Publish Date:May 17, 2023
తెలుగువన్ చెప్పినట్లే జరుగుతోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం జాతీయ స్థాయిలో సమీకరణాలు మార్చేస్తుందని తెలుగువన్ సరిగ్గా అంచనా వేసింది. కర్నాటకలో కాంగ్రెస్ విజయం బీజేపీయేతర పార్టీలన్నీ కాంగ్రెస్ గొడుకు కింద ఐక్యతారాగం ఆలపించేందుకు ప్రేరేపిస్తుందని తెలుగువన్ ముందుగానే చెప్పింది. ఆ విధంగానే కర్నాటక ఫలితం వచ్చిన రెండో రోజు నుంచే విపక్షాల ఐక్యతారాగంలో మార్పు కనిపించింది. క
ర్నాటక ఫలితానికి ముందు వరకూ కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి అంటూ వచ్చిన పార్టీలు.. కాంగ్రెస్సేతర అనే మాటను వెనక్కు తీసుకున్నాయి. బీజేపీయేతర కూటమి అంటూ తమ గొంతు సవరించుకున్నాయి. ముందుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ బలంగా ఉన్న చోట్ల తాము ఆ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించింది.
అంతకు ముందు వరకూ కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి అంటూ చెవినిల్లు కట్లుకుని ప్రచారం చేసిన మమతా బెనర్జీ కర్నాటక ఫలితంతో స్వరం మార్చారు. కేంద్రంలో కాంగ్రెస్ ను గద్దె దించాలంటే కాంగ్రెస్ సహకారం తప్పని సరి అని గుర్తించారు. ఇప్పటికే యూపీయే కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ వెనుక చేరడానికి మమతా బెనర్జీ ఒక అడుగు ముందుకు వేశారు. ఆ తరువాత ఒక రోజు వ్యవధిలోనే సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ కు మద్దతుగా గొంతు కలిపారు. మమతా బెనర్జీ అభిప్రాయంతో తాను వంద శాతం ఏకీభవిస్తున్నానని ప్రకటించారు. 2024 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత కోసం కృషి చేయాల్సి ఉందని, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉంటే అక్కడే పోటీ చేయాలని అభిప్రాయపడ్డారు. బిహార్, తెలంగాణ ముఖ్యమంత్రులు నీతీశ్ కుమార్, కేసీఆర్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా ఉన్నచోట ఆ పార్టీకే మద్దతిస్తామని మమత సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
కర్ణాటకలో కాంగ్రెస్ సంతృప్తికర విజయంతో అధికారాన్ని చేజిక్కించుకున్న నేపథ్యంలో ఆ పార్టీ అటు ప్రజలతో పాటు..ఇటు తోటి ప్రతిపక్ష పార్టీల్లో కూడా ఓ ప్రత్యేక ఇమేజ్ సంతరించుకుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సక్సెస్ ఫలితంగానే ఇది సాధ్యపడిందని పార్టీ శ్రేణులు సంబర పడుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేందుకు పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలకు పెరుగుతున్న గ్రాఫ్ ఓ మంచి టానిక్కులా పని చేస్తుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mamata-and-akilesh-back-ncongress-39-155475.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది