కేటీఆర్ కు సీఎం యోగం ఉందా? లేదా?

Publish Date:Jun 19, 2023

Advertisement

ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వారసుడెవరు అంటే ఇంకెవరు ఆయన కుమారుడు కేటీఆర్ అని చెబుతారు. అసలు 2018 ఎన్నికలకు ముందే ఆయన పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయని వార్తలు వచ్చాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ ను ప్రకటించిన సందర్భంలోనే తదుపరి సీఎం కేటీఆర్ అని అందరికీ అర్థమైపోయింది.

 2018 ఎన్నికలకు ముందు నుంచి కూడా త్వరలోనే కేటీఆర్ పట్టాభిషేకం ఇహ ఇప్పుడో, అప్పుడో అన్న స్థాయిలో వార్తలొచ్చాయి.  పలు ముహూర్తాలు  కూడా  ఖరారు చేస్తూ పుంఖాను పుంఖాలుగా వార్తలు వెలువడ్డాయి.  మంత్రులైతే బహిరంగ వేదికల నుంచి  కేటీఆర్’ను కాబోయే ముఖ్యమంత్రిగా సంభోదించారు. అయితే, అకుటుంబ కలహాలా, మరో కారణమా తెలియదు కానీ.. ఇప్పటి వరకూ కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మాత్రం జరగలేదు.

ఇప్పుడు రానున్న ఎన్నికలలో బీఆర్ఎస్ విజయం సాధిస్తే ముఖ్యమంత్రిగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ శ్రేణుల్లో గట్టిగా వినబడుతోంది. అయితే తొమ్మిదేళ్ల పాలనలో మూటగట్టుకున్న ప్రభుత్వ వ్యతిరేకత ఈ సారి బీఆర్ఎస్ కు విజయం అంత సులభంగా అందే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా.. రాదా అని పక్కన పెడితే పార్టీ వేదికలపై ఎక్కడా ఎవరూ కూడా కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అని ప్రకటించే ధైర్యం చేయడం లేదు. ఎవరు మాట్లాడినా ఆఖరికి కేటీఆర్ కూడా 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది.. కేసీఆర్ ముచ్చటగా మూడో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనే అంటున్నారు.

చివరాఖరికి గతంలో  కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్  అని పబ్లిక్ గా బహిరంగ సభలలో చెప్పిన నాయకులు కూడా కేసీఆర్ హ్యాట్రిక్ గురించే మాట్లాడుతున్నారు.  దీంతో కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఆకాంక్షలకు ఇప్పటికిప్పుడైతే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు.  అసలు కేసీఆర్ జాతీయ ఆకాంక్షల వెనుక ఉన్న ఉద్దేశమే తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం కేటీఆర్ కు అప్పగించేందుకే అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి.

అయితే విఘ్నేశ్వరుడి పెళ్లికి వేయి విఘ్నాలు అన్న చందంగా కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పెంచుకున్న ఆశలు నెరవేరే అవకాశాలు ఇసుమంతైనా కనిపించని పరిస్థితుల్లో కేటీఆర్ కు తెలంగాణ సీఎం పీఠం అందని ద్రాక్షగా మిగిలిపోయే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. అసలు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించిన వెంటనే ముఖ్యమంత్రిగా బాధ్యతల నుంచి తప్పుకుని ఆ కుర్చీనీ, బాధ్యతలను తనయుడికి అప్పగిస్తారని పార్టీ వర్గాలు అప్పట్లో గట్టిగా చెప్పాయి. అలాగే కేటీఆర్ డిఫ్యాక్టో సీఎంగా  వ్యవహరించడం కూడా అప్పటి నుంచే మొదలైంది. ఇప్పటికీ అదే కొనసాగుతోంది అది వేరే విషయం.

కానీ ఆ వ్యూహం కార్యరూపం దాల్చక పోవడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంతంగా నిర్వహించిన ఓ సర్వేయే కారణమని చెబుతున్నారు. బీఆర్ఎస్ పై ప్రజావ్యతిరేకతకు అత్యథికంగా వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలన కారణమని తేలడమేనంటారు. అంతే కాకుండా ఎన్నికల వ్యూహకర్త పీకే కూడా కేటీఆర్ ను వారసుడిగా చేయడం వల్ల ప్రజా వ్యతిరేకత మరింత పెరుగుతుందని, అది వచ్చే ఎన్నికలలో పార్టీ విజయావకాశాలను గట్టిగా దెబ్బతీస్తుందని చెప్పడమే కారణమని విశ్లేషకులు అంటున్నారు.  

ఆ కారణంగానే ముఖ్యమంత్రి కేసీఆర్  కుటుంబం నుంచి ఎంతగా వత్తిడి వచ్చినా, కేటీఆర్ కి పగ్గాలు అప్పగించకడానికి ససేమిరా అంటున్నారని చెబుతున్నారు.  ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చే ఎన్నికలలో విజయం సాధించినా కేటీఆర్ కు సీఎం పగ్గాలు దక్కే అవకాశాలు పెద్దగా లేవనీ అందుకు కారణం జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పెద్దగా  ప్రభావం చూపే అవకాశాలు లేకపోవడమేననీ అంటున్నారు. 

By
en-us Political News

  
2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.
దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.