Publish Date:Oct 29, 2022
ఎవరు ఔనన్నా కాదన్నా రాహుల్ భారత్ జోడో యాత్రకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సహా ఇప్పటి దాకా రాహుల్ పాదయాత్ర సాగిన అన్ని రాష్ట్రాలలోనూ మంచి స్పందన లభించింది. మీడియా కూడా రాహుల్ పాదయాత్రకు మంచి కవరేజే ఇచ్చింది. కానీ ఆయన పాదయాత్ర తెలంగాణలో అడుగు పెట్టే సరికి సీన్ మారిపోయింది.
రాహుల్ పదయాత్రకు జనస్పందన ఎలా ఉంది అన్న విషయం కూడా తెలియనంతగా మీడియా ఆయన యాత్రను డౌన్ ప్లే చేస్తోంది. అయితే ఇది ఉద్దేశ పూర్వకంగా కాదని పరిశీలకులు అంటున్నారు. ఆయన పాదయాత్ర తెలంగాణలో అడుగు పెట్టిన సందర్భంగా జనస్పందన, యాత్ర వివరాలకు మీడియా , సామాజిక మీడియాలో మంచి కవరేజ్ వచ్చింది. దీపావళి సందర్భంగా విరామం ఇచ్చి తరువాత తెలంగాణలో ఆయన పాదయాత్ర మొదలైనప్పటి నుంచీ అది ఎవరికీ పట్టని వ్యవహారంగా మారిపోయింది.
మొత్తం మీడియా, సోషల్ మీడియా అంతా ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల ఎపిసోడ్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ హడావుడిలో మునుగోడు ప్రచార సంరంభం కూడా మసకబారిపోయింది. అది పక్కన పెడితే రాజకీయ వర్గాలలో మాత్రం రాహుల్ పాదయాత్ర ప్రాముఖ్యతను తగ్గించడానికే ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల డ్రామాకు తెరలేచిందా అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. కాంగ్రెస్ ముక్త భారత్ అన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి బీజేపీకి ఇప్పుడు ప్రధానంగా అడ్డుపడుతున్నది రాహుల్ భారత్ జోడో యాత్రే. ఆయన యాత్రకు వస్తున్న ఆదరణ బీజేపీ టాప్ బ్రాస్ లో బెదురు పుట్టించిందనడంలో సందేహం లేదు.
అందుకే మోడీయే స్వయంగా కాంగ్రెస్ కదులుతోంది జాగ్రత్త అంటూ బీజేపీ క్యాడర్ ను అప్రమత్తం చేశారు. కాంగ్రెస్ పని అయిపోయిందని అనుకోవద్దనీ, ఆ పార్టీ కొత్త పంథాలో, కొత్త వ్యూహాలతో చురుగ్గా పుంజుకుంటోందనీ హెచ్చరించారు. ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. భారత్ జోడో యాత్రకు వస్తున్న స్పందన చూసి ఆయన అలా అన్నారనే అనుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో రాహుల్ పాదయాత్ర ప్రవేశించిన తరువాత అప్పటి వరకూ ఆ యాత్రకు వచ్చిన కవరేజ్ హఠాత్తుగా ఆగిపోయింది. అందుకు కారణంగా బయటకు కనబడుతున్నది ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల ఉదంతం.
ఈ విషయంలోనే రాజకీయ వర్గాలలో విస్తృత చర్చ జరుగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ లు కూడబలుక్కునే ఈ వ్యవహారానికి తెరలేపారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ విషయంలో బీజేపీ, తెరాసలు కూడబలుక్కున్నాయా? అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. తమ సందేహాలకు కారణంగా వారు బీజేపీ లక్ష్యం కాంగ్రెస్ ముక్త భారత్ అయితే.. కేసీఆర్ అవసరం లిక్కర్ స్కామ్ నుంచి తన బిడ్డను కాపాడుకోవడం అని అంటున్నారు. అందుకే ఉభయతారకంగా మునుగోడు ఉప పోరులో పోటీ విషయాన్ని విస్మరించి.. కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు, రాహుల్ పాదయాత్ర ప్రభావం లేకుండా చూసేందుకు కొనుగోలు బేరసారాల వ్యవహారాన్ని తెరమీదకు తీసుకువచ్చారని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/why-no-coverage-to-rahul-jodo-yatra-in-telangana-is-trs-bjp-conspirancy-25-146244.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.