Publish Date:Dec 18, 2024
మంత్రి పొంగులేటి సియోల్ పర్యటనలో ఉన్నప్పుడు చేసిన ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
ఫార్ములా ఈ రేస్ కుంభకోణంపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గానే ఉంది. ఎసిబి విచారణ చేపట్టాలని ప్రభుత్వ ప్రదానకార్యదర్శి శాంతకుమారి ఇప్పటికే లేఖ రాసిన సంగతి తెలిసిందే. కెటీఆర్ మెడకు ఫార్ములా ఈ రేస్ కుంభకోణం చుట్టుకుంది. ఈ కుంభకోణంపై ఎసిబి విచారణకు మంత్రివర్గం పట్టు బట్టింది. విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ కొనుగోళ్లపై జస్టిస్ మదన్ బి లోకూర్ ఇచ్చిన నివేదికపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. జస్టిస్ మదన్ బి లోకూర్ ఇచ్చిన నివేదికపై కేబినేట్ భేటీ జరిగింది. కెసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఇస్టా రాజ్యంగా వ్యవహరించారు. కల్వంకుంట్ల ఫ్యామిలీ కోసమే పెద్ద పీట వేశారు. అవినీతి, బంధు ప్రీతి వల్ల రాష్ట్ర ప్రజల నెత్తిన భారం పెట్టారు. రాబోయే 25 ఏళ్ల పాటు కెసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని జస్టిస్ మదన్ బి లోకూర్ తేల్చేశారు. కాలం చెల్లిన టెక్నాలజీతో ఏర్పడిన భద్రాది పవర్ ప్లాంట్ తో రానున్న 25 ఏళ్లలో 9 వేల కోట్ల అదనపు భారం ప్రజలపై పడింది. చత్తీస్ గడ్ తో చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం వల్ల 3, 642 కోట్ల నష్టం వాటిల్లిందని కమిషన్ తేల్చి చెప్పింది. యూనిట్ మూడు రూపాయల అరవై పైసలకు కొనుగోలుచేసిన ప్రభుత్వం ఇంధన సర్దుబాటు పేరిట ఏడురూపాయలకు కొనడాన్ని కేబినెట్ ఆక్షేపించింది. మంత్రి పొంగులేటి సియోల్ పర్యటనలో ఉన్నప్పుడు దీపావళి తర్వాత పొలిటికల్ బాంబులు పేలతాయి అని ప్రకటించారు. ఫార్ములా ఈ రేస్ పై అవినీతినిరోధక శాఖ దర్యాప్తు చేపట్టడమే గాకుండా కెసీఆర్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై కూడా దర్యాప్తు చేస్తే నేరం రుజువౌతుంది. దర్యాప్తు తర్వాత తండ్రి కొడుకులు అరెస్ట్ అయ్యే అవకాశముందని చర్చ జరుగుతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/will-pongulet-political-bombs-fall-on-the-father-sons-two-birds-with-one-stone-25-190012.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.