చలికాలంలో ఏ నీటితో స్నానం చేస్తే మంచిది? చల్ల నీరా? వేడి నీరా?

Publish Date:Dec 29, 2023

Advertisement

అన్ని ప్రాంతాలలో ప్రజలు చలి కారణంగా బోలెడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెచ్చని వాతావరణంలో ఉండాలని అనిపించడం, వేడి ఆహారాలు, పానీయాలు తీసుకోవడం, స్నానానికి వేడి నీరు ఉపయోగించడం చేస్తుంటారు. అధికశాతం మందికి ఉదయాన్నే స్నానం చేసి ఉద్యోగాలకు, కాలేజీలకు, స్కూళ్లకు వెళ్లడం అలవాటు. ఇంట్లో మహిళలు కూడా ఉదయాన్నే స్నానం చేసి దేవుడి పూజ గట్రా చేసుకుంటారు. చలి కారణంగా అందరూ వేడి నీటి స్నానం చెయ్యడానికే మొగ్గు చూపుతారు. అయితే  చలికాలంలో చల్లనీరు, వేడి నీరు వీటిలో స్నానాకి ఏది బెస్ట్ అనే  విషయం గురించి ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వారు చెప్పిందేంటంటే..

వేడి నీరు

నిపుణుల అభిప్రాయం ప్రకారం చలికాలంలో తలస్నానానికి గోరువెచ్చని నీరు ఉత్తమం. ఇది చాలా వేడిగా లేదా చాలా చల్లగా ఉండకుండా కాసింత వెచ్చదనంతో ఉంటాయి. దీని వల్ల జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం ఉండదు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ పెరిగి చలి అనుభూతిని తగ్గిస్తుంది. అయితే మరీ వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.

చల్లటి నీరు

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉన్నవారు చల్లటి నీళ్లలో స్నానం చేయడం మానుకోవాలి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల జలుబు బారిన పడే ప్రమాదం ఉంది.

వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కలిగే ప్రమాదాలు..

సోమరితనం

 వేడి నీళ్లతో స్నానం చేయడం అలవాటు పడితే ఆ తరువాత  చల్లటి నీటితో స్నానం చేయడం కష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కారణాల వల్ల వేడినీరు దొరక్కపోతే స్నానం చేయడంలో సోమరిపోతులు అవుతారు. కేవలం ఇదొక్క కారణంగా వ్యక్తులలో ఒకానొక బద్దకం చోటు చేసుకుంటుంది. స్నానంతో మొదలయ్యే ఈ విషయం ఇతర జీవన కార్యకలాపాలకు కూడా సులువుగా విస్తరిస్తుంది. కాబట్టి అన్ని పరిస్థితులకు తగ్గట్టుగా ఉండాలి.

జుట్టుకు నష్టం

ఎక్కువ వేడి నీళ్లతో తలస్నానం చేయడం  వల్ల జుట్టు పాడవుతుంది. జుట్టు పొడిగా,  నిర్జీవంగా మారుతుంది. అందుకే ఎక్కువ  వేడి నీటితో తల స్నానం చేయడం మానుకోవాలి.

 చర్మం పొడిబారుతుంది

ఎక్కువ వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మంలో తేమ తగ్గుతుంది. ఇది పొడి చర్మం సమస్యను పెంచుతుంది. ఏదైనా చర్మ సమస్య ఉన్నవారు ఎక్కువ వేడి నీటితో స్నానం చేయకూడదు.

 

By
en-us Political News

  
సీజన్ మారుతున్నప్పుడు శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
పసుపు,  తేనె భారతీయ వంటగదిలో రెండు ప్రధాన పదార్థాలు. ఇవి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. పసు
నిమ్మకాయ చాలా పానీయాలలో ఉపయోగిస్తారు.  అటు వంటలలోనూ, ఇటు స్వీట్ల లోనూ, మరొక వైపు రిఫ్రెషింగ్ పానీయాలలోనూ నిమ్మకాయను ఉపయోగిస్తారు.  చాలామంది ఉదయాన్నే నీటిలో నిమ్మరసం కలిపి తాగుతూ ఉంటారు....
నేటికాలంలో చాలామందిలో కనిపిస్తున్న సమస్య ఫ్యాటీ లివర్.. చిన్న వయసు వారు కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు.
కీళ్ల నొప్పులు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసే ఒక సాధారణ సమస్య.
వేసవి కాలం అంటేనే చాలా ఇబ్బంది కాలం. అందులోనూ మునుపటి కంటే ప్రతి ఏడాది ఎండల తీవ్రత పెరుగుతూనే ఉంటుంది.
ఆరోగ్యంగా ఉండటానికి చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటాము
ఇంతకు ముందు రోజుల్లో కిడ్నీలో రాళ్లు అనే విషయాన్ని ఎక్కువగా వినేవాళ్లం.
చాలామంది ఒత్తిడిగా ఉంది అంటూ ఫిర్యాదు చేస్తుంటారు.
 వేసవి కాలంలో శరీరానికి చల్లదనాన్ని,  శక్తిని అందించడానికి చెరకు రసం చాలా మంచి పానీయం.
ఆరోగ్యం పాడైనప్పుడు ఆసుపత్రికి వెళ్లినప్పుడు  వివిధ రకాల పరీక్షలు చేస్తుంటారు.
వేసవిలో మండే ఎండ అయినా, ఆఫీసులో బిజీ జీవితం అయినా, మానసిక అలసట, జ్ఞాపకశక్తి తగ్గడం ఈ రోజుల్లో అన్ని వయసుల వారికి ఒక సమస్యగా మారాయి.
కాలేయం శరీరంలో ముఖ్యమైన అవయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.