ఆదినారాయణరెడ్డి సహకారం.. వైనాట్ పులివెందుల సాకారం

Publish Date:Aug 14, 2025

Advertisement

రాయలసీమ జిల్లాలు.. ముఖ్యంగా కడప జిల్లాకు ఒక ప్రాముఖ్యత ఉంది. వైఎస్ కుటుంబానికి కడప జిల్లా కంచుకోట.  అక్కడ నుంచి అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో పోటీ చేసిన వాళ్లు లక్షలు, వేల ఆధిక్యంతో గెలవడాన్ని సాధారణ విజయంగా భావిస్తారు. ఇక అటువంటి కడప జిల్లాలో  పులివెందుల కు ఒక మరింత ప్రత్యేకత ఉంది. అది వైఎస్ సొంత ఖిల్లా. వైఎస్ తదననంతరం ఆయన కుమారుడు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి పెట్టని కోటగా మారింది. ప్రస్తుతం ఆయనే పులివెందుల ఎమ్మెల్యే. అటువంటి పులివెందులలో ఒక చిన్న ఉప ఎన్నికలో జగన్ పార్టీ వైసీపీ డిపాజిట్ కోల్పోయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ ప్రభావం పులివెందులపైనా, కడప జిల్లాపైనే కాదు మొత్తం రాష్ట్రంపై పడుతుంది.  జగన్ కు కంచుకోట లాంటి స్థానంలో తెలుగుదేశం  వేయడం, అదీ వైసీపీ అభ్యర్థిని డిపాజిట్ కూడా గల్లంతయ్యేలా ఓడించి జెండా ఎగరేయడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.  పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎణ్నికలలో చంద్రబాబు అత్యంత పకడ్బందీగా చేసిన వ్యూహరచన సత్ఫలితాలను అందించింది.  ఈ రెండు జడ్పీటీసీ స్థానాలలోనూ వైసీపీ పరాజయం, తెలుగుదేశం విజయం రాష్ట్ర రాజకీయాలలో ఒక బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. ఈ విజయాలు వైసీపీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయనడంలో సందేహం లేదు. అదే సమయంలో తెలుగుదేశం శ్రేణుల్లో నూతనోత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపచేస్తాయి.  

ముందుగా పులివెందుల విషయమే తీసుకుంటే చంద్రబాబు వ్యూహాత్మకంగా ఇక్కడ ఎన్నికల బాధ్యతను మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి అప్పగించారు. ఆదినారాయణ రెడ్డి వరుసగా మూడు సార్లు జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పులివెందుల జెడ్సీటీసీ ఉపఎన్నికలో తెలుగుదేశం అభ్యర్ధి ఎంపిక నుంచి ప్రతి విషయంలోనూ ఆదినారాయణరెడ్డి తెలుగుదేశం పులివెందుల నియోజకవర్గ ఇన్ చార్జ్  బీటెక్ రవి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవిత  పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇతర నేతలతో సమన్వయం చేసుకుంటూ ప్రచారం నుంచి పోల్ మేనేజ్ మెంట్ వరకూ అన్నిటినీ పద్ధతి ప్రకారం, ప్రణాళికాబద్ధంగా నిర్వహించారు. అలాగే ఆదినారాయణరెడ్డికి తెలుగుదేశం నేతలూ, శ్రేణులూ పూర్తిగా సహకారం అందించారు. ఫలితమే అద్భుతమనదగ్గ విజయం.

జగన్ కంచుకోటలో ఆయన పార్టీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కని ఘోర పరాజయం. ఇక ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలోనూ పకడ్బందీ ప్రణాళిక రచించి ప్రచారం నుంచి పోల్ మేనేజ్ మెంట్ వరకూ తనకు అప్పగించిన బాధ్యతను మంత్రి మంత్రి మందపల్లి రాం ప్రసాద్ తు.చ. తప్పకుండా నిర్వహించారు. పార్టీ నాయకులూ, శ్రేణులూ ఆయనకు పూర్తిగా సహకారం అందించారు. దీంతో రెండు స్థానాలోనూ తెలుగుదేశం జయకేతనం ఎగురవేసి వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. 

By
en-us Political News

  
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.