Publish Date:Feb 13, 2020
జగిత్యాలలో ఓ వింత ఫ్యామిలీ హల్చల్ చేసింది. బైక్ పైనుంచి తనను తోసేశాడంటూ భార్య హాస్పిటల్లో చేరితే... ఫోన్లు చేస్తూ తనను టార్చర్ పెడుతోందంటూ భర్త బోరుమంటున్నాడు. జగిగ్యాలకు చెందిన రాణి, భరత్ భార్యాభర్తలు... ఇద్దరూ కలిసి టూవీలర్ పై వస్తుండగా ఇద్దరి మధ్యా గొడవ జరిగింది... బైక్ పై వెళ్తూనే వాదులాడుకున్నారు... మాటామాటా పెరిగింది... ఇంతలో ఏమైందో బైక్ పైనుంచి రాణి కిందపడిపోయింది... దాంతో, రాణికి తీవ్ర గాయాలు అయ్యాయి... జగిత్యాల బైపాస్ రోడ్డులో పడిపోయి ఉండటంతో... 108లో ప్రైవేట్ ఆస్పత్రికి రాణికి తీసుకెళ్లారు.... తీవ్ర గాయాలతో విలవిల్లాడుతున్న రాణికి ప్రాథమిక చికిత్స చేశారు.
అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగిందని ప్రశ్నించగా... తన భర్తే బైక్ పైనుంచి తోసేశాడంటూ చెప్పింది. దాంతో, అక్కడున్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. అయితే, అసలేం జరిగిందని భర్తను పశ్నిస్తే... ఆమె తనతో గొడవ పడుతూ బైక్ పైనుంచి దూకేసిందని చెప్పుకొచ్చాడు. అయితే, ఇద్దరి మాటలు విన్న ఆస్పత్రి సిబ్బంది... భార్యాభర్తల మధ్య రోజూ ఉండే గొడవలే కదా అనుకున్నారు. అయితే, అసలు సంగతి చెబుతూ భోరుమన్నాడు రాణి భర్త భరత్. అది విన్న ఆస్పత్రి సిబ్బంది, అక్కడున్న జనం ముక్కున వేలేసుకున్నారు. అతడి పరిస్థితిని తలుచుకుని అయ్యో పాపం అనుకున్నారు.
రాణి తనను మూడో పెళ్లి చేసుకుందని, ఆమె తన కంటే పదేళ్లు పెద్దదని ఏడుస్తూ చెప్పాడు భరత్. ఇంట్లో పేషెంట్ ఉన్నాడు... కటింగ్ చేయాలంటూ పిలిచి... తనను ట్రాప్ చేసి మూడో పెళ్లి చేసుకుందని ఏడుపు లంకించుకున్నాడు. అంతేకాదు, మా అమ్మానాన్న దగ్గరకి వెళ్తే ఎక్కడున్నావ్ అంటూ ఫోన్లు చేస్తూ విసిగిస్తూ టార్చర్ పెడుతోందని, ఆ విషయంలోనే తమ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అలా, బైక్ పై గొడవ పడుతూనే కిందకి దూకేసిందని చెప్పాడు. భరత్ మాటలు విన్నాక అక్కడున్నవారికి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. అసలు భార్యాభర్తల్లో ఎవరిని ఓదార్చాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఇదేం వింత ఫ్యామిలీరా బాబూ అంటూ అక్కడ్నుంచి జారుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/wife-tortured-her-third-husband-in-telangana-25-94217.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.