మహిళా బిల్లును అడ్డుకోవడం జాతి విద్రోహం...విపక్షాలపై చంద్రబాబు ఫైర్

Publish Date:Apr 18, 2026

Advertisement

 

పార్లమెంటు వేదికగా మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్షాలు దేశ మహిళలకు, ప్రజాస్వామ్యానికి తీవ్ర ద్రోహం చేశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. దేశవ్యాప్తంగా మహిళలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఈ చారిత్రక బిల్లును, సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుకోవడం దారుణమని ఆయన విమర్శించారు.

 

 

తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో శనివారం ఎన్డీఏ పక్షాలు ఏర్పాటు చేసిన భారీ నిరసన ర్యాలీలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య చరిత్రలో ఈ ఘటన ఒక ‘బ్లాక్ డే’ అని అభివర్ణించారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు దక్కకుండా చేసిన విపక్షాల తీరు, ఆడబిడ్డల పట్ల వారికున్న చులకన భావానికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు.

ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడమే కాకుండా, సమాజంలో వారి ఆత్మగౌరవం మరింత పెరుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి నష్టం జరగదని, సీట్ల పెంపుదల ద్వారా అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ, విపక్షాలు లేనిపోని సాకులు సృష్టించి అడ్డుకున్నాయని ఆయన ఆరోపించారు.

గతంలో తమ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిందని గుర్తు చేసిన చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం బిల్లును ముందుకు తీసుకురాలేకపోయిందని విమర్శించారు. నేడు రిజర్వేషన్లను నీరుగార్చడం ద్వారా ఆ పార్టీలు తమ అసమర్థతను, మహిళా వ్యతిరేకతను బయటపెట్టుకున్నాయని ఎద్దేవా చేశారు.

ఈ విద్రోహాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్తామని, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్న పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, డిపాజిట్లు కూడా దక్కకుండా చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

 

 

ఈ నిరసన కేవలం ఆరంభం మాత్రమేనని, మహిళల హక్కుల సాధన కోసం ఎన్డీఏ పక్షాలు భవిష్యత్తులో కూడా ఉద్యమాలను కొనసాగిస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మహిళలందరూ ఈ కుట్రను గమనించాలని, తగిన సమయంలో విపక్షాలకు సరైన సమాధానం చెప్పాలని ఆయన కోరారు.

By
en-us Political News

  
యాంకర్ విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ పేరు! ప్రస్తుతం స్టార్ యాంకర్‌గా, సోషల్ మీడియా సెన్సేషన్‌గా ఆమె సంపాదిస్తున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల పరిస్థితిపై చర్చ జోరుగా సాగుతోంది.
అధికారిక గణాంకాలు అభివృద్ధిని సూచిస్తున్నా, క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు వాస్తవ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నయో అద్ధం పడుతున్నాయి. ప్రజలకు అండగా ఉండాల్సిన బ్యాంకులు, ఆసుపత్రులు, ప్రభుత్వ రంగాలు ఇప్పుడు వాటి అస్థిత్వం కోసం సామాన్యుడిని ఆర్థికంగా వేధించే యంత్రాలుగా.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాబందులుగా మారుతున్నాయనే వాస్తవాన్ని కళ్లకు కడుతున్నాయి.
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జన్మదినోత్సవం ఈనెల 20న జరగనుంది.
అధికారిక గణాంకాల్లో జీడీపీ, రిటైల్ సేల్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇలా అన్ని రంగాలలో వృద్ధి చూపిస్తాయి. కానీ నేలమీద ప్రజలు చూస్తున్నది మాత్రం వేతనాలు అందకపోవడం, బ్యాంకుల్లో దాచుకున్నడబ్బు విత్ డ్రా చేసుకోవడానికి అడ్డంకులు, ఇబ్బందులు. మూతపడుతున్నఆస్పత్రులు, కట్టుదిట్టమైన ఆలయ నియంత్రణలు, రక్షణ నుంచి ఎక్స్ట్రాక్షన్ వైపు మార్పు.
రానున్న జనాభా గణనలో ప్రజల జీవనశైలితో పాటు, వారి ఆహారపు అలవాట్లపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
ప్రముఖ భారతీయ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తాజాగా న్యాయపరమైన పోరాటానికి సిద్ధమయ్యారు.
పున‌ర్వికకు పున‌ర్జ‌న్మ‌ను ప్ర‌సాదించే చికిత్స‌కు సాయం అందించారు. విదేశాల నుంచి రూ.16 కోట్ల ఇంజెక్ష‌న్ రప్పించేందుకు స‌హ‌క‌రించారు. ఇంజెక్ష‌న్ వేసేట‌ప్పుడు చిన్నారి పున‌ర్విక చెంత‌నే ఉన్నారు. సాయం అందించిన‌ ల‌క్ష‌లాది మంది ప్రార్థ‌న‌లు ఫ‌లించాయి. పున‌ర్జ‌న్మ పొందిన పున‌ర్విక లోకేష్ చేతుల్లోంచి బోసిన‌వ్వులు చిందించింది.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
విచారణ పారదర్శ కంగా జరగాలనే ఉద్దేశంతో ప్రముఖ సంస్థలు డెల్లాయిట్, త్రిలిగల్ సహకారంతో విచారణ చేపట్టింది. ఈ కమిటీ పనితీరును టీసీసీ ప్రెసిడెంట్, సీఈవో క్రితివాసన్ పర్యవేక్షిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
తెలిసిన అబ్బా యికి తన కూతుర్ని ఇస్తే సంతోషంగా ఉంటుందని భావించిన తల్లిదండ్రులు 2024లో సంగీతకు నవీన్ తో ఘనం గా వివాహం జరిపించారు. ఆ సందర్భంగా ఆరు లక్షల కట్నంతో పాటు అన్ని లాంఛనాల ఇచ్చారు. కోటి ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టిన సంగీతకు వేధింపులు ఎదురయ్యాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఎన్డీయే సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది.
ఇద్దరు దుండగులు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న షాప్ లపై రెక్కీ నిర్వహించారు. అనంతరం గురువారం అర్ధరాత్రి సమయంలో మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుగుతూ.. హఫీజ్ పేట్ మార్తండ నగర్ లో హోల్సేల్ సిగరెట్ల షాప్ వద్ద ఆగి, ఇనుప రాడ్లతో దుకాణం తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి కొంత నగదు, విలువైన సిగరెట్ కార్టన్లు తీసుకొని దర్జాగా మళ్ళీ కారులో అక్కడి నుండి వెళ్ళిపోయారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.