వైసీపీ మళ్లీ ఛాన్స్ ఎందుకివ్వాలి?

Publish Date:Oct 14, 2022

Advertisement

ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి, అధికార పీఠం ఎక్కాలని పార్టీలన్నీ రకరకాల వ్యూహాలతో జనం ముందుకు వస్తున్నాయి. ఈ విషయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూడా పోటీ పడుతున్నాయి. తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ప్రస్తుతం అధికారం వెలగబెడుతున్న వైసీపీ కూడా అధికారపీఠాన్ని అంటిపెట్టుకుని కూర్చోవాలని ఇప్పటి నుంచే వ్యూహాలు పన్నుతోంది. మనిషి మాంసం రుచిమరిగిన పులిలా అధికారం రుచి మరిగిన వైసీపీ కుర్చీ పట్టుకుని వేళ్లాడడం కోసం ఫీట్ల మీద ఫీట్లు చేస్తోంది.

ఒక్క ఛాన్స్ అంటూ ఊరూరా తిరిగి మరీ వేడుకుని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి సర్కార్ ఈ మూడున్నరేళ్లలో తమకు ఒరగబెట్టిందేంటనే సూటి ప్రశ్న జనం నుంచి దూసుకొస్తోంది. వైసీపీ పాలన ఏమాత్రం మెప్పించలేదని జనం చెబుతున్నారు. వైసీపీ అధినేతకు భయపడో, మరో కారణం వల్లో అంత చేశాం, ఇంత చేశాం అంటూ పైకి చెబుతున్నప్పటికీ జగన్ పాలనపై ఆ పార్టీ నేతల అనుచరులు కూడా అక్కడక్కడా పెదవి విరుస్తున్న సందర్భాలు ఉంటున్నాయి.

అభివృద్ధిని పట్టించుకోకుండా, సంక్షేమ పథకాల పేరుతో తమను మభ్యపెట్టిన జగన్ సర్కార్ పై ప్రజల్లో మబ్బులు వీడిపోతున్నాయంటున్నారు. ఏపీలో అభివృద్ధి నేతిబీరలో నెయ్యి చందంగా మారిందంటున్నారు. నిజానికి జగన్ పాలనపై ఏపీని ఏ సామాజికవర్గమూ సంతృప్తిగా ఉన్నట్లు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తీవ్ర అవినీతిలో కూరుకుపోయిన వైసీపీ సర్కార్ ఏపీలో వస్తున్న ఆదాయాన్ని దేనికి ఖర్చు పెడుతోంది? లెక్కకు మించి తెస్తున్న అప్పుల సొమ్మును ఎందుకు వినియోగిస్తోందో తెలియని అయోమయస్థితి నెలకొందంటున్నారు. జగన్ రెడ్డి సర్కార్ తెచ్చిన అప్పుల్ని తీర్చే దెలా? అనే ప్రశ్న సామాన్యులు మొదలు రాజకీయ పండితులు, మేధావుల దాకా ప్రతి ఒక్కరూ వేస్తున్నారు.

విభజిత ఏపీలో తొలిసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ ప్రభుత్వ పాలన ముగిసే నాటికి 3 లక్షల కోట్లు అప్పు ఉండేది. ఏపీకి అప్పుడు 16 వేల 78 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. లోటు బడ్జెట్ తో ఏర్పాటైన నవజాత ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు టీడీపీ పాలనా కాలం పూర్తయ్యే సరికి అప్పటి సీఎం చంద్రబాబు సర్కార్ 3 లక్షల కోట్లు అప్పు తెచ్చింది. అయితే.. ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు అహర్నిశలు కృషిచేశారు. అమరావతి రాజధాని పేరిట సరికొత్త నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాలను నిర్మించారు.

