తెలంగాణ సీఎంకు ఏపీ పై ఎందుకంత ప్రేమ ?

Publish Date:Jan 13, 2023

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనగానే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన అలుపెరగని పోరాటం గుర్తుకొస్తుంది. ఆయన లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదు, అసలు తెలంగాణ లేదు. తెలంగాణ అస్తిత్వ వాదాన్ని ఆయుధంగా చేసుకుని, చావు నోట్లో తల పెట్టి, పోరాడి తెలంగాణ సాధించారు కేసీఆర్. పుష్కర కాలంపైగా సాగిన తెలంగాణ మలిదశ ఆందోళనకు కర్త, కర్మ, క్రియా అన్నీ ఆయనే.(అవును ఆయనే లేకుంటే 1200 మంది యువకుల బలిదానాలు ఉండేవి కాదు, ఆ 1200 బలిదానాలు లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు, తెలంగాణ రాకుంటే లిక్కర్ స్కాములు, వందల వేల కోట్లకు పడగలెత్తిన కుటుంబాలు ఉండేవి కాదని, కొందరు చేస్తున్న వాదనలో నిజం ఉంటే ఉండొచ్చు కానీ అది వేరే విషయం) 

అయితే ఇప్పుడు అదే కేసేఆర్, తెలంగాణ పేరు చెప్పుకుని  జాతీయ స్థాయిలో రాజకీయం చేసేందుకు  బాటలు వేసుకుంటున్నారు. ఆ క్రమంలో అప్పట్లో ఆంధ్ర ప్రాంత ప్రజలను ఆంధ్ర ప్రాంత పాలకులను అనేక విధాల దూషించిన ఆయన ఈరోజు తెలంగాణ కంటే ఏపీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. చివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంలోనూ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ కుల సమీకరణలు పనిచేశాయని అంటున్నారు. నిజానికి, మూడు రోజుల క్రితం  శాంతికుమారిని  సీఎస్‌గా నియమించిన వెంటనే ఏపీ బీఆర్‌ఎస్‌ నేతలు ప్రగతిభవన్ కు వెళ్లి అభినందించారు.  కేసీఆర్‌తో పాటు కొత్త సీఎస్‌, ఏపీ బీఆర్‌ఎస్‌ నేతలు ఉన్న ఫొటోలను సీఎంవోనే రిలీజ్‌ చేసింది. అప్పటి వరకు తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కొత్త సీఎస్‌ను కలువనే లేదు. కానీ ఏపీ నేతలు మాత్రం ఫోటోలు దిగారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

అంతే కాదు  ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలకే  డైరెక్ట్ ఎంట్రీ లేని ప్రగతి భవన్ లోకి బీఆర్ఎస్ ఆంధ్రా నేతలకు మాత్రం ఎప్పుడంటే అప్పడు వచ్చి పోయే విధంగా బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చారని అంటున్నారు. ఆంధ్రా నాయకులకు ఎప్పుడు అనుకుంటే అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ దొరుకుతుందని అంటున్నారు. నిజానికి  ప్రగతి భవన్ గేట్లు తెరుచుకునేందుకు, ‘ఏపీ బీఆర్ఎస్’ పాస్ వర్డ్ గా  మారిందని అంటున్నారు.  

నిజానికి  జాతీయ ఆలోచనలు మొగ్గతొడిగిన నాటి నుంచి కేసీఆర్  కు ప్రాధాన్యతలు మారి పోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడచిన ఎనిమిదేళ్ళలో  ఇంచుమించుగా మూడు వేలకు మందికి పైగా తెలంగాణ రైతులు  అందులో అధిక శాతం కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆయినా అందులో సగం కుటుంబాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం  ఉదారంగా కాదు చట్టపరంగా ఇవ్వవలసిన నష్ట పరిహారం కూడా ఇవ్వలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.  అయినా, ముఖ్యమంత్రి కేసేఅర్ పంజాబ్, బీహార్, జార్ఖండ్  రాష్ట్రాలలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఉదారంగా ఆర్థిక సహాయం అందించి వచ్చారు.  అంత కంటే మరింత ఉదారంగా భాషా భేదం,  ప్రాంతీయ భేదం లేకుండా దేశంలోని జాతీయ, ప్రాంతీయ పత్రికలు అన్నింటిలో  పెద్ద ఎత్తున ప్రకటనలు (అడ్వర్ టైజ్ మెంట్లు) ఇచ్చి ప్రచారం చేసుకున్నారు.  అలాగే  దేశంలో రైతు నాయకులుగా చలామణి అవుతున్న కొందరు రైతు నాయకులను చర్చల పేరిట హైదరాబాద్ కు పిలిచి సన్మానాలు చేసి పంపించారు. కానీ, ఆ చర్చలలో రాష్ట్రానికి చెందిన రైతు నాయకులకు మాత్రం స్థానం కల్పించలేదు.

అందుకే ముఖ్యమంత్రి కొత్త అడుగుల విషయంలో పలు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ముఖ్యంగా ఏపీ విషయంలో ముఖ్యమంత్రి చూపుతున్న ప్రత్యేక ప్రేమ విషయంలో రకరకాల అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. అలాగే, ముఖ్యమంత్రి అడుగుల వెనక దీర్ఘకాలిక వ్యూహం  ఉందని  అంటున్నారు.

By
en-us Political News

  
ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు.
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.