చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్.. ప్రపంచం చూపు ఏపీ వైపు

Publish Date:Nov 1, 2024

Advertisement

ప్రపంచం మొత్తం  ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. రాష్ట్ర విభజన తో అప్పులు వినా ఆస్తులు లేని రాష్ట్రంలో, కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రంగా అన్నిటికీ మించి రెవెన్యూ లోటుతో విభజిత ఆంధ్రప్రదేశ్ ఒక అనాధలా మిగిలింది. అలాంటి రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా రూపుదిద్దగలిగేది ఒక్క చంద్రబాబునాయుడు మాత్రమేనని విశ్వసించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు  2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి విజయాన్ని కట్టబెట్టారు. నవ్యాంధ్రప్రదేశ్  తొలి ముఖ్యమంత్రిగా  చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అంటూ రాష్ట్ర ప్రగతికి బాటలు పరిచారు. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి తొలి అడుగులు పడ్డాయి. రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం నిర్మాణం ఆరంభం కావడమే కాదు.. నిర్మాణ పనులు వేగంగా జరిగాయి. మూడు వంతుల ప్రాజెక్టు పూర్తయ్యింది. అంతే కాదు.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో చంద్రబాబు ఐదేళ్ల హయాంలో మూడేళ్లు దేశంలోనే నంబర్ వన్ గా నిలిచింది. ప్రజలకు విద్యుత్ కష్టాలు లేవు. ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందాయి.పింఛనర్లకూ అదే తేదీన ఠంచనుగా పించన్లు అందాయి. 
ప్రపంచం నలుమూలల నుంచీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు. కియా వంటి పలు పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లకు దీటుగా ఏపీలో ఐటీ పుంజుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారడానికి ఎంతో కాలం పట్టదని అంతా భావిస్తున్న సమయంలో 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. 
వైసీపీ విజయం సాధించి.. జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు అందుకున్నారు. ఆ నాటి నుంచి ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో అంధయుగం నడుస్తున్నదా అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. చంద్రబాబు విజన్ కారణంగా, చంద్రబాబు కష్టం కారణంగా రాష్ట్రంలో గ్రౌండింగ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న ఎన్నో పరిశ్రమలు ముఖం చాటేశాయి. అప్పటికే గ్రౌండ్ అయిన మరిన్న పరిశ్రమలు రాష్ట్రం దాటి వెళ్లిపోయాయి. ఎన్నో ఏళ్లుగా రాష్ట్రంలో ఉన్న అమరరాజా బ్యాటరీస్ వంటి సంస్థలు సైతం రాష్ట్రంలో కొనసాగడం మా వల్ల కాదని పొరుగు రాష్ట్రానికి తరలిపోయాయి. రాష్ట్రంలో అరాచక పాలన ఐదేళ్ల పాటు యథేచ్ఛగా కొనసాగింది. సమాజంలోని ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా జగన్ సర్కార్ వేధింపులకు గురి చేసింది. పాలన కక్ష సాధింపు, దోపిడీ, దౌర్జన్యం, అవినీతే అన్నట్లుగా జగన్ హయాంలో రాష్ట్రంలో పాలన సాగింది. 

2024 ఎన్నికలలో జనం జగన్ దుర్మార్గ పాలనకు చరమ గీతం పాడారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించే చంద్రబాబు నాయకత్వానికి పట్టం కట్టారు. చరిత్ర కనీవినీ ఎరుగని రీతిలో తెలుగుదేశం కూటమికి పట్టం కట్టారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి కొలువుదీరింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచే రాష్ట్రంలో ప్రొగ్రసివ్ వైబ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచం చూపు మళ్లీ ఏపీ వైపు మళ్లింది. తరిలిపోయిన పరిశ్రమలు ఒక్కటొక్కటిగా మళ్లీ రాష్ట్రానికి రావడం మొదలైంది.పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో  తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి, విస్తరించడానికి ఆసక్తి చూపుతున్నాయి. 
తెలుగుదేశం కూటమి కొలువుదీరిన నాలుగు నెలల వ్యవధిలోనే ఇంతటి మార్పు కనిపించడానికి ప్రధాన కారణం విజనరీ చంద్రబాబు. ఆయన ప్రూవెన్ ఎబిలిటీ. 

చంద్రబాబు ముఖ్యమంత్రిగా  బాధ్యతలు చేపట్టిన తరువాత ఏపీ ముఖచిత్రం మారిపోయింది. టాటా చైర్మన్ తో  రాష్ట్ర ఐటీ మంత్రి కేవలం గంటన్నర భేటీతోనే రాష్ట్రానికి టీసీఎస్ వచ్చింది. ఒక్క ఈమెయిల్ తో సత్య నాదెళ్ల అప్పాయింట్ మెంట్ ఖరారైంది.  లోకేష్ వారంరోజుల అమెరికా పర్యటనలో  ఆయనకు దిగ్గజ పరిశ్రమలన్నీ రెడ్ కార్పెట్ పరియాయి. కేవలం ఏదో కలిశాం, వచ్చేశాం అన్నట్లుగా కాకుండా నారా లోకేష్ సమావేశమైన దిగ్గజ కంపెనీలన్నీ రాష్ట్రంలో పెట్టుబడులకు సానుకూలంగా స్పందించాయి. అసలు నారా లోకేష్ కు అమెరికాలో పారిశ్రామిక వేత్తలు రెడ్ కార్పెట్ పరిచారంటే అందుకు కారణం ఆయన ఎఫిషియెన్సీకి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ తోడు కావడమే. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ కారణంగానే ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది.     

By
en-us Political News

  
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.