వైసీపీకి శాశ్వత అధ్యక్షుడెందుకు? విజయమ్మకు ఉద్వాసన ఎందుకు??

Publish Date:Jul 7, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీలో ఏదో జరుగుతోంది. ఆ పార్టీ అధినేతలో భయం గూడుకట్టుకుందా అన్న అనుమానాలు ఆ పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమౌతున్నాయి. లేకపోతే ఉరుములేని మెరుపులా పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా తనను తాను ప్రకటించుకునేందుకు జగన్ ఎందుకు అంత తొందరపడుతున్నారు. తనపై తిరుగుబాటు చేసి ఎవరైనా పార్టీ అధ్యక్షపదవిని తన్నుకుపోతారని భావిస్తున్నారా? అన్న అనుమానాలను పరిశీలకులు సైతం వ్యక్తం చేస్తున్నారు.

లేకపోతే పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ను నియమిస్తూ పార్టీ ప్లీనరీ వేదికగా ఎందుకు నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ప్రతి రెండేళ్లకూ ఒక సారి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలన్న పార్టీ బైలాస్ ను ఇప్పటికిప్పుడు ఎందుకు సవరణ చేసి మరీ జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా నియమించేందుకు తొదర పడుతున్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ ప్లీనరీ వేదికగా సమాధానం దొరుకుతుందో లేదో ఇప్పటికైతే తెలియదు కానీ, హడావుడిగా పార్టీ బైలాస్ ను సవరించి మరీ జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించేందుకు పడుతున్న తొందర వెనుక ఉన్న కారణం భయమేనని విశ్లేషిస్తున్నారు.

అదే సమయంలో ప్లీనరీ వేదికగా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేత రాజీనామా చేయించేందుకు నిర్ణయించడం కూడా ఆమె వలన పార్టీలో చీలిక వస్తుందా అన్న భయమే కనబడుతోందని అంటున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి తానేటి వనితలు పార్టీ బైలాస్సవరణ విషయంలో ఇప్పటికే ఓ ప్రకటన చేశారు. వైసీపీ ఆవిర్భవించినప్పటి నుంచీ పార్టీ అధ్యక్షుడిగా జగనే కొనసాగుతున్నారు.

పార్టీ నియమావళి మేరకు ప్రతి రెండేళ్లకూ ఓ సారి పార్టీ ఆయననే అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ వస్తోంది. ఆ ఎన్నిక కూడా ఏకగ్రీవమే. పోటీ మాటే లేదు. అయితే ఇప్పుడు హఠాత్తుగా ప్రతి రెండేళ్ల కోసారి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియకు ఫుల్ స్టాప్ పెట్టి శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ను నియమించాల్సిన అత్యవసర పరిస్థితి ఎందుకు వచ్చింది. అలాగే పార్టీ ఆవిర్భావం నుంచీ కూడా పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మను ఆఘమేఘాల మీద తొలగించాల్సిన అవసరం ఏమిటి? అన్న ప్రశ్నలకు పరిశీలకులు మాత్రం పార్టీలో మారుతున్న పరిస్థితి, పెరుగుతున్న అసంతృప్తే కారణమని అంటున్నారు.

జగన్ పట్ల అసంతృప్తితో ఉన్న నేతలు, శ్రేణులు విజయమ్మను ఆశ్రయిస్తారన్న భయమే ఆమెను పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తప్పించాలన్న జగన్ నిర్ణయానికి కారణంగా చెబుతున్నారు. అదే సమయంలో పార్టీలో తిరుగుబాటు భయమే జగన్ ను తనను పార్టీ శాశ్వత అధ్యక్షునిగా నియమించుకునే దిశగా నడిపిందని అంటున్నారు.

ఇటీవల మహారాష్ట్రలో సంభవించిన పరిస్థితుల నేపధ్యంలోనే జగన్ లో ఈ భయం మరింతగా పెరిగిందని విశ్లేషకులు అంటున్నారు. మహారాష్ట్ర శివసేనలో తిరుగులేని నేతగా వెలుగొందుతున్న ఉద్ధవ్ థాక్రేపై ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేసి తమదే అసలైన శివసేన అని క్లెయిమ్ చేసుకుంటున్న సంగతి విదితమే. తన ముందస్తు ప్రణాళికలు, పార్టీలో పెరుగుతున్నఅసమ్మతి నేపథ్యంలో జగన్ ముందు జాగ్రత్తగా శాశ్వత అధ్యక్ష పదవిని చేపట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

By
en-us Political News

  
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.