Publish Date:May 17, 2023
పురాణాల్లో సమాచారం చేరవేతకు మేఘ సందేశాలు, హనుమంతుడు, నారదుడు, హంస, పావురాళ్లు... ఆ తర్వాత ఉత్తరాలు.. టెలిగ్రాములు, నెక్ట్స్ ల్యాండ్ లైన్లు.. ఇటీవల ఇంటర్నెట్ కనెక్షన్లు.. తాజాగా సెల్ ఫోన్లు.. 4జీలు, 5 జీలు అంతా సమాచార యుగం. గతంలో సమాచారం ఒకరి నుంచి మరొకరికి చేరాలంటే.. . ఏళ్లూ పూళ్లూ పట్టేది. ఆ తరువాత క్రమంగా నెలలు, పక్షాలు, వారాలు, రోజులు నుంచి గంటలు, నిమిషాలు.. చివరకు సెకన్లకు చేరుకొంది. దీంతో ప్రపంచంలోని సమాచారమంతా ఆ మూల నుంచి ఈ మూల వరకూ ఇప్పుడు సెకన్లలో చేరిపోతోంది. దీంతో సమాచార యుగంలో సమాచార ప్రసారం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఇట్టే అర్థమైపోతోంది. మే 17వ తేదీ.. ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం. 2005 నుండి ప్రతి సంవత్సరం మే 17ను ప్రపంచ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డేగా పాటిస్తు వస్తున్నారు.
తొలుత అంతర్జాతీయ టెలిగ్రాఫ్ కన్వెన్షన్పై 1865 మే 17న పారిస్లో సంతకం చేశారు. 1969, మే 17న ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవాన్ని తొలిసారిగా జరుపుకున్నారు. ఆ క్రమంలో తొలిసారి సంతకం చేసిన మే 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్ దినోత్సవంగా జరుపుకొంటున్నారు. అయితే దీన్ని ప్రాముఖ్యతను యావత్ ప్రపంచ దేశాలు గుర్తించాలని 2005లో ట్యూనిస్లోని ఇన్ఫర్మేషన్ సొసైటీ శిఖరాగ్ర సమావేశంలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య తీర్మానాన్ని ప్రకటించింది. ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. ప్రపంచంలో టెలి కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉన్న దేశాల్లో భారత్ రెండవ అతి పెద్ద దేశంగా అవతరించింది.
మరోవైపు.. ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకుపోతోంది. దేశా ఆర్థిక పరిపుష్టికి సమాచార రంగం కీలక పాత్ర పోషిస్తోంది. సెల్ ఫోన్ తయారీ నుంచి వాటి విడి భాగాలు ఇతర దేశాలకు ఎగుమతి వరకు చైనాతో పోటీ పడుతోంది. అలాగే నగదు లావాదేవిలు, అన్లైన్ సేవలు, వగైరా వగైరా అన్ని సెల్ ఫోన్ కేంద్రంగానే సాగుతోన్నాయి. అంతేకాదు.. సెల్ ఫోన్ రీచార్జ్ల పేరుతో అటు పలు నెట్ వర్క్ కంపెనీలకు ఇటు ప్రభుత్వానికి సైతం భారీగా ఆదాయం సమకూరుతోంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థకు ఈ టెలికమ్యూనికేషన్స్ రంగం వెన్నుదన్నుగా నిలుస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదు.
మరోవైపు ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్పై ప్రభుత్వం అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు సైతం చేపడుతోంది. నవంబర్ 2006లో టర్కీలోని అంటాల్యాలో జరిగిన ITU ప్లీనిపోటెన్షియరీ కాన్ఫరెన్స్ మే 17ను ప్రపంచ టెలికమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. అలాగే ప్రపంచ కమ్యూనికేషన్ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత, ఇంటర్నెట్ గురించి సానుకూలతను వ్యాప్తి చేయడం. అదే విధంగా ప్రపంచ టెలికమ్యూనికేషన్ డే అనేది మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సమాచారం అందుబాటులోకి తీసుకురావడమే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/world-communications-day-39-155472.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది