బీజేపీ దృష్టి తెలంగాణ మీదనే ఎందుకు?

Publish Date:Aug 13, 2022

Advertisement

దక్షిణ భారతదేశం బీజేపీకి అంతు చిక్కని ప్రాంతం. క‌ర్ణాట‌క‌ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో  ఇంత వరకూ ఆ పార్టీకి   గెలుపు అందని ద్రాక్షగానే మిగిలింది. అయితే బీజేపీ మాత్రం అందని ద్రాక్ష పుల్లన అని వదిలేయకుండా.. దక్షిణాది రాష్ట్రాలలో పాగాకు విశ్వ యత్నం చేస్తోంది.  బీజేపీ మిషన్‌ సౌత్‌కు తెలంగాణ ఇప్పుడు సారవంతమైన ప్రాంతంగా భావిస్తోంది.

తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు బీజేపీకి చాలా వరకు అనుకూలంగా ఉన్నాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచీ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది.  రెండు దఫాలుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత ప్రబలుతోందనడానికి  నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన కేసీఆర్ కుమార్తె   కవిత ఓడిపోవడంతో ప్రస్ఫుటమైందని బీజేపీ గట్టిగా నమ్ముతోంది.

దీంతో 2019 ఎన్నికలు పూర్తయిన క్షణం నుంచీ బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నికలలో విజయం కోసం ప్రణాళికా బద్ధంగా పని చేస్తోందని ఆ పార్టీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు.   లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో  17 స్థానాలకు గానూ బీజేపీ  కేవలం నాలుగింటిని గెలుచుకున్నప్పటికీ,   ఓట్ల శాతం 19 శాతానికి పైగా ఉంది.

ప్రతిపక్షంగా బలమైన ప్రాంతీయ పార్టీ లేకపోవడంతో, బిజెపి ఆ గ్యాప్ పూర్తి చేయడానికి ప్రయత్నాలు ఉధృతం చేసింది. అలాగే రాష్ట్ర అసెంబ్లీలో కేవలం మూడు స్థానాలు మాత్రమే ఉన్నప్పటకీ, రాష్ట్రంలో ప్రధాన విపక్షాని దీటుగా ఎదిగింది.  తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కి సన్నిహితంగా  ఏఉండటం కూడా బీజేపీకి కలిసి వచ్చిందని చెప్పవచ్చు.  అయితే బీజేపీ మాత్రం ప్రధానంగా తన విమర్శలకు కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతిపైనే కేంద్రీకరించడం ప్లస్ పాయింట్ అయ్యిందని పరిశీలకులు చెబుతున్నారు.  

అన్నిటికీ మించి బీజేపీకి ఉన్న ప్రధాన ఆకర్షణ   ప్రధాన మంత్రి మోదీ. ఆయనకు ఉన్న జనాకర్షణ, వాగ్ధాటి. ఇటీవలి కాలంలో తెలంగాణలో బాగా ప్రాచుర్యం పొందింది. అలాగే బీజేపీ ప్రతిపాదించిన అభివృద్ధి నమూనా కూడా ప్రజలను ఆకర్షిస్తున్నదని పరిశీలకులు చెబుతున్నారు.

అలాగే  అర్బన్  ఓటర్లు, గ్రామీణ ప్రాంతాల్లోని యువత మెరుగైన అభివృద్ధి, ఉద్యోగావకాశాల వాగ్దానాలను ఉపయో గించి తమవైపు తిప్పుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికీ అధికారం, అభివృద్ధి వికేంద్రీకరణ జరగలే దని తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న ఆశయాలను కేసీఆర్ విఫలం చేస్తున్నారని బీజేపీ చేస్తున్న ప్రచారం కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. అన్నిటికీ మించి ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉండటం, కాళేశ్వరం వైఫల్యం, వర్గీకరణ అంశం, హామీల అమలు పూర్తి కాకపోవడం వంటి అంశాలను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నది. 

By
en-us Political News

  
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.