మహిళల టి20 వరల్డ్ కప్.. పాకిస్థాన్ ను చిత్తు చేసిన బంగ్లాదేశ్

Publish Date:Jun 20, 2026

Advertisement

మహిళల టీ20 వరల్డ్ కప్ లో సంచలనం నమోదైంది. బంగ్లాదేశ్ మహిళల జట్టు పాకిస్థాన్ విమెన్స్ టీమ్ న చిత్తు చేసింది.  . గ్రూప్-1లో భాగంగా శనివారం (జూన్ 20) జరిగిన కీలక పోరులో పాకిస్థాన్ జట్టుపై బంగ్లాదేశ్ మహిళల జట్టు 23 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. పటిష్ఠమైన బౌలింగ్ ప్రదర్శనతో పాక్ బ్యాటింగ్ విభాగాన్ని కట్టడి చేసిన బంగ్లాదేశ్.. ఈ విజయంతో    తమ సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

సౌతాంప్టన్‌లోని  రోజ్ బౌల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత  బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్  నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.   కెప్టెన్ నిగర్ సుల్తానా 36 పరుగులు, శోభన మోస్తరీ22 పరుగులతో రాణించారు. ఇక చివరి  ఓవర్లలో షోర్నా అక్తర్   కేవలం 22 బంతుల్లోనే 5 ఫోర్ల సాయంతో అజేయంగా 39 పరుగులు సాధించడంతో బంగ్లా జట్టు ఆ మాత్రం స్కోరైనా చేరగలిగింది.  పాకిస్థాన్ బౌలర్లలో ఫాతిమా సనా రెండు వికెట్లు పడగొట్టింది.

అనంతరం 124 పరుగుల  లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ జట్టుకు మంచి ఆరంభమే లభించింది. మునీబా అలీ పాతిక పరుగులు, గుల్ ఫిరోజా 23 సరుగులు చేశారు. దీంతో ఒక దశలో పాకిస్థాన్  రెండు వికెట్ల నష్టానికి 64 పరుగులతో పటిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే ఆ తర్వాత బంగ్లాదేశ్ స్పిన్ బౌలర్లు మ్యాచ్‌ను తిప్పేశారు.  బంగ్లాదేశ్ స్పిన్ ద్వయం నహిదా అక్తర్, సంజిదా అక్తర్ మేఘల   పాకిస్థాన్ మిడిలార్డర్‌ను కుప్పకూల్చారు. వీరిద్దరూ చెరో మూడు వికెట్లు పడగొట్టి పాక్ ను కోలుకోలేని దెబ్బ తిశారు.   దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ జట్టు 8 వికెట్ల నష్టానికి కేవలం 100 పరుగులు మాత్రమే చేసి పరాజయాన్ని మూటగట్టుకుంది. 

ప్రస్తుత ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పాకిస్థాన్ జట్టుకు ఇది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైన పాక్ జట్టు పాయింట్ల పట్టికలో  దిగువ స్థానానికి పడిపోయింది. ఈ వరుస పరాజయాలతో ఆ జట్టు సెమీఫైనల్ చేరే అవకాశాలు దాదాపుగా మృగ్యమయ్యాయి.  మరోవైపు ఈ  విజయంతో బంగ్లాదేశ్ సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి.  

By
en-us Political News

  
గాదె సాయికృష్ణ అదృశ్యం ఉదంతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనంగా మారింది.
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.
ప్రముఖ సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు కన్నుమూశారు.
విశాఖలోని రుషికొండ ప్యాలెస్ ను పీపీ పద్ధతిలో ఆతిథ్య రంగానికి అప్పగించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నట్టు ముగ్గురు మంత్రుల కమిటీ ప్రకటించింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లతో యోగభ్యాసం చేయించిన రామ్ దేవ్ బాబా
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం, అలాగే పోలీసుల కస్టడీలోనే అతను మరణించాడంటూ వస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
యోగా గురు  బాబా రామ్‌దేవ్‌తో కలిసి ఆయన ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఇక్కడి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం  జరిగిన ఈ  కార్యక్రమంలో వేలాది మంది   పాల్గొని రికార్డు సృష్టించారు.
ఈ నెల 26వ తేదీ వరకు మధ్యం తర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు బండి భగీరథ జైలు నుంచి మధ్యంతర బెయిల్‌ పై విడుదలయ్యారు.
. ఆ అంగన్వాడీ కేంద్రంలో పిల్లల కోసం అందుబాటులో ఉన్న వసతులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న పోషకాహార సేవలపై ఆరా తీశారు. కేంద్రంలోని నిల్వల రిజిస్టర్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బంది సరికొత్త ఇండక్షన్ స్టవ్‌పై తయారు చేసిన రాగి జావను సీఎంకు అందించగా.. ఆయన చిన్నారుల పక్కనే కూర్చుని దానిని సేవించారు. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేలా అంగన్‌వాడీ ఆవరణలో ఒక మొక్కను నాటారు.
2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అతని వర్క్‌లోడ్‌ను మేనేజ్ చేయడానికే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ప్రస్తుతం హార్దిక్ బౌలింగ్ చేసేందుకు పూర్తిగా ఫిట్‌గా లేడని సమాచారం. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ సారథ్యంలో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో కూడా హార్దిక్ ఆడటం లేదు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పల్నాడు జిల్లా పర్యటనలో ఒక సామాన్య గృహస్థుడిగా మారిపోయారు. స్థానిక రైతు క్షేత్రంలో ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన కోల్డ్‌ప్రెస్డ్ వేరుశనగ నూనెను కొనుగోలు చేసే క్రమంలో ఆయన తన సతీమణి భువనేశ్వరికి ఫోన్ చేశారు. చేసి వేరుశనగ నూనె కొనమంటావా అని అడిగారు.
ఆ తర్వాత అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అంపైర్ ఇచ్చిన పెనాల్టీ రన్స్ తో కలిసి టీమ్ ఇండియా తొలి ఓవర్ లో ఏకంగా 23 పరుగులు సాధించింది. దీంతో 2004లో బంగ్లాదేశ్‌పై తొలి ఓవర్లోనే 22 పరుగులు సాధించి నెలకొల్పిన పాత రికార్డు కనుమరుగైపోయింది.
ఇందులో సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు ఆధునిక ప్రపంచానికి అవసరమైన ప్రాథమిక డిజిటల్ నైపుణ్యాలపై కాలేజీలోనే ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత డిగ్రీ చివరి సంవత్సరం అంటే మూడో ఏడాదిలో విద్యార్థులు నేరుగా క్షేత్రస్థాయి పరిశ్రమలతో అనుసంధానమైన ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లోకి అడుగుపెడతారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.