కానీ.. జగన్ సర్కార్ పాలన మూడేళ్లలో ఏపీ అప్పులను 7 లక్షల కోట్లకు పైగా తీసుకెళ్లింది. ఇంత భారీగా చేసిన అప్పుల్ని ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తీర్చ గలుగుతుందా? అనే సందేహాలు ఆర్థిక రంగ నిపుణుల నుంచి వస్తున్నాయి. వైసీపీ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోతే మరో రెండేళ్లు ఏపీలో అధికారంలో ఉంటుంది. ఈ క్రమంలో ప్రజలకు సంక్షేమ పథకాలు, ఉచిత పందేరాల నెపంతో అప్పటికి ఏపీ అప్పును దాదాపు 10 లక్షల కోట్లకు పెంచేసే అవకాశాలు లేకపోలేదనే ఆందోళన ఆర్థిక నిపుణుల నుంచి వ్యక్తం అవుతోంది. తలకు మించి వైసీపీ సర్కార్ చేసిన అప్పుల భారాన్ని ‘కల్లు తాగినోడే కట్టాలి తాటిచెట్టు పన్ను’ చందంగా వైసీపీకి ఓటు వేసి గెలిపించిన జనమే భరించక తప్పదంటున్నారు.

ఇంత అప్పు చేసినా.. ఒక్క రూపాయి కూడా ఉత్పత్తి ఆధారిత, ఆదాయం వచ్చే  కార్యక్రమాలకు వైసీపీ సర్కార్ ఖర్చు చేయకపోవడం గమనార్హం. విద్యుత్, రవాణా చార్జీలు పెంచేసిన రాష్ట్ర ప్రభుత్వం చెత్త మీద కూడా పన్ను వేసిన దుర్మార్గానికి పాల్పడింది. ఏపీకి ఇలా ప్రజలపై వేసిన పన్నుల రూపంలో వస్తున్న ఆదాయమే తప్ప మరే ఇతర మార్గాల్లోనూ ఆదాయం లేని వైనాన్ని జనం గమనిస్తున్నారు.

ఏపీలోని 66 కులాలకు 56 కార్పొరేషన్లు పెట్టి, వాటికి నిధులు ఇవ్వలేదు. దాంతో కార్పొరేషన్లు పెట్టి ప్రయోజనం ఏమిటనే సూటి ప్రశ్న ఆయా సామాజికవర్గాల నుంచి ఎదురవుతోంది. పంచాయతీలకు ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి మళ్లించుకుంటోంది. దీంతో ఆయా పంచాయతీల సర్పంచ్ లు స్థానికంగా పనులు చేసేందుకు భిక్షాటన చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈ విషయంపైనా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గ్రామ స్థాయిలో జగన్ పాలనపై విమర్శలు వస్తున్నాయి. గతంలో వైసీపీకి గ్రామ స్థాయిలోనే ఓట్లు అధికంగా వచ్చిన విషయం తెలిసిందే. ఆ ప్రజలే ఇప్పుడు జగన్ పార్టీకి ఎందుకు మళ్లీ ఛాన్సివ్వాలని చర్చించుకుంటున్నారు.

మూడు రాజధానుల ఏర్పాటు సాకుతో ఏపీకి అసలు రాజధాని కూడా లేకుండా చేసిన జగన్ సర్కార్ పై జనం బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మద్య నిషేధం పేరు చెప్పి గతంలో ఓట్లు అడిగిన జగన్ ఇప్పుడు మద్యం ధరలను పెద్ద ఎత్తున పెంచేసి సొంత బ్రాండ్లు పెట్టి జనం నుంచి లక్షల కోట్లు దోచేస్తున్న వైనాన్ని ఎక్కడికక్కడ చెప్పుకుంటున్నారు. ‘ఏపీలో ఏమున్నది గర్వకారణం ఏ రోడ్డు చూసినా గోతులు.. గతుకుల మయం’ అని ప్రజలు వైసీపీ సర్కార్ పై గుర్రుగా ఉన్నారు. ఏ విధంగా చూసినా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు ఎందుకు వేయాలనే ప్రశ్న జనం నుంచి వస్తోంది.

By
en-us Political News

  
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.