చేతిరాత జారనివ్వొద్దు

Publish Date:Aug 10, 2018

Advertisement

 

 

 

నేను రాస్తే ముత్యాలు పేర్చినట్టు ఉండేది. ఇప్పుడు కోడి కెలికినట్టుంటోంది. పేజీలకు పేజీలు రాసేవాణ్ణి చెక్ బుక్ మీద సంతకం కూడా సరిగా రావడం లేదు. ' అమ్మో.. నాలుగు పేజీలా ఎప్పుడో కాలేజి డేస్ లో అంటే ఓకే ఇప్పుడు ఇంపాజిబుల్' ఇదీ ఇప్పుడు హ్యాండ్రైటింగ్ పరిస్థితి. అక్షరం.. అష్ట వంకర్లు పోతుంది. రాత.. గీత తప్పుతోంది చేతిరతకు చేటుకాలం.. ఇంకా చెప్పాలంటే ' పోయేకాలం ' దాపురించింది. 

 

పాకే వయసు లో మొదలుపెడితే బలం నుంచి పెన్సిళ్ళు, పెన్నులు, కాగితాలు, పుస్తకాలు.. ఇలా అక్షారాలు ఆసీనులయ్యే ఆసనాలు, ఆవిష్కరించే సాధనాలు మారేకొద్దీ మన చేతిరాత మరింత మెరుగులు దిద్దుకుంటూ వచ్చింది. చేతివేళ్ళ నుంచి ఊపిరి  పోసుకున్న గీత తలరాతను సైతం దిద్దగలిగింది. అంత గొప్పదైన, అక్షరాభ్యాసం నాటి  నుంచి తోడైన అపురూప బందం మసకబారిపోయింది. ' మనదైన ' చేతిరాత మనల్ని వీడిపోతుంది.... ఎందుకలా....


పోగొట్టుకోవడం 'ఈ ' జీ:-

కంప్యూటర్లు, మొబైల్స్,ల్యాప్టాప్స్, టాబ్లెట్స్ ఇవన్నీ మన చేతిరాతకు కోరుతున్నాయి. ఇపుడంతా 'ఈ' జీ ఈ జీ టెక్నాలజి. టెక్నాలజీ పుణ్యమాని చేతిరాతకి పోయేకాలం వచ్చింది నిజానికి ఒకప్పటికన్నా ఇప్పుడే మనం ఎక్కువగా రాస్తున్నాం. అయితే కీబోర్డుతో పచారి సామాన్ల జాబితా నుంచి సమావేశంలో పాఠ్యంశాల దాకా పుట్టిన రోజు శుభాకాంక్షల నుంచి పోయిన రోజు సంతాపసందేశాల దాకా అన్నీ టెక్స్ట్ మెసేజ్ లో, మెయిళ్ళో.. మరొకటో దీంతో రాయాల్సిన అవసరం రోజురోజుకూ తగ్గిపోతుంది.


సర్వేలేమంటున్నాయ్:-

ఆధునికులలో సగటున ఓ వ్యక్తీ 41 రోజులకు గాని నాల్గులైన్లు రాయాల్సిన అవసరం రావడం  లేదని, అలాగే ప్రతి ముగ్గురిలో ఒకరికి 6  నెలల పాటు కలం పట్టే ఖర్మ పట్టడం లేదట. ఇక ప్రతి ఏడుగురులో ఒకరు తమ హ్యండ్రైటింగ్ మారిన తీరు తమకే అవమానకరంగా మారిందని వాపోతున్నారట. బ్రిటిష్ కంపెనీ డాక్మెయిల్ సర్వే తేల్చిన విషయమిది. గత కొంతకాలంగా తమ చేతిరాత పాడైపోయిందని ఈ సర్వేలో పాల్గొన్న సగం మంది చెప్పారు. "చేతిరాత అవసరం తగ్గుతున్నప్పటికి,టెక్నాలజీలతో సంబంధం లేకుండా కూడా కమ్యునికేట్ చేయగల సామర్ధ్యాలను ప్రజలు నిలబెట్టుకోవల్సిందే" అని డాక్మెయిల్ కంపెనీ డైరెక్టర్  బ్రాడ్వే ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం.

 

ఇలా చేయండి:-

* నిద్ర ముందు ప్రతి రోజు కాసేపైన డైరీ రాయడం అలవాటుగా మార్చుకోండి.

* ఆలోచనలకు ఎప్పటికప్పుడు అక్షరరూపం ఇవ్వడానికి ప్రయత్నించండి.

* చిన్న చిన్న కథలు, ఉత్తరాలు స్వయంగా రాయండి.

* మీ లక్ష్యాలను, కలలను తరచుగా పేపర్ మీద పెడుతుండండి.

* మీకు బాగా ఇష్టులైన వారికీ చేతి రాతతో శుభాకాంక్షలు పంపడం అలవాటు చేసుకోండి.

 

By
en-us Political News

  
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే..
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం...
వేసవి అంటేనే కూలర్లు,  ఏసీలు గుర్తుకు వస్తాయి.  మధ్య తరగతి కుటుంబాలు కూడా వేసవి వేడి భరించలేక  ఏసీ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఏసీ పెట్టించుకోవడం ఒక ఎత్తైతే.. ఏసీ వినియోగం తర్వాత...
మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం...
ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని  కోరుకుంటారు.  సంతోషంగా ఉండటం కోసం చేయాల్సినంత కష్టం చేస్తూనే ఉంటారు.  డబ్బు సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, నచ్చిన చోటికి వెళతారు..
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి. దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు, కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.