అమరావతి రీలాంచ్ సరే.. జగన్ నిర్వాకంపై మోడీ మౌనమేల?

Publish Date:May 3, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజథాని అమరావతి నిర్మాణానికి 2015లో శంకుస్థాపన జరిగింది. అప్పట్లో ఈ కార్యక్రమానికి ప్రధాని హోదాలో మోడీ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని నభూతో అన్నట్లుగా నిర్వహించారు. సరే మళ్లీ ఇప్పుడు అంటే మే 3న అదే అమరావతికి ప్రధాని మోడీ మరో సారి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని అమరావతి నిర్మాణ పనుల పున: ప్రరంభ కార్యక్రమం అని చెబుతున్నారు. అప్పుడూ.. ఇప్పుడూ కూడా కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వమే ఉంది. ప్రధానిగా నరేంద్రమోడీ, ఏపీ సీఎంగా చంద్రబాబు రెండు సార్లూ కూడా అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామనే అన్నారు. అయితే ఈ మధ్యలో ఐదేళ్లలో ఏం జరిగింది? 2015లో అట్టహాసంగా ప్రారంభమైన అమరావతి నిర్మాణ కార్యక్రమం 2019 నుంచి 2024 వరకూ ఎందుకు నిలిచిపోయింది. నిర్వీర్యమైపోయింది అన్నది అందరికీ తెలిసిన చరిత్రే. 

అయితే అప్పటికీ ఇప్పటికీ ఒక తేడా ఉంది. నాడు మోడీ కేవలం అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసి మట్టీ, నీళ్లు ఇచ్చి వెళ్లిపోయారు. అమరావతి నిర్మాణం, పురుభివృద్ధి ఒక బాధ్యతగా భావించలేదు. అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక కార్యక్రమంగానే భావించారు. ఎందుకంటే అప్పుడు కేంద్రంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వమే అయినా, భాగస్వామ్య పక్షాల మద్దతు ఇసుమంతైనా అవసరం లేనంత బలం ఒంటరికగా బీజేపీకే ఉంది. అందుకే అప్పట్లో మోడీ మిత్రపక్షాల ఆకాంక్షలను, డిమాండ్లను పట్టించుకోలేదు. 

అయితే ఇప్పుడు 2025లో మోడీకి ఆ పరిస్థితి లేదు. కేంద్రంలో తన ప్రభుత్వం మనుగడ సాగించాలంటే చంద్రబాబు మద్దతు అవసరం. అందుకే ఇప్పుడు  మోడీ మరో సారి అమరావతి నిర్మాణ పనులను రీ లాంచ్ చేశారు. అవును మళ్లీ అమరావతి నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టారు. అయితే ఈ సారి గతంలోలా దీనిని ఒక లాంఛనంగా కాకుండా ఒక బాధ్యతగా  తీసుకున్నారు. అమరావతి అభివృద్ధిలో కేంద్రం బాధ్యతగానే కాకుండా భాగస్వామిగా కూడా ఉంటుందని చెప్పడానికే 57 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలూ చేశారు. అంతే కాదు అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి గ్రాంట్లు అందేలా చూడటమే కాకుండా హుడ్కో నుంచి కేటాయింపులు కూడా వచ్చేలా సంపూర్ణ సహకారం అందించింది. దీంతో గతానికి భిన్నంగా ఈ సారి మోడీ చిత్తశుద్ధి కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. అందుకు ఆయన రాజకీయ అవసరం కూడా కారణం అనుకోండి అది వేరే సంగతి. 

ఇంత వరకూ బాగే ఉంది.. 2015లో తానే స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతి నిర్మాణం అర్ధంతరంగా ఐదేళ్ల పాటు నిలిచిపోవడానికీ, నిర్వీర్యమైపోవడానికీ కారణమైన జగన్ నిర్వాకం గురించి మోడీ శుక్రవారం (మే 2)న జరిగిన అమరావతి పనుల పున:ప్రారంభోత్సవ సభలో ఒక్కటంటే ఒక్క మాట అనలేదు. ఐదేళ్ల జగన్ అరాచక పాలన కారణంగా ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా వెనుకబడిపోవడం తెలిసిందే. అయితే ఇంతటి అరాచక పాలన సాగించి, కేవలం రాష్ట్ర రాజధాని మాత్రమే కాదు.. ఒక శక్తి అని చెప్పిన ప్రధాని మోడీ.. ఆ శక్తిని నిర్వీర్యం చేయడానికి గత ఐదేళ్లలో విశ్వ ప్రయత్నం చేసిన జగన్ పాలనపై చిన్న పాటి విమర్శ కూడా చేయకపోవడం విమర్శలకు తావిస్తున్నది. 

మూడు రాజధానుల పేరుతో అమరావతి విధ్వంసానికి పూనుకున్న మాజీ ముఖ్యమంత్రి   జగన్  పాలనను కానీ, జగన్ సర్కార్ ప్రభుత్వ విధానాలపై కానీ చిన్నపాటి విమర్శ కూడా మోడీ చేయలేదు.  గత పదేళ్లుగా అమరావతి నిర్మాణాలకు అవసరమైన అన్ని సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది అని చెప్పుకున్న మోడీ.. మరి గత ఐదేళ్లుగా అమరావతిలో కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చని జగన్ పాలన గురించి అసలు ప్రస్తావించనేలేదు.   ఇక్కడే ఇప్పటికీ మోడీ జగన్ ను షీల్డ్ చేస్తున్నారా? అన్న అనుమాలు వ్యక్తమౌతున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
ఆ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాన్ని మంగళగిరికి దీటుగా అభివృద్ధి చేస్తానన్నారు.
పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నంబర్ 1, 2, 3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ హైరాక్కీని దాటి త్వ‌ర‌లో లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.
లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం 400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి చేయ‌లేదు. ఎవ‌రి క‌ష్టం వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు.
అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.
ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది.
బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది.
ల్లమల సాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా జలవనరులశాఖ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.