బెంగళూరే ఎందుకు.. అమరావతి ఉందిగా.. పారిశ్రామిక వేత్తలకు లోకేష్ పిలుపు!

Publish Date:Oct 24, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవవనరుల శాఖల మంత్రి నారా లోకేష్ స్పీడ్ మామూలుగా లేదు. మాట ఇస్తే కట్టుబడి ఉంటారు. అభివృద్ధి, టెక్నాలజీలపై స్పష్టమైన అవగాహన ఉంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో ఆయన తండ్రి నారా చంద్రబాబునాయుడితో పోటీగా సాగుతున్నారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో  రాష్ట్రానికి ఎన్నో ఐటీ స్టార్టప్ లు వచ్చాయి. ఉద్యోగ, ఉపాధి కల్పనలో  అవి ఎంతో కీలకంగా మారాయి. 2019లో జగన్ సర్కార్ వచ్చే వరకూ ఆంధ్రప్రదేశ్ ఇటీ ఇండస్ట్రీ పరంగా హైదరాబాద్, బెంగళరులు, చెన్నై పుణెలతో పోటీ పడింది. అయితే జగన్ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పరిస్థితి మారిపోయిందనుకోండి అది వేరే సంగతి. జగన్ హయాంలో ఐటీ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ రాష్ట్రంలో ఐటీ ఉత్పత్తులు పడిపోవడానికి చెప్పిన గుడ్డు థీయరీ అప్పట్లో ఏ స్థాయిలో ట్రోలింగ్ కు గురైందో తెలిసిందే.వాస్తవానికి జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగానూ అధోగతి పాలైంది. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ కోసం వేసిన ప్రగతి బాటలను ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీకి సైబరాబాద్ నిర్మాణం ద్వారా చంద్రబాబు బలమైన పునాది వేశారు. దాంతో  ఐటీ రంగంలో  లక్షలాదిమందికి ఉద్యోగాలు లభించాయి.  ఐ‌టి రంగంలో తెలుగు యువత అల్లుకుపోయి ప్రపంచ వ్యాప్తంగా ఆ రంగాన్ని శాసించే స్థాయికి ఎదిగింది.  

చంద్రబాబు వేసిన పునాదిపైనే హైదరాబాద్ అభివృద్ధిని  ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు విస్తరిం చాయి. ఇప్పటికీ హైదరాబాద్ అభివృద్ధి గురించిన ప్రస్తావన వస్తే ముందుగా ఎవరైనా చంద్రబాబు పేరే చెబుతారు. అంత మాత్రాన చంద్రబాబు తరువాత అధికారం చేపట్టిన పార్టీలు, ముఖ్యమంత్రులు హైదరాబాద్ ను నిర్వీర్యం చేసి అభివృద్ధి ఆనవాలును తుడిచేయడానికి ప్రయత్నించలేదు. కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్ కోసం అమరావతి రాజధానిగా  చంద్రబాబు వేసిన పునాదులను జగన్ సర్కార్ విధ్వంసం చేసింది.  కేవలం చంద్రబాబుకు గుర్తింపు వస్తుంది. పేరు వస్తుంది. ఆయన కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్న దుగ్ధతోనే ఏపీని నో డెవలప్ మెంట్ స్టేట్ గా మార్చేశారు. జగన్‌ నిర్వాకం వలన గత  5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్ని రంగాలలోనూ చివరి నుంచి మొదటి స్థానంలోనిలిచింది.

రాజధాని అమరావతిని పూర్తి చేస్తే చంద్రబాబుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుర్తింపు మరింత పెరుగుతుందని మూడు రాజధానుల నాటకానికి తెరలేపి దానిని నిర్వీర్యం చేసింది జగన్ సర్కార్. అలాగే పోలవరం ప్రాజెక్టు పురోగతిని కూడా నిలిపివేసింది.  అదే విధంగా యువతకు అపార ఉపాధి అవకాశాలను కల్పించే ఐటీ రంగాన్ని కూడా నిర్లక్ష్యం చేసింది జగన్ సర్కార్.  చంద్రబాబు 2014 నుంచి 2019 వరకూ ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. ఐటీ మంత్రిగా  నారా లోకేష్ చొరవతో అనేక కంపెనీలు రాష్ట్రానికి తరలి వచ్చాయి.  అయితే జగన్ నిర్వాకంతో  ఆయన హయాంలో ఏపీ ఐటీ రంగంలో అధమ స్థానానికి పడిపోయింది. 

 విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రంలో  ఐటీ పరిశ్రమ అభివృద్ధికి బాటలు పరిచారు. విశాఖపట్నం, మంగళగిరిలు ఐటీ హబ్ లుగా అవతరించాయి. రాష్ట్రంలో స్టార్టప్ లు వెల్లువెత్తాయి. చంద్రబాబు విజన్ కు అప్పటి ఐటీ మంత్రి లోకేష్ చోరవ తోడైంది. అయితే రాష్ట్రంలో జగన్ సర్కార్ కొలువుదీరడంతోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జగన్ అస్తవ్యవస్థ విధానాల కారణంగా రాష్ట్రానికి తరలి వచ్చినఒక్కటొక్కటిగా రాష్ట్రం నుంచి తరలిపోయాయి. జగన్ హయాంలో రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ కుదేలైంది.   

