Publish Date:May 22, 2025
పాకిస్థాన్ సహా ప్రపంచంలో ఏ మూల నక్కినా ఉగ్రవాదులను వదిలే ప్రశక్తే లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ప్రస్తుతం నెదర్లాండ్ లో పర్యటిస్తున్న జైశంకర్ అక్కడి మీడియాతో మాట్లాడారు. సిందూర్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాకిస్థాన్ తో కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఇసుమంతైనా లేదని కుండబద్దలు కొట్టారు. ట్రంప్ మాటలు పట్టించుకోబోమని ఉద్ఘాటించారు. అలాగే కాశ్మీర్పై చర్చల ప్రశ్నేలేదన్నారు. కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమేనని స్సష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పాకిస్థాన్ తన విధానంగా చేసుకుందనీ, ఈ విషయంపై భారత్ ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తోందని వివరించిన జైవంకర్ అలాంటి చర్యలకు తగిన రీతిలో బదులిచ్చే హక్కు భారత్కు ఉందని అన్నారు. .
ఏప్రిల్ 22 నాటి ఘటనలు పునరావృతమైతే, కచ్చితంగా ప్రతిస్పందన చాలా చాలా తీవ్రంగా ఉంటుందని పాక్ ను ఆపరేషన్ సిందూర్ ద్వారా హెచ్చరించామని అన్నారు. కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమే అన్న విషయంలో రెండో అభిప్రాయానికి తావే లేదనీ, తేల్చి చెప్పారు. పాకిస్థాన్ ఆక్రమించుకున్న కశ్మీర్ భాగాన్ని ఎప్పుడు ఖాళీ చేస్తారన్న విషయంపై మాత్రమే పాకిస్థాన్ తో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.అంతే కానీ నియంత్రణ రేఖ, జమ్మూకశ్మీర్ పాలనా వ్యవహారాలపై చర్చించే ప్రశ్నే లేదని జైశంకర్ చెప్పారు.
అదలా ఉండగా అంతర్జాతీయంగా భారత్ ఆపరేషన్ సిందూర్ కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదాన్నిప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ వైఖరిని ఎండగట్టేందుకు భారత్ చేపట్టిన దౌత్య యుద్ధానికి సర్వత్రా సానుకూల స్పందన లభిస్తోంది. ఏడు అఖిల పక్ష బృందాలను ప్రపంచ దేశాల పర్యటనకు పంపింది. యూఏఈ, జపాన్ లకు వెళ్లిన అఖిలపక్ష బృందాలు అక్కడి అధికారులతో భేటీ అయ్యారు. పాక్ దుశ్చర్యలు వివరించారు. ఉగ్రవాదంపై భారత్ పోరుకు యూఏఈ, జపాన్ లు పూర్తి మద్దతు ప్రకటించడమే కాకుండా భారత్ పై ప్రశంసల వర్షం కురిపించాయీ నుంచి పూర్తి మద్దతు లభిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/wount-leave-terrorists-even-they-hide-in-pak-39-198515.html
ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్లో చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మరో కీలక నేత మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ మృతి చెందారు.
బీఆర్ఎస్ పార్టీలో దెయ్యాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలే విమర్శస్తుంటే మాజీ సీఎం కేసీఆర్ నోరు విప్పలేని స్ధితిలో ఉన్నారని సీఎం రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు.
వచ్చే ఏడేళ్లలో విశాఖను మరో ముంబైలా తీర్చిదిద్దాలని అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. ఇవాళ అమరావతిలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో సీఎం చంద్రబాబు ఈ మేరకు కీలక నిర్ణయాలు ప్రకటించారు.
గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పరామర్శించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని గతంలో కేటీఆర్ ఆరోపణలు చేశారు
క్వార్జ్ట్ అక్రమ తవ్వకాల కేసులో నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి ఇప్పట్లో బెయిల్ లభించే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా కోర్టు ఆదేశాలతో కాకాణిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
తన తండ్రి, వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం క్యాన్సర్తో బాధపడుతున్నారనీ, అయితే తన సోదరుడు ముద్రగిరి ఆయనకు కనీసం వైద్యం అందించకుండా వేధిస్తున్నారనీ, ఆయన ఎవరినీ కలవకుండా, ఆయనను ఎవరూ చూడకుండా అడ్డు పడుతున్నారనీ ముద్రగడ కుమార్తె క్రాంతి ట్వీట్ చేశారు.
ప్రపంచంలోనే ఎత్తయిన చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అదేవిధంగా కట్రాలో రూ.46 వేల కోట్లతో విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో ప్రారంభోత్సవాలు చేశారు.
ఇప్పటి వరకూ అత్యధిక గెలుపులంటే అవి ఆస్ట్రేలియావే. ఇప్పటి వరకూ వరల్డ్ క్రికెట్ ని ఈ దేశం శాసించినంతగా మరే దేశం శాసించలేదు. తొలి రోజుల్లో వెస్టిండీస్ ఇలాగే ఉన్నా.. తర్వాతి కాలంలో ఆస్ట్రేలియా ఈ విజయ పరంపర అందిపుచ్చుకుంది.
విరాళాలిచ్చి మరీ ట్రంప్ ని గెలిపించిన మస్క్ రివర్స్ కు కారణమేంటి?
హైదరాబాద్ నగరంలో రాబోయే 4 నెలలు స్పెషల్ డ్రైవ్ చేపడతామని హైడ్రా కమీషనర్ రంగనాథ్ తెలిపారు. నాలాలపై అక్రమంగా నిర్మించిన కమర్షియల్ భవనలను తొలిగిస్తామని కమీషన్ తెలిపారు.
ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన ఘటనపై సిద్దరామయ్య సర్కార్ సీరియస్ అయ్యింది.
దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 489 కొత్త కేసులు నమోదయ్యాయి