Publish Date:Dec 25, 2024
అల్లు అర్జున్ అరెస్టు తదననంతర పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వానికీ, సినీ పరిశ్రమకు మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఎఫ్ డీసీ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో కొందరు సినీ ప్రముఖులు గురువారం ( డిసెంబర్ 26) ముఖ్యమంత్రి రేవంత్ తో భేటీ కానున్నారు. అయితే ఈ భేటీతో సమస్య పరిష్కారం అవుతుందా? లేక మళ్లీ కొత్తగా మొదలౌతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అసలు సీఎం రేవంత్ తో భేటీకి వెళ్లే సినీ ప్రముఖులు ఎవరు? ఎంతమంది? అన్నదానిపై ఇంత వరకూ క్లారిటీ లేదు. అల్లు అర్జున్ అరెస్టు తరువాత వరుసగా జరిగిన సంఘటనలతో అసలు సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి తరలిపోతుందా అన్న స్థాయిలో చర్చలు జరిగాయి. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి సినీ సెలబ్రిటీలు అరెస్టై మధ్యంతర బెయిలుపై బయటకు వచ్చిన అల్లు అర్జున్ ను పరామర్శించడానికి క్యూకట్టడాన్ని ఆక్షేపించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను పరామర్శించడానికి ముందుకు రాని సినీ ప్రముఖులు అల్లు అర్జున్ నివాసానికి క్యూకట్టడం ఏమిటని నిలదీశారు. అసెంబ్లీ వేదికగానే సినీ పరిశ్రమ తీరుపై విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఇక రాష్ట్రంలో కొత్త సినిమాల విడుదలకు ప్రీమియర్ షోలకు, టికెట్ల రేట్ల పెంపునకు అనుమతులు ఉండవని కుండబద్దలు కొట్టారు. ఇది మొత్తం టాలీవుడ్ ను షేక్ చేసేసింది. సంక్రాంతి అంటేనే సినీమల సీజన్. అటువంటి కీలకమైన తరుణంగా సినిమాల టికెట్ ధరలు పెంపునకు, ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతులు ఉండవు అంటే సినీ పరిశ్రమ సంక్షోభంలో పడుతుందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అయ్యింది.
అయితే తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ డీసీ చైర్మన్ గా నియమించిన దిల్ రాజు సంక్షోభ పరిష్కర్తగా, ట్రబుల్ షూటర్ గా రంగంలోకి దిగారు. సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పడమే కాకుండా, కొత్త సినిమాల ప్రత్యేక ప్రదర్శనలు, టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వాన్ని ఒప్పించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన చొరవ వల్లే సీఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో భేటీ కావడానికి అంగీకరించారు.
అయితే గద్దర్ అవార్డుల మార్గదర్శకాల విషయంలో సినీ పరిశ్రమ స్పందన పట్ల రేవంత్ లో ఆగ్రహం ఉంది. అలాగే గత బీఆర్ఎస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ఇచ్చిన గౌరవం, ప్రస్తుతం సీనీ పరిశ్రమ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికీ, ముఖ్యమంత్రిగా తనకూ దక్కడం లేదన్న భావన కూడా రేవంత్ లో ఉందని అంటున్నారు. అన్నిటికీ మించి తన వ్యాఖ్యలను ఖండించడానికే అన్నట్లుగా అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడాన్నీ కాంగ్రెస్ తప్పుపడుతోంది. అన్నిటికీ మించి సంధ్యా థియోటర్ తొక్కిసలాట సంఘటన తరువాత అల్లు అర్జున్ స్పందించిన తీరు పట్ల సినీ పరిశ్రమ వర్గాలలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈ రోజు సీఎంతో భేటీకి సీని దిగ్గజాలలో ఎవరెవరు హాజరౌతారన్న దానిపైనా క్లారిటీ లేదు. మెగా స్టార్ చిరంజీవి ఈ భేటీకి దూరంగా ఉండనున్నారని సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అదే జరిగితే.. ఈ భేటీ వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని అంటున్నారు. మొత్తానికి రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీ సమస్య పరిష్కరిస్తుందా లేదా సమస్యను మళ్లీ కొత్తగా ప్రారంభమయ్యేలా చేస్తుందా చూడాల్సి ఉందని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/will-chiru-join-cine-celebrities-meet-cm-revanth-39-190321.html
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.