కోమటిరెడ్డి రాజగోపాల్ మళ్లీ ఝలక్ ఇస్తారా?

Publish Date:Jun 11, 2025

Advertisement

మంత్రి పదవి దక్కక పోవడంతో తీవ్ర నిరాశ లో ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి . ఏడాదిన్నరగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రి వర్గ విస్తరణ ఎట్టకేలకు ఇటీవల జరిగింది. అది కూడా పాక్షికంగానే.  తెలంగాణ క్యాబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాల్లో మూడు స్థానాలను అధిష్టానం భర్తీ చేసింది. అయితే ఈ  విస్తరణలో తనకు చోటు దక్కక పోవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనస్తాపం చెందారట. ఇప్పటికే మంత్రి పదవి హామీతో కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల విషయంలో హైకమాండ్  ఇచ్చిన హామీ నెరవేర్చుకుంది.

బీజేపీలోకి వెళ్లి తిరిగొచ్చిన గడ్డం వివేక్‌ వెంకటస్వామికి కూడా తాజా విస్తరణలో క్యాబినెట్ బెర్త్ లభించింది. అయితే తనకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుందని రాజగోపాల్ మధన పడుతున్నారట. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే తిరిగి పార్టీలోకి రావాలని, మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ ఎన్నికల ముందుఆయనకు హామీ ఇచ్చిందంట. భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌ని గెలిపిస్తే పదవి ఇస్తామని రెండోసారి హామీ ఇచ్చిందంట.  ఆ హామీ నెరవేర్చలేదని రాజగోపాల్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. మంత్రివర్గ విస్తరణలో తనకు తప్పుకుండా బెర్త్‌ దక్కుతుందని భావించిన రాజగోపాల్ రెడ్డి కి మంత్రి దక్కకపోవడంతో ఇక తాడో పేడో తేల్చుకునే పనిలో ఉన్నారట.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి దక్కక పోవడానికి ప్రధాన కారణం ఆయన సోదరుడు వెంకటరెడ్డి క్యాబినెట్‌లో ఉండటమే అంటున్నారు. అదీకాక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే ఇద్దరు రెడ్డి నేతలు మంత్రులుగా ఉండటంతో రాజగోపాల్‌ కు కుల సమీకరణలు కలిసిరాలేదంటున్నారు. జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి  మంత్రులుగా ఉన్నారు. దీంతో మళ్లీ ఇంకో రెడ్డి సామజిక వర్గం నేతకే పదవి ఇస్తే ఒక్క జిల్లా నుంచే ముగ్గురవుతారని..   అందులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే నెగటివ్ అవుతుందనే హైకమాండ్ ఆయన విషయాన్ని పెండింగ్ లో పెట్టిందంటున్నారు.

రాజగోపాల్‌కు ఇచ్చిన హామీని ఎలా నెరవేర్చాలో? అయన్ని ఎలా సంతృప్తి పరచాలో అంతుపట్టక పార్టీ పెద్దలు సతమతమవుతున్నారంట. అందుకే పొంగులేటి , వివేక్ కి ఇచ్చిన హామీ నెరవేర్చినా రాజగోపాల్ రెడ్డి విషయం లో స్పష్టత కొరవడిందంట. వివేక్ కుమారుడు ఎంపీగా ఉన్నా, ఆయన సోదరుడు  వినోద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. అదే ఎంపీగా తన భార్య లక్ష్మిని పోటీకి దింపకుండా చామల బరిలో దిగితే సొంత డబ్బులు ఖర్చు పెట్టి గెలిపించినా తనకు మంత్రి పదవి రాకుండా జిల్లా నేతలే అడ్డుకుంటున్నారని రాజగోపాల్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు బహిరంగంగానే విమర్శలు చేశారు.

రెండు నెలల కిందట మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని విస్తృత ప్రచారం జరిగింది. అదే సమయంలో రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని మాజీ మంత్రి, పార్టీ సీనియర్‌ నాయకుడు జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు. దాంతో రాజగోపాల్‌రెడ్డి ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. జానారెడ్డి లేఖతో మంత్రి పదవి రాకుండా పోయిందని ధర్మరాజు లా ఉండాల్సిన వారు దృతరాష్టుడిలా మారారని అప్పట్లో రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరవాత ఆవేశంతో పని కాదని జిల్లా మంత్రులు ఉత్తమ్ , కోమటిరెడ్డిలతో సన్నిహితంగా ఉంటూ.. ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నారు. కాని మంత్రి పదవి రాకపోవడంతో మళ్లీ పార్టీపై ఆగ్రహంతో ఉన్న ఆయన ఫామ్ హౌస్‌కే పరిమితమై సైలెంట్ అయ్యారు.

రాజగోపాల్ రెడ్డి సైలెంట్ గా ఉండటం తో ఎం చేయబోతున్నారనే సస్పెన్స్ నెలకొంది . ఇప్పటికే సోషల్ మీడియాలో రాజగోపాల్ రెడ్డి అనుచరులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టి  వైరల్ చేస్తున్నారు . మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నిస్తూ.. రాజగోపాల్‌కి మంత్రి రాలేదన్న అసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్లు పోస్టులు పెడుతున్నారు . ఇంత జరుగుతున్నా రాజగోపాల్ తన మనసులో మాట బయటపెట్టడం లేదు. సామాజిక కోణంలో అధిష్టానం మూడు స్థానాలు భర్తీ చేసిందని, ఇంకా మూడు పోస్టులు ఖాళీగా ఉండటంతో అన్ని విధాలా ఆలోచన చేసి మళ్లీ విస్తరణలో నిర్ణయం తీసుకుంటుందని ఇంచార్జ్ మీనాక్షి చెప్పడంతో కొంత కాలం వెయిట్ చేద్దామని రాజగోపాల్ భావిస్తున్నారంట. 