అవును  జగన్‌ నిర్వాకం వలన ఐ‌టి ఎగుమతులలో దేశంలో ఆంధ్రప్రదేశ్  అట్టడుగు స్థాయికి  పడిపోయింది.  2021-2022 ఆర్ధిక సంవత్సరంలో భారత్‌ నుంచి రూ.11.59 లక్షల కోట్ల విలువ గల ఐ‌టి ఎగుమతులు జరిగితే వాటిలో ఆంధ్రప్రదేశ్‌ వంతు కేవలం రూ.1,000 కోట్లు మాత్రమే!   బిహార్‌  ఏపీ కంటే మిన్నగా రూ.2,000 కోట్లు విలువల ఐ‌టి ఎగుమతులు చేసింది. అంటే బీహార్ కంటే దిగువన ఆంధ్రప్రదేశ్ నిలిచింది.  రాజస్థాన్, మద్యప్రదేశ్ రాష్ట్రాలు రూ.3,000 కోట్లు, వెనుకబడిన అస్సాం 24,000 కోట్లు, మేఘాలయ రూ. 35,000 కోట్లు, ఝార్ఖండ్ రూ.43,000 కోట్లు, హర్యాన రూ.52,000 కోట్లు, ఉత్తరప్రదేశ్ రూ.55,000 కోట్లుచేశాయి.  గోవా రూ.1,57,000 కోట్లు, తమిళనాడు రూ.1,58,000 కోట్లు, తెలంగాణ రూ.1,81,000 కోట్లు, మహారాష్ట్ర రూ.2,37,000 కోట్లు, అత్యధికంగా కర్ణాటక రూ.3,96,000 కోట్లు విలువల ఐ‌టి ఎగుమతులు చేశాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌కి ఎంతో మేలు చేశానని నిసిగ్గుగా చెప్పుకున్న జగన్‌ పాలనలో ఐటి ఉత్పత్తులు కేవలం రూ.1,000 కోట్లు మాత్రమే.    2021-21 ఆర్ధిక సంవత్సరంలో సాఫ్ట్ వేర్ ఉత్పత్తులలో కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తొలి ఐదు స్థానాలలో నిలిచాయి. మొత్తం ఉత్పత్తుల్లో ఈ ఐదు రాష్ట్రాల వాటా 88.57శాతం అయితే. ఇందులో ఏపీ వాటా 0.111 శాతం  మాత్రమే. ఇదీ జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమ దుస్థితి. ఇప్పుడు మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరింది. ఐటీ రంగం పుంజుకుంటోంది. పరిశ్రమలు తరలిరావడానికి సానుకూల వాతావరణం ఏర్పడింది. చంద్రబాబు విజన్, లోకేష్ చొరవతో  రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అగ్రస్థానంలో నిలిపేందుకు సానుకూల వాతావరణం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ ఐటీ పరిశ్రమలను ఏపీకి అహ్వానిస్తూ బెంగళూరు ఎందుకు అమరావతి ఉండగా అంటూ ఇచ్చిన పిలుపు తెగ వైరల్ అవుతోంది. 

ఇంతకీ ఆయన ఏ సందర్భంలో ఆ పిలుపు ఇచ్చారంటే.. బెంగళూరులో సిద్దరామయ్య సర్కార్ ఇబ్బందులకు గురి చేస్తోందంటూ పలు కంపెనీలు ఆ నగరం నుంచి తరలిపోవాలన్న యోచనలో ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త దాస్ పాయ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. వెంటనే స్పందించిన నారా లోకేష్ ఆయననే కాదు ఐటీ ప్రముఖులందరికీ ఆహ్వానం పలికారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ పరిశ్రమల స్థాపనకు రాష్ట్రంలో ఫ్రెండ్లీ వాతావరణాన్ని కల్పిస్తుందని చెప్పారు. పెట్టుబడులతో వస్తే అన్ని మౌలిక సదుపాయాలూ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆయన పిలుపు వెంటనే వైరల్  అయ్యింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సైతం లోకేష్ పిలుపునకు సానుకూలంగా స్పందించారు. దేశానికి మరో బెంగళూరు అవసరం ఉందని పరోక్షంగా అమరావతిని పేర్కొంటూ ప్రకటన కూడా చేశారు. బెంగళూరు అవసరం ఉందని ప్రకటించారు.  పలు కంపెనీలు బెంగళూరు తరువాత తమ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్ అని బాహాటంగానే చెబుతున్నాయి. కొత్త కంపెనీలు, స్టార్టప్ లు అయితే అమరావతే తమ ఫస్ట్ డెస్టినేషన్ అంటున్నాయి. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో ఐటీ పరిశ్రమ బెంగళూరు, హైదరాబాద్ కు దీటుగా ఎదుగుతుందని పారిశ్రామిక వేత్తలు సైతం అంచనా వేస్తున్నారు. 

By
en-us Political News

  
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.