రాష్ట్ర రహదారులకూ టోల్? ప్రజలను ఒప్పించగలరా?

Publish Date:Nov 27, 2024

Advertisement

జాతీయ రహదారుల తరహాలో రాష్ట్ర రహదారులను పిపిపి విధానంలో నిర్మించి టోల్ టాక్స్  వసూలు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు యోచిస్తున్నారు. జాతీయ రహదారులపై వసూలు చేసినట్లుగా ఇక రాష్ట్ర రహదారులపై కూడా టోల్ గేట్లు దర్శనమిస్తాయన్న మాట. అంటే జాతీయ రహరాదులపై ప్రయాణాలకు కట్టాల్సినట్లుగానే రాష్ట్ర రహదారులపై ప్రయాణానికీ ఇక నుంచి టోలు కట్టాల్సిందే. ఇది సహజంగానే ప్రజలకు ఆగ్రహాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు కారణమౌతుంది. నిరసనలు, ఆందోళనలు మొదలౌతాయి. అయితే రాష్ట్రంలో రహదారుల మరమ్మతు, కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టాలంటే ప్రభుత్వానికి సొమ్ములు ఎక్కడ నుంచి వస్తాయన్న విషయాన్ని జనం పట్టించుకోరు. పట్టించుకోవలసిన అవసరం కూడా లేదు. అసలు ఐదేళ్లుగా రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్న ఆగ్రహం కారణంగానే గ్రామీణ ప్రాంతాలలో జనం జగన్ ను వ్యతిరేకమయ్యారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో  రాష్ట్రంలో ఎక్కడా ఒక్కటంటే ఒక్క కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవు. కొత్త రోడ్ల వరకూ ఎందుకు కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చ లేదు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో రోడ్లపై ప్రయాణం ఒక నరకంగా మారిపోయిందని జనం గగ్గోలు పెట్టారు.  ఏపీలో రోడ్లపై ప్రయాణం ఎంత దివ్యంగా ఉంటుందన్న దానిపై దేశ వ్యాప్తంగా చర్చ కూడా జరిగింది. అప్పట్లో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ అవకాశం వచ్చినా, రాకపోయినా, సందర్భం అయినా కాకపోయినా తమ ప్రభుత్వం రాష్ట్రంలో ఎంత బ్రహ్మాండమైన పాలన సాగిస్తోందో చెప్పడానికి ఏపీలో రోడ్ల దుస్థితిని ఉదాహరణగా చూపేది. ముఖ్యంగా అప్పటి మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఏపీ రోడ్లపై తరచూ వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు. 

ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో రహదారి ప్రయాణాన్ని సుఖవంతం చేసే లక్ష్యంతో రోడ్ల మరమ్మతులకు నడుం బిగించింది. అయితే గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యింది. అందిన చోటల్లా అప్పులు చేసి, అదీ చాలక ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి మరీ   జగన్ సర్కార్ అప్పట్లో చేసిన రుణగొణ ధ్వని దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. చివరాఖరికి వచ్చే పాతికేళ్ల మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసిన వైసీపీ సర్కార్ అధికారం దిగే సమయానికి ఏపీని దివాళీ ముంగిట నిలబెట్టింది. 

ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించింది. రాష్ట్రంలో   కొత్త రహరాదుల నిర్మాణం సంగతి పక్కన పెడితే కేవలం రోడ్లపై గుంతలు పూడ్చి మరమ్మతులు చేయడానికే ఎనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా వ్యయం అవుతుందని ఒక అంచనా. ప్రస్తుత పరిస్థితుల్లో అంతటి ఖర్చుకు భరించే పరిస్థితి లేకపోవడంతో చంద్రబాబు అనివార్యంగా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించక తప్పలేదు. రోడ్ల మరమ్మతులకు  రూ.800 కోట్లు ఆదే సమయంలో రాష్ట్ర రహదారుల నిర్మాణం పిపిపి ( ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం) విధానంలో రెండు విడతలగా చేపట్టాలని నిర్ణయించారు.   జాతీయ రహదారుల తరహాలోనే రాష్ట్ర రహదారుల్ని కూడా దశల వారీగా పీపీపీ విధానంలో అభివృద్ది చేసి వాటిపై టోల్ వసూలు చేయాలని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనల మేరకు తొలి దశలో 18, రెండో దశలో 68 రోడ్లూ అభివృద్ధి చేసి టోల్ వసూలు చేస్తారు. 

ఏపీలో పెద్ద సంఖ్యలో రాష్ట్ర రహదారులు ఉన్నాయి. వాటి పరిస్ధితి గత ఐదేళ్లలో దారుణంగా మారిపోయింది. వీటిపై ప్రయాణం  నరకప్రాయమేనని జనం గగ్గోలు పెడుతున్నారు. దీంతో ప్రస్తుతానికి వాటిపై గుంతల్ని పూడ్చేందుకు ఉపక్రమించిన ప్రభుత్వం  త్వరలో వీటిని జాతీయ రహదారుల తరహాలోనే ప్రైవేట్ సంస్థలకు అప్పగించి వాటిని అభివృద్ధి చేయడంతో పాటు టోల్ ట్యాక్స్ కూడా వసూలు చేయాలని భావిస్తోంది.  అయితే ఇందుకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాకుండా ఉండాలంటే.. పీపీపీ విధానంలో రోడ్ల అభివృద్ధి వల్ల చేకూరే ప్రయోజనాలపై ప్రజలలో అవగాహన కల్పించాలి. అదే సమయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రోడ్లు ఉంటే.. రాష్ట్ర ప్రగతికి అవకాశం లేకపోవడంతో పాటు జనం ఆర్థికంగా కూడా ఎంత నష్టపోతారో వివరించాల్సి ఉంటుంది. ప్రజలకు పీపీపీ విధానంలో రోడ్ల అభివృద్ధి వల్ల ఒనగూరే ప్రయోజనాల పట్ల అవగాహన కల్పించి ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా అవసరమైనచర్యలు తీసుకోవలసి ఉంది. అదే విధంగా మండలం యూనిట్ గా టోల్ గేట్లు పెట్టడం కాకుండా జిల్లా యూనిట్ గా తీసుకుని టోల్ వసూలు చేయడానికి నిర్ణయిస్తే ప్రజల నుంచి పెద్ద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండదు. ఆ దిశగా యోచన చేయాలి. మొత్తం మీద రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులను తలదన్నే విధంగా ఉంటాయన్న హామీతో ప్రజలను టోల్ చెల్లింపునకు ఆంగకరింప చేయాలి. 

By
en-us Political News

  
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.