హైడ్రా దూకుడు ఆరంభశూరత్వమేనా?

Publish Date:Aug 31, 2024

Advertisement

మహానగరంలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఇదే దూకుడును చివరి వరకూ కొనసాగించాలని భాగ్యనగర వాసులు కోరుతున్నారు.  చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లోని నిర్మాణాల కారణంగనే విశ్వనగరం అని చెప్పుకునే భాగ్యనగరం చినుకు పడితే చిగురుటాకులా వణికిపోతోంది. కాలనీలకు కాలనీలు జలదిగ్బంధనంలో చిక్కుకుంటున్నాయి. ఇలా చెరువులు, కుంటలు ఆక్రమించి కట్టిన కట్టడాలలో జూబ్లీ హిల్స్ లోని లోటస్ పాండ్ లో నిర్మించిన జగన్ నివాసం కూడా ఉంది. ఇప్పుడు ఆ జగన్ నివాసానికి సైతం హైడ్రా నోటీసులు ఇచ్చింది. అయితే నోటీసులు ఇవ్వం కూల్చివేయడమే అని గంభీరంగా ప్రకటించిన హైడ్రా కమషనర్ రంగనాథ్.. మరి జగన్ లోటస్ పాండ్ నివాసాన్ని కూల్చివేయకుండా నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. చెరువులను ఆక్రమించి నిర్మించిన కాలేజీలకు నోటీసులు ఇచ్చి కొంత సమయం ఇచ్చారంటే అర్ధం ఉంది. విద్యాసంవత్సరం మధ్యలో ఉన్న సమయంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశాన్ని తప్పుపట్టలేం. కానీ జగన్ లోటస్ పాండ్ వంటి నిర్మాణాలకు నోటీసులు ఇవ్వడమేంటని జనం ప్రశ్నిస్తున్నారు.  నిబంధనల ప్రకారం కూల్చివేయడానికి హైడ్రా ఎందుకు వెనకాడుతోందన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి తిరుపతి రెడ్డి భవనానికి కూడా నోటీసులు ఇవ్వడం చూస్తుంటే నోటీసులు లేవు కూల్చివేతలే అంటున్న రంగనాథ్ మాటల ఉత్తుత్తి బెదరింపులేనా అన్న చర్చ తెరపైకి వచ్చింది. 
 ఇటీవల తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది హైడ్రాయే.  హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ అధారిటీ. దీనిని తెలంగాణ    సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సాహసోపేతంగా చెరువులు, కుంటలు,నాళాలు ఆక్రమించుకున్న కబ్జాకోరుల ఆట కట్టించి నగరానికి ఏర్పడుతున్న వరదల ముప్పు నుంచి కాపాడాలన్న లక్ష్యంతో హైడ్రా ఏర్పాటు చేశారు.  ఆయన చెరువులు, కుంటలను ఆక్రమణల నుంచి విముక్తి చేయాలన్న ఉక్కు సంకల్పంతో ఉన్నారనడానికి  సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూలగొట్టడమే ఉదాహరణ. తుమ్మడి కుంట చెరువు ఆయకట్టులో మూడున్నర ఎకరాలు ఆక్రమించారని స్పష్టమైన ఆధారాలతో నోటీస్ కూడా ఇవ్వకుండా హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపింది. రాష్ట్రప్రభుత్వంతో పాటు హైడ్రా అధికారులకు పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి.రే వంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆరంభశూరత్వం కాదని మాదాపూర్ లోని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సంఘటన నిరూపించింది. గతంలో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎన్ కన్వెన్షన్ వద్ద హడావుడి చేసింది.అయ్యప్ప సోసైటీ పరిధిలో అక్రమకట్టడాలను కొన్ని కూల్చి ఆ తరువాత ఆ ఊసే మర్చిపోయింది. గత పదేళ్లుగా అంటే బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నంత కాలం ఆక్రమణలు, చెరువులపై అక్రమకట్టడాల జోలికి పోలేదు.  చెరువులు,నాళాల ఆక్రమణల కారణంగా చిన్న పాటి వర్షానికి కూడా రోడ్లు నదులుగా మారిపోతున్నా,జనం నరక యాతన అనుభవిస్తున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లే ఊరుకున్నది.

నిధులు, నీళ్లు, నియామకాలు అంటూ 14 ఏళ్ల పాటు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన బీఆర్ఎస్ (టీఆర్ఎస్) రాష్ట్రం ఆవిర్భవించి అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం ఆక్రమణల ఊసెత్తలేదు. చెరువల సంరక్షణ గురించి పట్టించుకోలేదు. దీంతో హైదరాబాద్ కాస్తా వాన పడితే హైదరాబాధ అన్నట్లుగా మారిపోయే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ కు ఈ నరక బాధను తప్పించాలన్న ధృఢ సంకల్పంతో రేవంత్ సర్కార్ హైడ్రా ఏర్పాటు చేసింది.  అది పని ప్రారంభించింది. నగరంలో అనేక చెరువులు పూడ్చి విద్యా సంస్థలను నిర్మించారు. వాటిలో ఓవైసీ, మల్లారెడ్డి వంటి ప్రముఖులవి కూడా ఉన్నాయి. ఆయా యజమానులు ప్రభుత్వ దూకుడుకు భయపడి హైకోర్టును ఆశ్రయించారు. అలాగే పలువురు మధ్యతరగతి కుటుంబాలు కూడా కోర్టులను,అధికారులను ఆశ్రయిస్తున్నారు.

విద్యా సంస్థలను కూల్చివేసి విద్యార్ధులకు విద్యా సంవత్సరం నష్టం చేయవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వెంటనే కాకపోయినా వారికి కొంతసమయం ఇచ్చి ఈ అక్రమ కట్టడాలు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అలాగే 20,30 సంవత్సరాలు గా ఉంటున్న కుటుంబాలు తమ గతేమిటని ప్రశ్నిస్తున్నాయి. వాస్తవానికి చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలకు అధికారులే  చట్టపరంగా  అనుమతి ఇచ్చారు. అలా అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన ఆధికారులపైనా చర్యలకు ఉపక్రమించారు అది మంచిదే. కానీ చట్టబద్ధంగా అనుమతి పొందిన నిర్మించిన భవనాలకు చట్ట విరుద్ధం అంటూ ఎలా కూల్చేస్తారన్నది ప్రశ్న. మొత్తం మీద హైడ్రాది ఆరంభశూరత్వంగానే మిగిలిపోతుందా? నగరంలోని ప్రతి అక్కమకట్డాన్నీ నేలమట్టం చేసే వరకూ ఇదే దూకుడు ప్రదర్శిస్తుందా అన్నది చూడాలి. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.