తెలంగాణ సెంటిమెంటుతో పబ్బం ఇంకానా..?

Publish Date:Sep 13, 2024

Advertisement

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత కూడా ఆంధ్రోళ్ల పెత్తనం వంటి మాటలు వినాల్సి రావడం నిజంగా దురదృష్టకరం. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి తలెత్తడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా చేస్తున్న దుష్ట పన్నాగాలేనని చెప్పక తప్పదు. ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి  రాష్ట్ర సాధన ఉద్యమానికి నేతృత్వం వహించిన టీఆర్ఎస్.. రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ వాదానికి చెల్లు చీటీ పాడేసి, ఫక్తు రాజకీయ పార్టీగా మారింది. అది అవసరం, అనివార్యం కూడా.

పైగా ఇక తమది ఫక్తు రాజకీయపార్టీయేననీ, తెలంగాణ సాధనతోనే టీఆర్ఎస్ పని పూర్తయ్యిందనీ స్వయంగా అప్పట్లో ఆ పార్టీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించిన సంగతి కూడా తెలిసిదే.  అయితే అధికారం తలకెక్కి అహంకారం అవధులు దాటడంతో  తెలంగాణ కాదు.. దేశం మొత్తం పాలించేయాలన్న అత్యాశతో కేసీఆర్..  తెలంగాణ అన్న పదానికే పార్టీలో స్థానం లేకుండా చేసేశారు. భారత రాష్ట్ర సమితిగా పార్టీ పేరును మార్చేసి ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా జాతీయ రాజకీయాలలోకి దూకేశారు.   ఫలితం దేశ రాజకీయాలలో ప్రభావం చూపడం అటుంచి తెలంగాణలో ఉన్న పునాదులు కూడా కదిలిపోయే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో పార్టీ పరాజయం పాలై ప్రతిపక్షానికి పరిమితమైపోయింది. ఎన్నికలలో పార్టీ పరాజయానికి కారణమయ్యాయి. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం అన్న విషయాన్ని గుర్తించకుండా, తమ ఓటమి తెలంగాణ ఓటమిగా చెప్పుకోవడానికి ఇప్పుడు ఆ పార్టీ నాయకులు నేల విడిచి సాము చేస్తున్నారు. తమను ఓడించిన ప్రజలను నిందిస్తున్నారు. దాంతో పార్టీ ప్రతిష్ట మరింత మసకబారుతోంది. సావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన తనను జనం కాదంటారా అంటూ కేసీఆర్ ప్రజల ముఖమే చూడటం మానేశారు.  ఓటమి గల కారణాలను విశ్లేషించుకోకుండా, లోపాలను సరిచేసుకునే ప్రయత్నాలు చేసుకోకుండా మళ్లీ ఆంధ్రా, తెలంగాణ అంటూ తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నది. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరెకపూడి గాంధీ మధ్య జరుగుతున్న వివాదం వెనుక బీఆర్ఎస్ కుట్ర విద్వేషాలు రెచ్చగట్టడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక్కడ ఒక్కసారి గతంలోకి వెళ్లాలి. కేసీఆర్ సీఎంగా ఉన్న కాలంలో ఆపరేషన్ ఆకర్ష్ అంటూ విపక్ష పార్టీల నుంచి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని వాటిని బలహీనపరిచారు. ఆయా పార్టీల శాసనసభాపక్షాన్ని పార్టీలో విలీనం చేసుకున్నారు. అప్పుడు తప్పుగా కనిపించని ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చే సరికి బీఆర్ఎస్ నేతలకు తప్పుగా కనిపిస్తోంది. మహాపరాధంగా కనిపిస్తోంది. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడాన్ని తెలంగాణ ద్రోహం అన్నట్లుగా చెబుతున్నారు.  ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం చాలా క్లారిటీతో ఉన్నారు. బీఆర్ఎస్ వ్యూహాన్ని, కుట్రను చాలా క్లారిటీగా వివరించారు.  తెలంగాణ సెంటిమెంట్ తో రాజకీయాలు చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదని ఆయన విమర్శించారు.  తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని బీఆర్ఎస్ చూస్తోంది. రేవంత్ రెడ్డి మాటలలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు.  
అరెకపూడి గాంధీ పదేళ్ల పాటు బీఆర్ఎస్ (టీఆర్ఎస్) సభ్యుడిగానే ఉన్నారు. ఆ పార్టీ టికెట్ పైనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా గాంధీ బీఆర్ఎస్ టికెట్ పైనే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు. లేదూ కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. దీన్ని ఆసరాగా చేసుకుని బీఆర్ఎస్ ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంటును రాజేయాలని చూస్తోంది. అరెకపూడి గాంధీని ఆంధ్రా వ్యక్తి, ఆయనను గాజులు, చీరలు పంపిస్తాను అంటూ కౌశిక్ రెడ్డి  మాట్లాడారు. అరెకపూడి ఆంధ్రా మూలాలున్న వ్యక్తి అని ఇప్పుడు కౌశిక్ రెడ్డి అంటుంటే కేసీఆర్, కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు. అరెకపూడికి చీరలు, గాజులు అంటూ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన కౌశిక్ రెడ్డిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు?  గ్రేటర్ హైదరాబాద్  లోని 27 శాసనసభ స్థానాల్లో 18 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుందంటే అందుకు ఆంధ్రా సెటిలర్ల మద్దతు, వారి ఓట్లు కారణం కాదా?   గ్రేటర్ పరిధిలో 18 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్ గ్రామీణ ప్రాంతాల్లో ఘోర పరాజయానికి కారణం ఆ పార్టీ అవలంబించిన తెలంగాణ వ్యతిరేక విధానాలే కారణం కాదా?  ఇవన్నీ పక్కన పెడితే  ఇంకా బీఆర్ఎస్ లో ఉన్న ఆంధ్ర  ప్రాంతానికి  చెందిన కొంత మంది ఎమ్మెల్యేల గురించి ఏం చెబుతారు?  

వాస్తవం ఏమిటంటే.. తెలంగాణ సెంటిమెంట్ పనికి వస్తుందని కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఇంకా భావిస్తుంటే అది వారి అజ్ణానం తప్ప మరొకటి కాదు.  కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల పట్ల, వారి ఆకాంక్షల పట్ల నిజాయితీతో వ్యవహరించిన దాఖలాలు లేవు. అందుకే తెలంగాణ ప్రజల మద్దతును కోల్పోయింది. కారణాలు ఏవైతేనే బీఆర్ఎస్ కు గత ఎన్నికలలో ఆ మాత్రం స్థానాలు రావడానికి ఇప్పుడు  ఆంధ్రా సెటిలర్ల ఓట్లే కారణం. ఇప్పుడు బీఆర్ఎస్ నేతల తీరు వారినీ బీఆర్ఎస్ కు దూరం చేయడం ఖాయం.  

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.