అవినాష్ రెడ్డిని జగన్ వదిలించేసుకుంటారా?

Publish Date:Nov 15, 2024

Advertisement

తన కోసం, తన బాగు కోసం పని చేసిన వారిని కూరలో కరివేపాకులా తీసి పారేయడం జగన్ కు అలవాటే. తన రాజకీయ ప్రస్థానంలో అలా జగన్ కోసం పని చేసి ఆ తరువాత ఆయన చేత అవమానాలు ఎదుర్కొని దూరమైపోయిన వారు ఎందరో ఉన్నారు. ప్రధానంగా తన కోసం, తాను ముఖ్యమంత్రి కావడం కోసం కాలికి బలపం కట్టుకని మరీ రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన సొంత చెల్లి షర్మిల, తాను అరెస్టైనప్పుడు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసిన తల్లి విజయమ్మనూ అధికార పగ్గాలు అందుకున్న తరువాత ఎలా పక్కన పెట్టేశారో రాష్ట్రం మొత్తం తెలుసు. చివరాఖరికి ఆస్తుల విషయంలో కూడా వారిపై కేసులు పెట్టి మరీ సాధిస్తున్నారు

జగన్. తన రాజకీయ లబ్ధి కోసం వ్యక్తులను వాడుకుని వదిలివేయడం జగన్ కు కొత్తేమీ కాదు.  తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల సహా పార్టీలో  జగన్ తన రాజకీయ ఎదుగుదల కోసం నిచ్చెనలా వాడుకుని వదిలివేసిన వారెందరో కనిపిస్తారు. ఆయన ఎన్నికల ప్రచార సందర్భంగా ఎక్కడకు వెళ్లినా ఆ నియోజకవర్గ అభ్యర్థిని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మంత్రిని చేస్తా అంటూ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎన్నడూ భావించలేదు. మంగళగిరిలో 2019 ఎన్నికలలో లోకేష్ పై గెలిచిన ఆర్కే  ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా కొండవీటి చాంతాడు కూడా చిన్నబోయేంత పెద్దదిగా ఉంటుంది.  ఇక ఇప్పుడు తాజాగా జగన్ వదిలేసే, కాదు కాదు వదిలించుకునే  వ్యక్తి ఎవరంటే వైసీపీ శ్రేణుల నుంచే గట్టిగా వినిపిస్తున్న పేరు కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. 

ఔను వైఎస్ అవినాష్ రెడ్డిని వదిలించుకోవడం తప్ప జగన్ కు ఇప్పుడు మరో దారి కనిపించడం లేదని అంటున్నారు. సోషల్ మీడియాలో బూతు పోస్టులు పెట్టిన వారిపై కూటమి సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. వారు ఏ కలుగులో దాగున్నా వెతికి పట్టుకుని చట్టం ముందు నిలుపుతోంది. కోర్టులు సైతం బూతు పోస్టులు పెట్టిన వారికి మద్దతుగా దాఖలైన పిటిషన్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. తప్పు చేసి బెయిలు అడిగితే ఎలా అని నిలదీస్తోంది. దీంతో ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాలో అసభ్య, అసహ్య, అశ్లీల పోస్టులతో ప్రత్యర్థి పార్టీ నాయకులు, వారి కుటుంబీకులను వేధించి, మనో వేదనకు గురి చేసిన వారి గుండెళ్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. క్షమాపణలు చెప్పుకునో, కాళ్లా వేళ్లా పడి బతిమలాడుకునే తప్పించుకునే వీలు లేదని అర్ధమైపోయింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో తాను అసభ్య పోస్టులు పెట్టడం వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారంటూ ఇటీవల అరెస్టైన వర్రా రవీంద్రారెడ్డి పోలీసుల విచారణలో అంగీకరించేశారు. ముఖ్యంగా వైఎస్ జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలపై సోషల్ మీడియాలో  తాను అసభ్య పోస్టుల వెనుక కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడరి వర్రారాఘవరెడ్డి కుండబద్దలు కొట్టడంతో ఇప్పుడిక జగన్ కు ఆయనను వదిలించుకోవడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది.

అలా కాకుండా ఇంకా అవినాష్ ను చిన్న పిల్లోడు, సాత్వికుడు అంటూ వెనకేసుకుని వస్తే.. స్వయంగా జగన్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. అసలు వైఎస్ అవినాష్ రెడ్డిని వెనకేసుకుని రావడం వల్లే కంచుకోట లాంటి కడపలో వైసీపీ దెబ్బతింది.  వర్రా వాంగ్మూలంతో జగన్ తల్లిని, చెల్లిని అసభ్యంగా దూషిస్తూ, వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోస్టులు పెట్టడం వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి పిఎ, అతని వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారని సందేహాలకు అతీతంగా తేలిపోయింది. అప్పటి వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఇన్ చార్జ్ సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ ఉన్నారని వర్రా  వాంగ్మూలంతో తేలిపోవడంతో ఇక జగన్ వారిని పట్టించుకునే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

రానున్న రోజులలో జగన్ స్వయంగా తన తల్లి, చెల్లిపై అసభ్య పోస్టులు పెట్టిన వారిని శిక్షించాలని డిమాండ్ చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఇప్పటికే  సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిని వైసీపీ వెనకేసుకు రాదని, వారిని సమర్ధించదనీ మండలిలో ప్రతిపక్ష నేత హోదాలో బొత్స సత్యనారాయణ విస్పష్టంగా చెప్పేశారు. జగన్ కూడా ముందు ముందు అదే చేయాల్సి వస్తుంది. లేకపోతే ఇప్పటికే తన ఐదేళ్ల అరాచక పాలనను ఛీ కొడుతూ చరిత్రలో కనీవినీ ఎరుగని ఓటమిని ఇచ్చిన జనం ఇక ముఖం మీదే ఛీ కొట్టే పరిస్థితి వస్తుందని అంటున్నారు.  

By
en-us Political News

  
Publish Date:May 3, 2026
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు. ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్‌కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్‌లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్‌లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బ‌లోపేతం, స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.