Publish Date:Jul 25, 2022
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎలాగైనా రాష్ట్రంలో రెండో సారి అధికార పగ్గాలు చేపట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. ఆయన ప్రతి మాటా, ప్రతి కదలికా, ప్రతి చర్యా, ప్రతి ప్రసంగం ఆ విషయాన్నే చెబుతుంది.
అయితే వాస్తవ పరిస్థితులు అందుకు అనుగుణంగా ఉన్నాయా అంటే మాత్రం కనీసం పార్టీ శ్రేణుల నుంచి కూడా ఔననే సమాధానం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జగన్ పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదు. అందులో వైసీపీ వాళ్లు మినహాయింపు ఎంత మాత్రం కాదు. నియోజకవర్గంలో తిష్ట వేసిన సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేద్దామని ప్రయత్నించే ఎమ్మెల్యేలకు ఆయన దర్శనమే దొరకదు. ఈ మూడేళ్ల కాలంలో ఒక్కసారంటే ఒక్క సారి కూడా సీఎంను కలుసుకోవడానికి కనీస అవకాశం దొరకని ఎమ్మెల్యేల సంఖ్య వందకు పైగానే ఉంటుందని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. జగన్ చెబుతున్నట్లు వచ్చే నెల నుంచి నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించడం జరిగే పని కాదని ఆ పార్టీ వారే పెదవి విరుస్తున్నారు.
నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తే ముందుగా చర్చకు వచ్చేది ఆ నియోజకవర్గంలోని సమస్యలేనని అంటున్నారు. అయితే ఆ సమస్యలను అడ్రెస్ చేసే తీరిక కానీ, ఓపిక కానీ జగన్ కు లేవనడానికి గడప గడపకూలో ఎదురౌతున్న సమస్యలను జగన్ కు తెలియజెప్పడానికి యత్నించిన ఎమ్మెల్యేలకు ఆయన విసుగు, చిరాకు ఎదురైన సంగతిని పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నరు. రోజుకు ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని ఆ నియోజకవర్గానికి చెందిన ఓ 50మంది ముఖ్యులతో సమావేశమైనా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలనూ కవర్ చేయాలంటే కనీసం ఆరు నెలలు పడుతుందని చెబుతున్నారు. ఒక వైపు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం, మరో వైపు నియోజకవర్గాల వారీగా సమావేశాలు అంటే ఎమ్మెల్యేలు రెంటినీ అవాయిడ్ చేసే అవకావం ఉందని పార్టీ శ్రేణులే అంటున్నాయి.
నియోజకవర్గాల వారీ సమావేశాలలో అనివార్యంగా ప్రజా సమస్యలే ముందుగా చర్చకు వస్తాయి. అవి చర్చకు రాగానే వాటి పరిష్కారాన్ని సీఎం సూచించాలి. అలా సూచించడానికైనా ముందుగా నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిధులు విడుదల చేయాలి. ఏ విధంగా చూసినా ఇప్పుడు నియోజకవర్గాలలో సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించే పరిస్థితే లేదు. వీటన్నిటికీ మించి తమ ప్రభుత్వంపై నమ్మకంతో పార్టీ నేతలకు చేసిన పనులకు ఇన్నేళ్లుగా బిల్లులు రాలేదు. ఆ బిల్లులు చెల్లించకుండా జగన్ మాత్రం ఏ ముఖం పెట్టుకుని వారితో సమావేశం కాగలరు అని పార్టీ వర్గాలే ప్రశ్నిస్తున్నాయి.
చివరాఖరికి ఇటీవలి వరదల సమయంలో ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తీసుకు వచ్చిన పడవలకు డీజిల్ డబ్బులు కూడా ఇవ్వలేని ప్రభుత్వం చేసిన పనులకు బిల్లులు వడుదల చేస్తుందని ఆశించడం దురాశే అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో జగన్ చెప్పినట్లుగా వచ్చే నెలనుంచి నియోజకవర్గాల వారీ సమావేశాలు జరిగే అవకాశాలు దాదాపు మృగ్యమనే అంటున్నాయి పార్టీ శ్రేణులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/will-jagan-conduct-constituency-wise-party-meetings-25-140509.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?