జగన్ మకాం మార్చేస్తారా?

Publish Date:Jul 13, 2022

Advertisement

తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లు అని రాజు అంటే వందిమాగధులు కాదనక చస్తారా? ఏపీలో జగన్ పాలన అలాగే ఉంది. జగన్ ఔనంటే ఔను.. కాదంటే కాదు.. కేబినెట్, అధికార యంత్రాంగం పరిస్థితి అంతే ఇప్పుడు జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఏపీకి రాజధాని లేకండా చేశారన్న విమర్శలను తిప్పి కొట్టడానికి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారంటున్నారు.

ఏకంగా తన మకాం విశాఖకు మార్చేసి అక్కడ నుంచే పాలన సాగించే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. ఇప్పటికే ఇందుకు ముహూర్తం కూడా ఫిక్సయిపోయిందని చెబుతున్నాయి. ప్లీనరీ వేదికగా రాష్ట్రంలో 175కు 175అసెంబ్లీ స్థానాలలో విజయమే లక్ష్యంగా పని చేయాలన్న పిలుపు ఇచ్చిన ఆయన ఎన్నికలకు రెడీ అయిపోవాలని శ్రేణులకు చెప్పకనే చెప్పారు. అమరావతిని ఇప్పటికే నిర్వీర్యం చేసిన జగన్ ఇక దాని ఊసు కూడా రాష్ట్రంలో ఎవరూ ఎత్తకుండా చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

కోర్టు తీర్పులను సైతం లెక్క చేయకుండా వ్యవహరిస్తున్న జగన్ ఇప్పుడు విశాఖ నుంచి పాలన సాగించేందుకు నిర్ణయించేసుకున్నారు. విశాఖలో క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు రెడీ అయిపోయారు. భవనాల అన్వేషణ కూడా సాగిస్తున్నారు. వారంలో ఐదు రోజులు విశాఖ కేంద్రంగా రాష్ట్ర పాలన సాగించేందుకు సర్వం సిద్ధం చేసేశారు.  అమరావతి విషయంలో కోర్టు తీర్పు తరువాత నుంచి మూడు రాజధానులు అని జగన్ నోట ఎప్పుడు వచ్చినా జనం దానిని ఓ పెద్ద జోక్ గా తీసుకుంటున్నారు. నవ్వుకుంటున్నారు.  అన్ని విధాలుగా పాలనకు అనువుగా తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేసి ఉంచిన అమరావతికి దిక్కు లేదు కానీ మూడు రాజధానులా అని విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మూడు రాజధానుల పాటను పక్కన పెట్టి విశాఖ కేంద్రంగా పాలన సాగించడం ద్వారా అమరావతి అభివృద్ధిని నిర్వీర్యం చేశానన్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నది ఆయన యోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇందుకు ఈ నెల చివరి వారంలో లేదా వచ్చే నెల మొదటి వారంలో ముహూర్తం ఫిక్స్ చేయాలని భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అమరావతి రైతులకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత నుంచి అమరావతి నుంచి సాధ్యమైనంత త్వరగా (పారి)పోవాలని జగన్ భావిస్తున్నారని అంటున్నారు.

అమరావతి అభివృద్ధి కోసం అంటూ అక్కడి భూములను అమ్మకానికి పెట్టి, చంద్రబాబు హయాంలో నిర్మించిన భవనాలను లీజుకు ఇవ్వడానికి నిర్ణయించేసి.. సాధ్యమైనంత సొమ్ము దండుకుని.. కోర్టు తీర్పు అమలు చేస్తున్నామని చెబుతూనే ఆ పనులు నత్తనడకన సాగిస్తూ.. కర్నూలు న్యాయరాజధాని అన్న మాట ఎత్తకుండానే.. పాలనా రాజధానిగా తాను మొదటి నుంచీ చెబుతున్న విశాఖ కేంద్రంగా పాలన సాగించాలని జగన్ నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు.   అమరావతిలో కోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నామని చెప్పుకోవడానికి చిన్నచిన్న పనులు చేస్తూ.. జగన్ తన మకాం విశాఖకు మార్చేయనున్నారని పార్టీ శ్రేణుల నుంచి అందిన సమాచారం.

