Publish Date:Jun 11, 2025
జగన్ పొదిలి పర్యటన రసాబాసగా మారింది. పోగాకు వేలం కేంద్రం సందర్శన అంటూ పొదిలిలో పర్యటించిన జగన్ కు నిరసనల సెగ గట్టిగా తగిలింది. జగన్ సొంత మీడియా చానెల్ లో అమరావతిపైనా, అమరావతి మహిళలపైనా జర్నలిస్టు కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు, వాటికి సాక్షి ఉద్యోగి, మరో సీనియర్ జర్నలిస్టు అయిన కొమ్మినేని శ్రీనివాసరావు వంత పాడినట్లుగా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. మరో జర్నలిస్టు కృష్ణంరాజు పరారీలో ఉన్నారు. హైకోర్టులు ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేశారు.
ఈ తరుణంలో జగన్ పొదిలి పర్యటనకు బయలుదేరారు. దీంతో ఆయన పర్యటన పొడవునా నిరసనలు వెల్లువెత్తాయి. పెద్ద సంఖ్యలో జనం ముఖ్యంగా మహిళలు రోడ్లపైకి వచ్చి జగన్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. షేమ్ షేమ్ జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. నినాదాలు చేశారు. నల్లబెలూన్లు ప్రదర్శించారు. జగన్ సొంత మీడియా చానల్ లో ప్రసారమైన అసభ్య వ్యాఖ్యలను ఖండించకపోవడమే కాకుండా, ఆ వ్యాఖ్యలు చేసిన వారిని సమర్ధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ మౌనం వీడాలి, జగన్ రాష్ట్రం వీడాలి అంటూ నినాదాలు చేశారు. అలాగే భారతీరెడ్డి మౌనం వీడాలి అంటూ మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అలా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై వైసీపీ మూకలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. వైసీపీ మూకల దాడిలో కొందరు మహిళలు గాయపడ్డారు. అలాగే రాళ్లదాడిలో ముగ్గురు పోలీసులు కూడా గాయపడ్డారు.
సరే ఎలాగో పొగాకు వెలం కేంద్రానికి జగన్ వెళ్లారు. అక్కడ ఆవుకథలాంటి ప్రసంగం చేశారు. అయితే వైసీపీ మూకల హంగామా పొగాకు రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. వైసీపీ శ్రేణులు పోగాకుబేళ్లను తొక్కుతూ నానా హంగామా చేసి రైతులకు నష్టం కలిగేలా ప్రవర్తించారు. ఇక పొగాకు రైతులను ఉద్దేశించి జగన్ తనదైన మార్క్ ప్రసంగం చేశారు. పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పొగాకు రైతులకు అండగా ఉంటానన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/women-protests-in-podili-against-jagan-25-199708.html
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.