Publish Date:Feb 13, 2020
జగిత్యాలలో ఓ వింత ఫ్యామిలీ హల్చల్ చేసింది. బైక్ పైనుంచి తనను తోసేశాడంటూ భార్య హాస్పిటల్లో చేరితే... ఫోన్లు చేస్తూ తనను టార్చర్ పెడుతోందంటూ భర్త బోరుమంటున్నాడు. జగిగ్యాలకు చెందిన రాణి, భరత్ భార్యాభర్తలు... ఇద్దరూ కలిసి టూవీలర్ పై వస్తుండగా ఇద్దరి మధ్యా గొడవ జరిగింది... బైక్ పై వెళ్తూనే వాదులాడుకున్నారు... మాటామాటా పెరిగింది... ఇంతలో ఏమైందో బైక్ పైనుంచి రాణి కిందపడిపోయింది... దాంతో, రాణికి తీవ్ర గాయాలు అయ్యాయి... జగిత్యాల బైపాస్ రోడ్డులో పడిపోయి ఉండటంతో... 108లో ప్రైవేట్ ఆస్పత్రికి రాణికి తీసుకెళ్లారు.... తీవ్ర గాయాలతో విలవిల్లాడుతున్న రాణికి ప్రాథమిక చికిత్స చేశారు.
అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగిందని ప్రశ్నించగా... తన భర్తే బైక్ పైనుంచి తోసేశాడంటూ చెప్పింది. దాంతో, అక్కడున్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. అయితే, అసలేం జరిగిందని భర్తను పశ్నిస్తే... ఆమె తనతో గొడవ పడుతూ బైక్ పైనుంచి దూకేసిందని చెప్పుకొచ్చాడు. అయితే, ఇద్దరి మాటలు విన్న ఆస్పత్రి సిబ్బంది... భార్యాభర్తల మధ్య రోజూ ఉండే గొడవలే కదా అనుకున్నారు. అయితే, అసలు సంగతి చెబుతూ భోరుమన్నాడు రాణి భర్త భరత్. అది విన్న ఆస్పత్రి సిబ్బంది, అక్కడున్న జనం ముక్కున వేలేసుకున్నారు. అతడి పరిస్థితిని తలుచుకుని అయ్యో పాపం అనుకున్నారు.
రాణి తనను మూడో పెళ్లి చేసుకుందని, ఆమె తన కంటే పదేళ్లు పెద్దదని ఏడుస్తూ చెప్పాడు భరత్. ఇంట్లో పేషెంట్ ఉన్నాడు... కటింగ్ చేయాలంటూ పిలిచి... తనను ట్రాప్ చేసి మూడో పెళ్లి చేసుకుందని ఏడుపు లంకించుకున్నాడు. అంతేకాదు, మా అమ్మానాన్న దగ్గరకి వెళ్తే ఎక్కడున్నావ్ అంటూ ఫోన్లు చేస్తూ విసిగిస్తూ టార్చర్ పెడుతోందని, ఆ విషయంలోనే తమ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అలా, బైక్ పై గొడవ పడుతూనే కిందకి దూకేసిందని చెప్పాడు. భరత్ మాటలు విన్నాక అక్కడున్నవారికి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. అసలు భార్యాభర్తల్లో ఎవరిని ఓదార్చాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఇదేం వింత ఫ్యామిలీరా బాబూ అంటూ అక్కడ్నుంచి జారుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/wife-tortured-her-third-husband-in-telangana-25-94217.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.