Publish Date:Aug 14, 2025
రాయలసీమ జిల్లాలు.. ముఖ్యంగా కడప జిల్లాకు ఒక ప్రాముఖ్యత ఉంది. వైఎస్ కుటుంబానికి కడప జిల్లా కంచుకోట. అక్కడ నుంచి అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో పోటీ చేసిన వాళ్లు లక్షలు, వేల ఆధిక్యంతో గెలవడాన్ని సాధారణ విజయంగా భావిస్తారు. ఇక అటువంటి కడప జిల్లాలో పులివెందుల కు ఒక మరింత ప్రత్యేకత ఉంది. అది వైఎస్ సొంత ఖిల్లా. వైఎస్ తదననంతరం ఆయన కుమారుడు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి పెట్టని కోటగా మారింది. ప్రస్తుతం ఆయనే పులివెందుల ఎమ్మెల్యే. అటువంటి పులివెందులలో ఒక చిన్న ఉప ఎన్నికలో జగన్ పార్టీ వైసీపీ డిపాజిట్ కోల్పోయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ ప్రభావం పులివెందులపైనా, కడప జిల్లాపైనే కాదు మొత్తం రాష్ట్రంపై పడుతుంది. జగన్ కు కంచుకోట లాంటి స్థానంలో తెలుగుదేశం వేయడం, అదీ వైసీపీ అభ్యర్థిని డిపాజిట్ కూడా గల్లంతయ్యేలా ఓడించి జెండా ఎగరేయడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎణ్నికలలో చంద్రబాబు అత్యంత పకడ్బందీగా చేసిన వ్యూహరచన సత్ఫలితాలను అందించింది. ఈ రెండు జడ్పీటీసీ స్థానాలలోనూ వైసీపీ పరాజయం, తెలుగుదేశం విజయం రాష్ట్ర రాజకీయాలలో ఒక బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. ఈ విజయాలు వైసీపీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయనడంలో సందేహం లేదు. అదే సమయంలో తెలుగుదేశం శ్రేణుల్లో నూతనోత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపచేస్తాయి.
ముందుగా పులివెందుల విషయమే తీసుకుంటే చంద్రబాబు వ్యూహాత్మకంగా ఇక్కడ ఎన్నికల బాధ్యతను మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి అప్పగించారు. ఆదినారాయణ రెడ్డి వరుసగా మూడు సార్లు జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పులివెందుల జెడ్సీటీసీ ఉపఎన్నికలో తెలుగుదేశం అభ్యర్ధి ఎంపిక నుంచి ప్రతి విషయంలోనూ ఆదినారాయణరెడ్డి తెలుగుదేశం పులివెందుల నియోజకవర్గ ఇన్ చార్జ్ బీటెక్ రవి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవిత పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇతర నేతలతో సమన్వయం చేసుకుంటూ ప్రచారం నుంచి పోల్ మేనేజ్ మెంట్ వరకూ అన్నిటినీ పద్ధతి ప్రకారం, ప్రణాళికాబద్ధంగా నిర్వహించారు. అలాగే ఆదినారాయణరెడ్డికి తెలుగుదేశం నేతలూ, శ్రేణులూ పూర్తిగా సహకారం అందించారు. ఫలితమే అద్భుతమనదగ్గ విజయం.
జగన్ కంచుకోటలో ఆయన పార్టీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కని ఘోర పరాజయం. ఇక ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలోనూ పకడ్బందీ ప్రణాళిక రచించి ప్రచారం నుంచి పోల్ మేనేజ్ మెంట్ వరకూ తనకు అప్పగించిన బాధ్యతను మంత్రి మంత్రి మందపల్లి రాం ప్రసాద్ తు.చ. తప్పకుండా నిర్వహించారు. పార్టీ నాయకులూ, శ్రేణులూ ఆయనకు పూర్తిగా సహకారం అందించారు. దీంతో రెండు స్థానాలోనూ తెలుగుదేశం జయకేతనం ఎగురవేసి వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/why-not-pulivendula-becam-reality-25-204257.html
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.