ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయి అన్న విషయం బీఏసీ సమావేశం నిర్ణయిస్తుంది. అయితే ఓ పది రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ పీ అసెంబ్లీ, మండలి సమావేశాల నోటిఫికేషన్ ను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ జారీ చేశారు. ఈ సమావేశాలలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. రాష్ట్ర విత్తమంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెడతారు. పలు కీలక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశ పెట్టి సభ ఆమోదం పొందాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంది. వీటిలో చట్ట సవరణలకు సంబంధించిన బిల్లులు కూడా ఉంటాయంటున్నారు.
అయితే వీటన్నిటికంటే ఏపీ అసెంబ్లీ సమావేశాలు అనగానే అందరి ఆసక్తీ ఆ 11 మంది ఎమ్మెల్యేలపైనే ఉంది. ఆ పదకొడు మంది ఎమ్మెల్యేలూ సభకు హాజరౌతారా? డుమ్మా కొడతారా? అన్న ఆసక్తి రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా ఉంది. ఇంతకీ ఆ 11 మంది ఎమ్మెల్యేలూ ఎవరనుకుంటున్నారా... వాళ్లే వైసీపీ ఎమ్మెల్యేలు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మర్యాద ఇవ్వడమే కాదు.. తీసుకోవడమూ రాదని ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి వచ్చిన రోజే తేలిపోయింది. గైర్హాజరైతే ఉన్న ఎమ్మెల్యే గిరీ కూడా పోతుందన్న ఒకే ఒక్క కారణంతో ఆయన ఆ రోజు అసెంబ్లీకి వచ్చారు. ఆయన విజ్ణప్తికి సానుకూలంగా స్పందించిన చంద్రబాబు ఆ నాడు జగన్ కు అర్హత లేకపోయినా, ఆయన కారును అసెంబ్లీ గేటు లోపలికి అనుమతించారు. అక్షర క్రమంతో సంబంధం లేకుండా ముందుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాన్ని కూడా కల్పించారు. అయినా ఆ మర్యాద, గౌరవం నిలబెట్టుకోవడం తెలియని జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా ఇలా ప్రమాణ స్వీకారం చేసి.. అలా వెళ్లిపోయారు. కనీసం తన పార్టీ సభ్యుల ప్రమాణ స్వీకారం వరకూ కూడా కూర్చోలేదు. పోనీ అది పక్కన పెట్టినా.. మంత్రుల కంటే ముందు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వలేదంటూ.. బయటకు వెళ్లి విమర్శలు గుప్పించారు. దీనిని బట్టే ఆయనకు అసెంబ్లీలో కూర్చునే ఉద్దేశం లేదని అవగతమైపోతున్నది.
రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యపై హస్తిన వెళ్లి మరీ ధర్నా చేసి వచ్చిన జగన్.. అదే సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారన్న ప్రశ్నకు ఆయన వద్ద సమాధానం ఉందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి జగన్ రెడ్డికి అసెంబ్లీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరౌతారా, డుమ్మా కొడతారా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/will-jagan-atted-assembly-25-187901.html
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.