ఛీ .. ఛీ సిగ్గేస్తోంది మంత్రి రోజా తీరుపై మహిళల ఆగ్రహం

Publish Date:Jul 5, 2022

Advertisement

ఆమె స్వతహాగా సినిమానటి ... ఒకప్పటి హీరోయిన్... నటన ఆమె వృత్తి ... అందువలన ఆమె ప్రవర్తన అలా ఉందని కాదు. అలాగే, నటీనటులు, హీరోలు, హీరొయిన్’లు అంతా ఒకేలా , సభ్యత, సంస్కారం మరిచి  అంతే అసభ్యంగా ప్రవర్తిస్తారని అసలే కాదు. కానీ, ఇటు సినిమా రంగంలో, అటు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న, మాజీ నటీ, ప్రస్తుతం మంత్రి రోజా కాస్త చాలా బోల్డ్ టైపు లేడీ, ఎవరినీ లెక్కచేసే రకం కాదు. అది ఎవరో ఆమెకు ఇచ్చిన సర్టిఫికేట్ కాదు. ఆమె స్వయంగా తనకు తాను ఇచ్చి పుచ్చుకున్న  కితాబు . ఆపైన సుదీర్గ కాలం ‘జబరస్త్’ టీవీ షో లో జడ్జిగా,పగలబడి నవ్వడం (కొంత మంది గిట్టని వాళ్ళు వెకిలిగా, అసభ్యంగా,అసహ్యంగా నవ్వడం అని కూడా అంటారు) బాగా ప్రాక్టీసు చేశారు.

సరే, ఆ షో ‘ఎలా ఉంటుంది .. ఎంత అసహ్యంగా, ఎంత అసభ్యంగా ఉంటుంది అనేది వేరే  విషయం వేరే చర్చ. కొంత మంది  అయితే బూతు కామెడి షో లన్నిట్లోకి ‘జబర్దస్త్’ ఖతర్నాక్ నెంబర్ వన్, షో అని అంటారు.అలాగే,  బూతు కామెడి షోలకు  ‘జబర్దస్త్’ పెట్టింది పేరని అంటారు. సరే, ఎవరు ఏమనుకున్నా, ఆ షోను జనం విరగబడి చూస్తున్నారు అనుకోండి అది వేరే విషయం. లోకో భిన్న రుచి హి.. ఎవరి ఎవరి టేస్ట్ వారిది. కొంత మందికి అలాంటి కామెడీనే బాగుంతుంది. అందులో రోజా ఒకరు. 

అయితే ఆమె, మరో సెలబ్రిటీ అయితే అదోరకం.. కానీ, ఆమె ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి  పైగా ‘గౌరవ’ మంత్రి... సో ఆమె  గౌరవం. ఆమెకు మాత్రమే సొంతం కాదు. శ్రీ శ్రీ అన్నట్లుగా, ‘మీమీ వ్యక్తిగత జీవితాలు, మీమీ సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం’ అన్నట్ల్గు ఆమెను ప్రవర్తనను ప్రశ్నించ వలసి వస్తోందని అంటున్నారు. 

ఆమె నటిగా ఉన్నత కాలం, జబర్దస్త్ షో .. జడ్జిగా ఉన్నంతకాలం పూర్వాశ్రయంలో ఆమె ఏమి  చేశారు అనేది, ప్రస్తుతానికి అప్రస్తుతం. కానీ, ఇప్పడు ఆమె కేవలం ఒక నటి, జబర్దస్త్ షో .. జడ్జి మాత్రమే కాదు, ఒక గౌరవప్రదమైన స్థానలో ఉన్న మహిళా. ఒక మంత్రి. సో.. ఆమె కొంత హుందాగా, గౌరవ ప్రదంగా వ్యవహరిస్తే బాగుంటుందని ఆశించడంలో తప్పులేదని సంన్యులు బావిస్తున్నారు. అయితే,  అదేమీ దురదుష్టమో. పాత వాసనలు ఆమెను వదలడం లేదులా  వుంది. వెనకటి వేషాలే వేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజమే, గతంలో జబర్దస్త్ వేషాల గురించి విమర్శలు వచ్చినప్పుడు, ఆమె, నటన తమ వృత్తని. దర్శకులు చెప్పిన విధంగా నటించడమే తమ కర్తవ్యమని, నట జీవితం వేరు, నిజ జీవితం వేరు .. రెంటిని ముడి పెట్టి చూడరాదని, తమ ప్రవర్తనను సమర్ధించుకున్నారు.

అయితే. రోజా మంత్రి అయినా, ఆమె ప్రవర్తనలో, మాట తీరులో మార్పు రాలేదనేది, ఇప్పడు ఆమె పై వస్తున్న ప్రధాన విమర్శ. నిజానికి, ఆమె మంత్రిగా చేసేది, చేయగలిగింది ఏదీ లేదు. ఆమాట కొస్తే  జగన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులకు ఉన్న విలువ ఏ పాటిదో వేరే చెప్ప నక్కర లేదు, అందుకే, హేమాహేమీలకే దిక్కులేదు, రోజా అనగా ఎంత, అని ఆమె అనుచరులే, ఆమె ముఖం మీద కాకున్నా, చాటుగా నవ్వుకుంటున్నారు. 

