ఒక విధంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌కు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్ర‌మంలో వారు ఎలా రియాక్ట్ అవుతార‌నే విష‌యం ఆస‌క్తిక‌రంగా మారింది. 

మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న అనేది హైద‌రాబాద్ వాసుల‌కు సంతోషించే విష‌య‌మ‌నే చెప్పాలి. గ‌తంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆ మేర‌కు ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ అడుగులు ముందుకు ప‌డ‌లేదు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి  మాత్రం ప‌ట్టుద‌ల‌తో ముందుకెళ్తున్నారు. మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లోని నివాస‌దారుల‌ను ఒప్పించి, వారికి డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు క‌ట్టిస్తామనీ,  మూసీ ప్ర‌క్షాళ‌న విషయంలో మాత్రం వెనకడుగు లేదనీ విస్ఫష్టంగా చెబుతున్నారు.  అయితే, స్థానికంగా ప్ర‌జ‌ల నుంచి ప్ర‌భుత్వం తీరుపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మవుతున్నది. మ‌రో ఏడాదిన్న‌ర‌లో గ్రేట‌ర్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో  మూసీ న‌ది ప్ర‌క్షాళ‌నతో పార్టీకి న‌ష్టం వాటిళ్లుతుంద‌ని కొంద‌రు కాంగ్రెస్ నేత‌ల్లో ఆందోళ‌న నెల‌కొంది. అయినా సీఎం రేవంత్ ఎక్క‌డా వెన‌క‌డుగు వేసేందుకు ఇష్ట‌ప‌డటం లేదు. మ‌రోవైపు మూసీ బాధితుల త‌ర‌పున పోరాటం చేసేందుకు ప్ర‌తిప‌క్షాలు ముందుకొచ్చిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం దూకుడు ముందు నిల‌వ‌లేక పోతున్నాయి. తాజాగా సీఎం రేవంత్ వ్యాఖ్యల‌తో మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న ప‌నులువేగం పుంజుకోనుంది. అయితే, విపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ రేవంత్ దూకుడుకు ఏ మేర‌కు అడ్డుక‌ట్ట వేస్తాయి, మూసీ బాధితుల‌కు ఏ మేర‌కు అండ‌గా నిలుస్తాయ‌నేది వేచి చూడాల్సిందే.

By
en-us Political News

  
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.