ప్రాణాలను మింగేసే అధిక రక్తపోటు ఎందుకు వస్తుంది.. దాన్ని అదుపు చేయడం ఎలాగంటే!

Publish Date:May 17, 2023

Advertisement

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తీవ్రమైన ఆరోగ్య సమస్యలలో అధిక రక్తపోటు ఒకటి. హైపర్ టెన్షన్ గా పేర్కొనే ఈ సమస్య హృదయ సంబంధ వ్యాధులకు దారితీయవచ్చు. రక్తపోటు పెరగడం అనేది  వృద్ధాప్య సమస్య అని ఇంతకుముందు అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం హైపర్ టెన్షన్ కు యువత కూడా బాధితులుగా మారుతున్నారు.  

ఒక అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ కంటే ఎక్కువ మందికి రక్తపోటు సమస్యలు ఉన్నాయి, ప్రతి నలుగురిలో ఒకరు రక్తపోటు బాధితులు. అధిక రక్తపోటు గురించి అవగాహన కల్పించడానికి, నివారణ చర్యలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం భారతదేశంలోని ప్రతి నలుగురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు, అయితే వారిలో 12% మంది మాత్రమే తమ రక్తపోటును నియంత్రించగలుగుతున్నారు. రక్తపోటును నిరంతరం పర్యవేక్షిస్తూ, అదుపులో ఉంచుకోవడమే అందరూ చేయాల్సిన ప్రథమ కర్తవ్యం అని అంటున్నారు వైద్యులు. అసలు యువతలో అధిక రక్తపోటు ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి?? దాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఏమి చేయాలి?? తెలుసుకుంటే..

అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా, యువకులు రక్తపోటు సమస్యకు గురవుతున్నారు. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చేయకపోవడం, ఆహారంలో సోడియం అధికంగా తీసుకోవడం, జంక్-ఫాస్ట్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. గర్భధారణ సమయంలో కూడా అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఈ రకమైన జీవనశైలిని గడుపుతున్నట్లయితే, జాగ్రత్తగా ఉండాలి, అది రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. 

మీరు మీ దినచర్యలో కొన్ని సాధారణ మార్పులు చేయడం ద్వారా కూడా ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

బరువును అదుపులో ఉంచుకోవాలి..

ఆరోగ్యకరమైన బరువును మైంటైన్ చేయడం వలన అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఊబకాయం సమస్య మధుమేహం, అధిక రక్తపోటుతో పాటు అనేక ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. శారీరకంగా చురుగ్గా ఉండడంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంచుకోవచ్చు.  బరువు పెరుగుతున్నట్లయితే, దానిని నియంత్రించడానికి ప్రయత్నించాలి. 

సమతుల్య ఆహారం, సోడియం తీసుకోవడం తగ్గించడం.. 

సమతుల్య ఆహారం మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఆహారంలో సోడియం, చక్కెర మరియు అనారోగ్యకరమైన కొవ్వుల పరిమాణాన్ని తగ్గించడం ద్వారా మీరు రక్తపోటును నియంత్రించవచ్చు. రక్తపోటును అదుపులో ఉంచడానికి, ఇతర వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఆహారంలో కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, గింజల పరిమాణాన్ని పెంచాలి. మిమ్మల్ని  మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంతో  అవసరం. ఆహారంలో  ఎక్కువ ఉప్పు తీసుకుంటే అది ప్రమాదాలను పెంచుతుంది.

వ్యాయామం చాలా ముఖ్యం

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం గొప్ప అలవాటు.  ఈ అలవాటు రక్తపోటు ప్రమాదం నుండి రక్షించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బులు-మధుమేహం, దాని సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నిస్సారమైన జీవనశైలిని కలిగున్న వ్యక్తులకు ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి..

డైలీ లైఫ్ స్టైల్ ను  సరిగ్గా పాటిస్తే.. హైపర్ టెన్షన్ ను అదుపులోకి తీసుకురావచ్చు. తద్వారా దీర్ఘయుష్షు సొంతమవుతుంది.  

                                   ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి..
మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది...
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. ..
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో..
నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి...
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు.  కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.....
వేసవి అంటే మండే ఎండలు, వేడి గాలులు,  చెమటలు పట్టించే వాతావరణం.. ఇవన్నీ ఉంటాయి.  ఇలాంటి రోజుల్లో  రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా కలపడం వల్ల చెరకు రసం  రుచి మరింత ఇనుమడిస్తుంది...
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని..
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై..
నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్..
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.