వైనాట్ పరార్? వైసీపీ కొత్త నినాదం

Publish Date:May 24, 2024

Advertisement

వైసీపీ ఇప్పుడు కొత్త నినాదం అందుకున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీకి బాగా అలవాటైన వైనాట్ తోనే ఈ నినాదం కూడా మొదలౌతోంది. ఔను జగన్ ఎప్పుడో ఆరు నెలల కిందటే వైనాట్ 175 అంటూ ఓ నినాదం ఇచ్చి.. పార్టీ శ్రేణుల్లో వైసీపీ మరో సారి అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని ప్రోది చేయాలని భావించారు. అప్పట్లోనే ఆ నినాదం నవ్వుల పాలైంది. గడప గడపకూ మన ప్రభుత్వం అంటూ ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజల వద్దకు పంపిన జగన్ కు వైనాట్ 175 నినాదం ఎంత హాస్యాస్పదంగా ఉందో అప్పుడే తెలిసిపోయింది.

గడపగడపకూ నిరసన సెగలను ఎదుర్కొన్న పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు.. ఆ తరువాత గడపగడపకు కార్యక్రమాన్ని ఎలాగోలా మమ అనిపించేశారు. ఆ తరువాత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంపై జగన్ దృష్టి పడింది. దీంతో ఆయన మరో నినాదం ఇచ్చారు. అదే వైనాట్ కుప్పం. కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థిగా భరత్ ను ప్రకటించి.. ఆయనను గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ నియోజకవర్గ ప్రజలకు పెద్ద తాయిలం ఇస్తున్నట్లుగా మాట్లాడారు. అయితే వారు మాత్రం భరత్ ను గెలిపిస్తే మంత్రి మాత్రమే ఔతారు.. అదే చంద్రబాబు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు కదా? అని ఎగతాళి చేశారు. సరే వైనాట్ కుప్పం నినాదం కూడా విఫలమయ్యాకా.. ఇక జగన్ తో పని లేకుండా ఆయన పార్టీ ఎమ్మెల్యేలే కొత్త నినాదాన్ని అందుకున్నారు.

అదే వైనాట్ పరారీ. అని. ఆ నినాదాన్ని మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి కూడా అయిన పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఆచరించి చూపారు. అది ఆయనకు సత్ఫలితాన్నే ఇచ్చింది. అరెస్టును తప్పించుకోగలిగారు. ముందస్తు బెయిలూ పొందగలిగారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంతి ఆ నినాదాన్నే ఇప్పుడు నమ్ముకున్నారు. ఒక వేళ ఏదైనా తేడా కొడితే వైనాట్ పరార్ అనడానికి సిద్ధంగా ఉన్నారు. 

రాష్ట్రంలో ఎన్నికలు అయిన తరువాత వైసీపీ నేతలకు వాస్తవం బోధపడింది. గెలుపు ఆశలు ఇసుమంతైనా లేవన్నవిషయం ధృవపడింది. దీంతో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, వైసీపీ అధికారంలో ఉండగా ఇష్టారీతిగా రెచ్చిపోయి అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడిన నేతలు పరార్ మంత్రాన్ని పఠించడానికి రెడీ అయిపోతున్నారని వైసీపీ వర్గాల్లోనే పెద్దగా వినిపిస్తోంది. తెలుగుదేశం నాయకులు అజ్ణాతంలోకి వెడుతున్న సంఘటనలు కానీ, వార్తలు కానీ వినిపించడం లేదు కానీ,  వైసీపీ ఎమ్మెల్యే , ఎంపీ అభ్యర్థులు దేశ విడిచిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారనీ, ప్రణాళికలు రచించుకుంటున్నారనీ సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. కౌంటింగ్ కు ముందే బిచాణా ఎత్తివేయడం మేలని భావిస్తున్నారని అంటున్నారు.  

పిన్నెల్లి పోలీసులను తప్పించుకునేందుకు ఇల్లూ వాకిలీ వదిలేసి పారారైపోవడం వైసీపీ నేతలకు దారి చూపినట్లైంది. సరే పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిలు పొందారనుకోండి అది వేరే విషయం. ఆ ముందస్తు బెయిలు కూడా జూన్ 5 వరకూ మాత్రమే లభించింది.  అది పక్కన పెడితే పిన్నెల్లి అండ చూసుకుని ఎన్నికల రోజు, ఆ తరువాత హింసాకాండతో చెలరేగిపోయి, రాడ్లు, కర్రలు పట్టుకుని స్వైర విహారం చేసిన ఆయన అనుచరులంతా ఇప్పుడు భయంతో వణికి పోతున్నారు.  

ఇక గన్నవరంలో వైసీపీ కార్యకర్తలు, నేతలు ఎంత మంది పరారీలో ఉన్నారో లెక్కేలేదు. ఆ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయారు. ఆయన బీజేపీ గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్న వార్తలు వినవస్తున్నా.. జనం వాటిని పెద్దగా విశ్వసించడం లేదు. ఈబీ5 విసా సంపాదించి శాశ్వతంగా విదేశంలో సెటిల్ అయిపోయే అవకాశాలే ఎక్కవ ఉన్నాయని నమ్ముతున్నారు.  అలాగే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బ్యాంకాక్ కు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. పిన్నెల్లి అరెస్టుపై అనిల్ కుమార్ యాదవ్ బ్యాంకాక్ నుంచి ఒక వీడియో విడుదల చేశారు.  

పోలింగ్ తరువాత పుంగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  చెన్నై పోర్టు ద్వారా తన కంపెనీకి సంబంధించిన పరికరాలు, యంత్రాలను ఆఫ్రికా పంపించేశారు. కౌంటింగ్ కు ముందే ఆయన కూడా ఆఫ్రికాకు పలాయనం చిత్తగించే అవకాశాలున్నాయన్న చర్చ పుంగనూరుగా జోరుగా సాగుతోంది.  

ఇక చెవిరెడ్డి భాస్కరరెడ్డి విసయానికి వస్తే ఆయన తన కుమారుడు మోహిత్ రెడ్డిని దేశం దాటించడం ఎలా అన్న విషయంపై తీవ్రంగా ఆలోచిస్తున్నారని ఆయన అనుయాయులే చెబుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ రోజు హింస నేపథ్యంలో మోహిత్ రెడ్డి మెడపై అరెస్టు కత్తి వేళాడుతోందని అంటున్నారు.   

By
en-us Political News

  
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.