Publish Date:Jul 15, 2025
టెస్ట్ క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ చెత్త రికార్డ్ నమోదు చేసింది. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో విండీస్ రెండో అత్యల్ప స్కోరు చేస్తే... ఆస్ట్రేలియా టీమ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్ను కేవలం 27 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇది టెస్ట్ల్లో రెండో అత్యల్ప స్కోరు. జమైకాలోని కింగ్స్టన్ వేదికగా మూడో టెస్ట్ లో 175 పరుగులతో కంగారూ జట్టు విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 3-0 తేడాతో ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. కెరీర్లో వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న మిచెల్ స్టార్క్ భీకర బౌలింగ్తో విండీస్ బ్యాట్స్మెన్లను బెంబేలెత్తించాడు. స్టార్క్ 6 వికెట్లు తీయగా.. బొలాండ్ 3 (హ్యాట్రిక్), హేజిల్వుడ్ ఒక వికెట్ తీశారు. ఆసీస్ బౌలర్ల దెబ్బకు ఏకంగా ఏడుగురు వెస్టిండీస్ బ్యాట్స్మెన్ డకౌట్ అయ్యారు. గ్రేవిస్ అత్యధికంగా 11 పరుగులు చేయగా.. మైకేల్ లూయిస్, అల్జారీ జోసఫ్ తలో 4 పరుగులు చేశారు.
స్పార్క్ తన మొదటి ఓవర్లో మూడు వికెట్లు తీశాడు. మొత్తం 15 బంతుల వ్యవధిలో 5 వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించాడు. ఆ క్రమంలో టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో 5 వికెట్టు సాధించిన బౌలర్గా స్టార్క్ రికార్డు సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్లో కంగారూలను 121 పరుగులకు ఆలౌట్ చేసి సంబరపడిన విండీస్కు ఆ ఆనందం ఎంతో సేపు నిలబడలేదు. విండీస్ బ్యాటర్లలో ఏడుగురు డకౌట్ అయ్యారు.
టెస్ట్ చరిత్రలో 1955లో ఇంగ్లాండ్పై 26 పరుగులకే అలౌట్ అయిన న్యూజిలాండ్ అత్యల్ప స్కోర్లలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. మళ్లీ ఇంత కాలానికి విండీస్ ఆ చెత్త రికార్డుకు చేరువై రెండో అతి చెత్త ఇన్నింగ్ ఆడింది. మన భారత్ 2020లో ఆస్ట్రేలియాపై 36 పరుగులకు ఆలౌట్ అయి ఆ చెత్త రికార్డుల్లో 8వ స్థానంలో ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/windies-worrest-record-in-test-cricket-39-202055.html
హైదరాబాద్ సిటీలో కుండపోత వర్షం కురిసింది. గురువారం సాయంత్రం 6.30 నుంచి 7.30 మధ్యలో గంట పాటు నాన్ స్టాప్గా కురిసిన వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి.
ఏపీలో ట్రైబల్ శాఖలో ఓ ఉన్నత స్థాయి అధికారి అవినీతి బాగోతం బయటపడింది. ఆ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్సీ) అబ్బవరపు శ్రీనివాస్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు విజయవాడలో అరెస్ట్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు క్షేత్రస్థాయిలో మేము చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరాన్నికి క్లౌడ్ బరస్ట్ ముప్పు పొంచి ఉందని వాతవరణ నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తోంది. నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది.
విశాఖ నగరంలో ఫిషింగ్ హార్బర్ సమీపంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా..ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులోకి కేంద్రం ఎంటరైంది. ఈ వ్యవహారం జాతీయ అంశమని తొలి నుంచీ బీజేపీ చెబుతూనే ఉంది.
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
నకిలీ ఓటర్ల జాబితాలతో ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
వైసీపీ నేత తూరకా కిశోర్ను వెంటనే విడుదల చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు విరుద్దంగా తూరకా కిశోర్ను అరెస్ట్ చేశారని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.
చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పై సుంకాలతో విరుచుకుపడితే.. ప్రతిగా భారత్ పక్కా వ్యూహంతో ఆయన మెడలు వంచి దారికి తీసుకురావడానికి వ్యూహాలు రచిస్తోందా? అంటే మోడీ చైనా పర్యటన, అదే సమయంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా పర్యటనలు చూస్తుంటే ఔననే సమాధానమే వస్తున్నది.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రేషన్ కార్డుల పంపిణీలో గందరగోళం నెలకొంది. స్ధానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ, కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ శ్యామ్ నాయక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.