కేటీఆర్ అరెస్టు ఖాయమా?

Publish Date:Jun 16, 2025

Advertisement

ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావును అరెస్టు చేయనుందా?  సోమవారం (జూన్ 16) ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరుతూ కేటీఆర్ మీడియాతో  మాట్లాడారు. ఆ సందర్భంగా ఈ ఫార్ములా కేసులో తనను అరెస్టు చేస్తారని మీడియాతో చెప్పడం దానినే సూచిస్తోంది. తనను అరెస్టు చేసి జైలుకు పంపిస్తారని తెలుసన్న కేటీఆర్.. జైలుకు పోవడం తనకు కొత్తేమీ కాదన్నారు.   గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో తాను పలు సార్లు జైలుకు వెళ్లిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

ఫార్ములా ఈ రేస్ కేసులో ఇన్ హౌస్ విచారణ కాదు.. దమ్ముంటే ప్రజల ముందు, బహిరంగంగా చర్చిద్దామని తాను సవాల్ చేశాననీ, అయితే ఆ సవాల్ ను స్వీకరించే ధైర్యం లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిపోయారనీ కేటీఆర్ వ్యాఖ్యానించారు.  చట్టం అంటే తనకు గౌరవం ఉందనీ, రెండు సార్లు, మూడు సార్లూ కాదు.. 30 సార్లు పిలిచినా విచారణకు హాజరౌతామని అన్నారు. 

తనను విచారణకు, కేసుల పేరుతో వేధించడం వారి రేవంత్ పైశాచిక ఆనందం పొందడానికేనని కేటీఆర్ అన్నారు. ఈ ఫార్ములా ఈరేస్ కేసులో తనను అరెస్టు చేస్తారని తనకు మందే తెలుసని చెప్పిన కేటీఆర్, రేవంత్ సర్కార్ హామీల అమలు వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫార్ములా ఈరేస్ కేసు అంటున్నారని ఆరోపించారు. ఏది ఏమైనా కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకూ ప్రజల వైపు ఉండి నిలదీస్తూనే ఉంటానన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండానే స్థానిక ఎన్నికలకు వెడుతున్నారనీ, బీసీలు అన్నీ గమనిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. నోటుకు ఓటు కేసులో రేవంత్ లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా అని మరోసారి సవాల్ విసిరారు.  మీడియా సమావేశం అనంతరం ఆయన ఏసీబీ విచారణకు వెళ్లారు. 

By
en-us Political News

  
పెందుర్తి మండలం జుత్తాడలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని దారుణంగా హత్య చేసన కేసులో బమ్మడి అప్పలరాజు అనే వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తూ విశాఖ జిల్లా కోర్టు శుక్రవారం (జూన్ 27) తీర్పు వెలువరించింది.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచే ఉద్దేశమే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఏపీఈపీడీసీఎల్ ఆధ్వ‌ర్యంలో విశాఖ‌ప‌ట్నంలో రూ.14 కోట్ల వ్యయంతో నిర్మించిన సూప‌ర్ ఈసీబీసీ భ‌వ‌నాన్ని శుక్ర‌వారం (జూన్ 27) మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ప్రారంభించారు.
మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత వైసీపీ కీలక నేత కొడాలి నాని హఠాత్తుగా శుక్రవారం (జూన్ 27) గుడివాడకు వచ్చా రు . గత ఏడాది జరిగిన ఎన్ని కలలో పరాజయం తరువాత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్ననాని అకస్మాత్తుగా గుడివాడకు ఎందుకు వచ్చారంటే ఓ కేసులో నానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
నమ్మలేని నిజాలు బయటకు వస్తున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ప్రత్యేక దర్యాప్తు బృందం - సిట్ దూకుడు పెంచింది. పాత చిట్టాకు కొత్తగా యాడవుతున్న ట్యాపింగ్ బాధితులు ఒక్కొక్కరినీ పిలిచి వాగ్మూలాలను నమోదు చేస్తోంది. సిట్ నిజానికి, ఇంతవరకు ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారనే విషయంలో సిట్ కు కూడా స్పష్టత లేదని అంటున్నారు.
అనంతపురం జిల్లాలో నకిలీ స్టాంపుల కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. కళ్యాణదుర్గంలో మీసేవ కేంద్రం నిర్వహిస్తున్న బోయ ఎర్రప్ప, అలియాస్ మీసేవ బాబు ఈ నకిలీ స్టాంపుల కుంభకోణానికి ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు.
ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని 19 కార్లుకు కల్తీ డీజిల్ కొట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.
సింగయ్య మతి కేసులో ఏ2గా ఉన్నజగన్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు జులై 1కి వాయిదా వేసింది. ఆ సందర్భంగా అప్పటి వరకూ జగన్ పై ఎటువంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పెను ప్రమాదం తప్పింది. పురుషుల సర్జికల్ వార్డు వద్ద పైకప్పు పెచ్చులు ఊడి కింద పడ్డాయి. సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది.
మంత్రి సీతక్కను టార్గెట్ చేస్తూ, మావోయిస్టులు ఆమె తమ మూలాలను మరిఛిపోయారని హెచ్చరిస్తూ రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌పై ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోందా? ఆయన వరుస వివాదాలలో చిక్కుకోవడానికి కారణాలేంటి? ఎవరైనా ఆయన్ని ప్రత్యేకంగా టార్గెట్‌ చేసి వివాదాల్లో నెడుతున్నారా?.. గుంటూరులో జగన్ కాన్యాయ్ వాహనం కింద పడి మృతి చెందిన సింగయ్య కేసులో జిల్లా ఎస్పీని తప్పుదోవ పట్టించింది ఎవరు? తీవ్ర కలకలం రేపిన ఆ ప్రమాదానికి సంబంధించి వినిస్తున్న ప్రచారంపై పెద్ద చర్చే జరుగుతోందిప్పుడు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌లు జైలుకు వెళ్తేనే నిజమైన న్యాయం జరుగుతుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట విచారణకు హాజరయ్యారు
ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ను పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని తాను కోరుతున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
వైసీపీ అధినేత జగన్ కారును రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఏపీ 40 డీహెచ్‌ 2349 కారు ఫిట్‌నెస్‌ను ఎంవీఐ గంగాధర ప్రసాద్‌ ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.