అయితే ఇప్పడు ఇంతలా ఆమె గురించి మాట్లాడుకోవడానికి, భీమవరంలో జరిగిన మన్యం వీరుడు, అల్లూరి సీతారామరాజు శత జయంతి వేడుకల వేదిక పై ఆమె ప్రవర్తించిన తీరే కారణమని అంటున్నారు. ఈ సందర్భంగా ప్రధనమంత్రి, ముఖ్యంత్రి సమక్షంలో ఆమె ప్రవర్తన  మంత్రి పదవికి హుందా తెచ్చేలా లేదని విమర్శకులు అంటున్నారు. నిజం ఎవరో విమర్శించారని కాదు, ప్రధానమంత్రితో సెల్ఫి తీసుకోవాలనే కోరిక సహజంగా ఎవరికైనా ఉంటుంది. అయితే, అందుకు సమయం, సందర్భం ఉంటుందనే స్పృహ లేకుండా, ఆమె మంత్రి అనే విషయం  మరిచి పోయినట్లు ఆమె ప్రవర్తన ఉందని విమర్శకులు తప్పు పడుతున్నారు. చివరకు ముఖ్యమంత్రి  చికాకు పడే వరకు,ఆమె సెల్ఫి ‘గోల’ ఆపక పోవడం విమర్శలకు తావిచ్చేలా ఉందని అంటున్నారు.  

అదొకటి అలా ఉంటే, మంత్రి అయిన తర్వాత, ఇటీవల కాలంలో ఆమె చేసిన వ్యాఖ్యలు,  ఆమెను ఉద్దేశించి ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఆమె ఇమేజ్ ని మరింతగా దిగజారుస్తున్నాయని, సిగ్గుతో తలవంచు కుంటున్నామని సామాన్య మహిళలు కూడా అంటున్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది, రేపులు పెరిగిపోతున్నాయని, అంటే, ఏంటి, ఒకటి రెండు రేపులకే అంత ఇదై పోవాల, గోల చెయాల అంటూ ఆమె ఇచ్చిన సమాధానం, మహిళలు తల వచుకునేలా ఉందని మహిళలే ఆవేదన, ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. చివరకు, అల్లూరి జయింతి ఉత్సావాలను ఆమె తమ ప్రవర్తనతో  అపవిత్రం చేశారని.. కార్యక్రమం స్పూర్తిని అగౌరవ పరిచే విధంగా మంత్రి రోజా ప్రవర్తన ఉందని, ప్రతిపక్షాలు కాదు ప్రజలు,ముఖ్యంగా మహిళలు ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. ఇక ముందైనా, రోజా, పాత వాసనలు వదిలిచుకోవడం మంచిదని లేదంటి మంత్రి పదవి పోయినా మరకలు మాత్రం అలాగే ఉంటాయని, ఆమె మంచికోరేవారే అంటున్నారు. ఆమె వింటారా?

By
en-us Political News

  
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనితో ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22 క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని, సమాజానికి హానికరమైన ఒక నేరచరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కాపు యువకుడిగా ముద్ర వేయడం ద్వారా మొత్తం కులానికి అప్రతిష్ట తెస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా సాగుతున్న కులాల వ్యూహాలను విశ్లేషించారు. దేశంలో రాజ్యాంగం కల్పించిన రక్షణలు, సామాజిక మార్పుల వల్ల నేడు పల్లెల్లో సైతం కుల వివక్ష దాదాపు అంతరించిపోయిందన్నారు. కానీ.. ఒక వ్యూహం ప్రకారం కొన్ని రాజకీయ పార్టీలు నిర్దిష్ట సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ, మిగిలిన వర్గాల్లో వారిపై ద్వేషం పెంచేలా వాటిని బూచి గా చూపిస్తూ రాజకీయ పబ్బం గుడుపుకోవాలని చూస్తున్నాయన్నారు.
ప్రముఖ సామాజిక విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రుషికొండ ప్యాలెస్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రజాధనంతో నిర్మించిన ఈ విలాసవంతమైన భవనాన్ని కేవలం ఆలోచనలకే పరిమితం చేయకుండా.. తక్షణమే ప్రజోపయోగంలోకి తీసుకురావాలన్నారు.
సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలో 1 నుంచి 8000 లోపు అత్యుత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కలేదనీ, 8000 దాటి ఆ పైన దారుణమైన ర్యాంకులు వచ్చిన వారికి ఉద్యోగాలు కేటాయించారనీ, ఈ విషయాన్ని బాధితులే తనతో స్వయంగా చెప్పారనీ రవిశంకర్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో సాయి కృష్ణ అనుమానాస్పద లాకప్ డెత్ వ్యవహారం ఇప్పుడు రచ్చ లేపుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో చర్యలు తీసుకుంది. కొంతమంది పోలీసులను సస్పెండ్ చేసింది.. విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగానే.. వైసిపి నాయకులు విమర్శలతో చెలరేగిపోయారు. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి అంబటి రాంబాబు అలవాటుగా తన నోటికి పని చెప్పారు
బీజేపీ, ఎన్‌డీఏ నైతిక మద్దతుతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన నత్వానీ.. ఇండియా కూటమికి గట్టి షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల కంటే అధికార కూటమికే స్పష్టమైన సంఖ్యాబలం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాను మట్టికరిపించి నత్వానీ విజేతగా నిలవడం హాట్ టాపిక్‌గా మారింది.
2024 ఎన్నికలలో పరాజయం తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన నాని.. ఇప్పుడు పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడం సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన దశకు చేరుకున్నాయి
ఈ భవనాన్ని అలాగే వదిలేయడం వల్ల ఇప్పటివరకు 6 కోట్ల రూపాయల ప్రజాధనం బుడిదలో పోసిన పన్నీరైందన్నారు.
సూర్యనారాయణ రెడ్డికి సొంతంగా మాట్లాడే శక్తి లేదని, చేతిలో స్క్రిప్ట్ ఉంటే తప్ప ఆయన ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడలేరని ఎద్దేవా చేశారు. ఆయన ప్రవర్తనను సినీ నటుడు బ్రహ్మానందం హావభావాలతో పోలుస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.