అయితే పాలనా రాజధాని అని విశాఖకు మకాం మారిస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురౌతాయన్న భయంతోనే క్యాంపు కార్యాలయం పేర కొత్త నాటకానికి తెరతీశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మకాం విశాఖకు మారిస్తే అందరి దృష్టినీ ప్రజా సమస్యల నుంచి మళ్లించే అవకాశం ఉంటుందనీ, విపక్షాలు, ప్రజలూ కూడా విశాఖ నుంచి పాలన అన్న విషయంపైనే దృష్టి కేంద్రీకరిస్తారనీ, రాష్ట్ర వ్యాప్తంగా అదే చర్చనీయాంశంగా మారుతుందనీ, పాలనా వైఫల్యాలపై విమర్శల దాడి ఆగిపోతుందనీ  జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.  

By
en-us Political News

  
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
నాదెండ్ల భాస్కరరావు 1935 జూన్ 23న పిచ్చయ్య, వెంకాయమ్మ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి డివిజన్‌లోని దోసేపూడి గ్రామంలో జన్మించారు.
తమిళనాడులో ఎన్డీయేకు పట్టం కట్టండి.. చెన్నైలో సీఎం చంద్రబాబు పిలుపు
మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా.. అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి.
చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.
19వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న బెంగాల్ పునరుజ్జీవనం భారత ఆధునిక చరిత్రలో ఒక మలుపు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు సమాజ సంస్కరణలు, విద్య, సాహిత్యం, జాతీయ చైతన్యం వంటి రంగాల్లో కొత్త దిశను చూపించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దశలోనూ బెంగాలీ నాయకుల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది.
గత పదేళ్ల కాలంలో ప్రపంచం అనేక తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ అనిశ్చితి, చైనా, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పశ్చిమాశియాలో ఉద్రిక్తతలు వంటివి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేశాయి. ఇటువంటి గడ్డు కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా స్థిరంగా నిలబడటమే కాకుండా, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఎదగడం వెనుక మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ముందుండి నడిపిస్తున్నా.. వెనుక నుంచి ప్రత్యర్థుల కదలికలను గమనించే శైలి మోడీదని అంటారు. మోడీ ఎల్లప్పుడూ ఒకటి కాదు, పది అడుగుల ముందుంటారనీ, అదే సమయంలో ప్రత్యర్థుల ప్రతి కదలికనూ నిశితంగా గమనిస్తారనీ వారు చెబుతారు. ఆయన రాజకీయ శైలిలో ప్రోయాక్టివ్ లీడర్షిప్, రియాక్టివ్ అవగాహన అనే రెండు ముఖ్యలక్షణాలు ఉన్నాయి.
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రధాని నరేంద్ర మోడీ.. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో మైగుడ్ ఫ్రెండ్ అని చంద్రబాబును సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ఆయన చూపుతున్న చొరవ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవడంలో ఆయనకున్న విజన్ అద్భుతమని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తుతించారు.
భారత రాజ్యాంగం ప్రకారం.. జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. ఇది ఏ పార్టీ ఇష్టానుసారం చేసే పని కాదు. ఇది రాజ్యాంగబద్ధమైన, ఆటోమేటిక్ ప్రక్రియ. ఎందుకు 50 సంవత్సరాలుగా డిలే అయింది? 1976 ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ.. డీలిమిటేషన్ను 2001 వరకు ఫ్రీజ్ చేశారు.2001 – వాజ్పేయి ప్రభుత్వం: ఫ్రీజ్ను 2026 వరకు పొడిగించింది. అంటే.. 2026లో డీలిమిటేషన్ జరుగుతుందని అన్ని పార్టీలకూ గత 20 సంవత్సరాలుగా తెలుసు.
ప్పుడు అమరావతి రాజధానిని సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ గా రూపొందించినట్లే, ఆయన రాజకీయ రంగప్రవేశంలో కూడా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీం ఏదో ఆలోచించి అమలులో పెట్టి ఉంటారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, తన ప్రసంగాలను మనం చేయలేమా? చేయగలం (యస్ వికెన్) అనే మాటతో ముగించేవారు. కానీ చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల క్రితమే తన జీవితానికి నేను చేయగలను (ఐ కేన్ డూ) అనే టాగ్ లైన్ నిర్దేశించుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.