అయితే తమ నాయకుడు ఇక ఎంతో కాలం వేచి చూసే పరిస్థితి లేదని కోమటిరెడ్డి అనుచరులు అంటున్నారు . ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వకపోతే మరోసారి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారంట. ఇప్పుడే రాజీనామాపై నిర్ణయం వెల్లడిస్తే పార్టీని బ్లాక్ మెయిల్ చేసినట్లు అవుతుందని వెయిట్ చేస్తున్నారంట. మరి చూడాలి ఆ సస్పెన్స్‌కు ఎప్పుడు తెర పడుతుందో.

By
en-us Political News

  
హైదరాబాద్‌‌లో మహా న్యూస్ హెడ్ ఆఫీస్‌పై బీఆర్‌ఎస్ నేతల దాడిని ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. స్టూడియోపై దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణమని ఎక్స్ వేదికంగా పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రమాణ స్వీకారంచేసి, ఇంచుమించుగా 18నెలలు అయింది. అయితే, ఈ 18 నెలల కాలంలో, రేవంత్ రెడ్డి ఇతర ముఖ్యమంత్రుల్లా అధికార దర్పాన్ని ప్రదర్శించిన సందర్భాలు అంతగా కనిపించవు.
హైదరాబాద్‌లో మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. మీడియా సంస్థపై భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత గర్హనీయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు.
పూర్ణ‌చంద్ర‌రావు అనే ఒక వ్య‌క్తితో యాంక‌ర్ స్వేచ్ఛ స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. గ‌తంలో కూడా ఆమె ఒక‌రితో వివాహం అయ్యి త‌ర్వాత విడిపోయారు. ఆమె టీవీనైన్ వంటి ప్ర‌ముఖ న్యూస్ ఛానెళ్ల‌లో ప‌ని చేశారు.
ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్‌పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహించిన బీఆర్ఎస్ కార్యకర్తలు మహా టీవీ ఆఫీస్‌పై దాడి చేశారు. ఆఫీస్ అద్దాలు, కార్లు, స్టూడియోను ధ్వంసం చేశారు.
ఆస్కార్ క‌మిటీలో చోటు ద‌క్కింది. అకాడ‌మీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్స్ అండ్ సైన్సెస్ తాజాగా విడుద‌ల చేసిన స‌భ్యుల జాబితాలో క‌మ‌ల్ పేరు కూడా ఉంది. ఎంతో మంది హాలీవుడ్ న‌టీన‌టుల‌తో పాటు ఆస్కార్ ఓటింగ్ ప్ర‌క్రియ‌లో పాలుపంచుకోనున్నారు క‌మ‌ల్.
జులై 1న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు కమలం పార్టీ అధిష్టానం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు వెలువడనుండగా, ఎల్లుండి సోమవారం నామినేషన్ల స్వీకరిస్తారని సమాచారం.
ఎమ్మెల్సీ కవిత వ్యక్తిగత సహాయకుడికు సంబంధించిన పలు ఆడియో రికార్డింగ్స్ బయటపడ్డాయి. దీంతో సిట్ అధికారులు కవిత పీఎను విచారణకు రావాలంటూ ఇవాళ నోటీసులు జారీ చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న చంద్రబాబు ఆరోపణ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నియమించిన సిట్ ను కాదని.. సుప్రీం కోర్టు సీబీఐ ఆధ్వర్యంలో స్వతంత్ర సిట్ ను నియమించింది.
జగన్ లో అరెస్టు భయం పీక్స్ కు చేరింది. జగన్ రెంటపాళ్ల పర్యటలో ఆయన కారు కింద పడి వైసీపీ కార్యకర్త మరణించిన సంఘటనపై జగన్ ఏ2గా కేసు నమోదైంది. ఆ కేసును కొట్టేయాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. జగన్ క్వాష్ పిటిషన్ పై కోర్టు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. విచారణను జులై 1కి వాయిదా వేసింది. అయితే కోర్టు విచారణను వాయిదా వేస్తూ జులై 1 వరకూ జగన్ పై ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని పోలీసులను ఆశ్రయించింది.
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లో పనిచేస్తున్న యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్  శుక్రవారం (జూన్ 27) తన నివాసంలోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
పెందుర్తి మండలం జుత్తాడలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని దారుణంగా హత్య చేసన కేసులో బమ్మడి అప్పలరాజు అనే వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తూ విశాఖ జిల్లా కోర్టు శుక్రవారం (జూన్ 27) తీర్పు వెలువరించింది.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచే ఉద్దేశమే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఏపీఈపీడీసీఎల్ ఆధ్వ‌ర్యంలో విశాఖ‌ప‌ట్నంలో రూ.14 కోట్ల వ్యయంతో నిర్మించిన సూప‌ర్ ఈసీబీసీ భ‌వ‌నాన్ని శుక్ర‌వారం (జూన్ 27) మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ప్రారంభించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.