ఏపీ సీఎం వైఎస్ జగన్ తాను ఏపీకి మంచి చేస్తానని, మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటానని అన్నారు. అయితే ఇటీవల ఆయన తీసుకున్న ఓ నిర్ణయం ఏపీకి ఎంత మంచి చేస్తుందో తెలీదు కానీ.. పొరుగు రాష్ట్రాలకు మాత్రం వరంలా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలంటూ.. వైసీపీ సర్కార్ చేసిన బిల్లు పొరుగు రాష్ట్రాలకు పెద్ద వరంలా మారే అవకాశముందని అంటున్నారు. ఈ బిల్లును అడ్డుపెట్టుకొని.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు.. ఏపీకి రావాల్సిన పరిశ్రమలను ఆకట్టుకోవడానికి ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తమిళనాడు.. ఇప్పటికే ఏపీలో ప్లాంట్లు పెట్టేసిన పరిశ్రమలను కూడా తమ రాష్ట్రానికి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తోందట. ఏపీతో పోలిస్తే.. తమిళనాడు ఎంతో అనుకూలం అంటూ.. తమిళనాడుకు చెందిన అధికారులు, వ్యాపారవేత్తలు ప్రచారం ప్రారంభించేశారట. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వడం, స్థానిక నేతల బెదిరింపులు, దాడులు మా దగ్గర ఉండవు అంటూ పరిశ్రమలను ఆకర్షించే పనిలో తమిళనాడు ఉందట.
తమిళనాడు, ఏపీ బోర్డర్ అయిన చిత్తూరు జిల్లాలో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ చేసే ప్రయత్నం చేసింది. శ్రీసిటీలో పెద్ద ఎత్తున విదేశీ సంస్థలు తమ ఉత్పాదక యూనిట్లు ప్రారంభించాయి. తిరుపతిలో ఎలక్ట్రానిక్ పరిశ్రమల క్లస్టర్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు మొబైల్ సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించాయి. టీసీఎల్, రిలయన్స్ జియోతో పాటు.. పలు సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఈ పరిశ్రమలన్నింటినీ తమిళనాడు టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఏపీ పారిశ్రామికవేత్తల నుంచి ఎన్నో ఎంక్వైరీలు వస్తున్నాయని.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ తమిళనాడు శాఖ బేరర్ చంద్రమోహన్ చెబుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలన్న తమ నిర్ణయంపై చాలా మంది చింతిస్తున్నారని ఆయన అంటున్నారు. ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు.. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని ఏపీ నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలకు భూములు, ఇతర ప్రయోజనాలు కల్పిస్తే.. తమిళనాడుకు ఏపీ పరిశ్రమలు భారీగా వస్తాయని అంటున్నారు.
అటు కర్ణాటకలోనూ.. ఇదే తరహా అభిప్రాయం ఉంది. కర్ణాటక శివార్లవైపు.. ఏపీ పరిశ్రమలు చూస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. కియా అనుబంధ పరిశ్రమలు ఇప్పటికే.. కర్ణాటకకు తరలిపోతున్నాయ్న ప్రచారం జరుగుతోంది. పొరుగు రాష్ట్రాల్లో.. ఏపీలో పరిశ్రమలు పెట్టిన పారిశ్రామికవేత్తలు ఎంక్వైరీలు పెరిగిపోవడంపై.. ఏపీ సర్కార్ ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. స్థానికులకు ఉద్యోగాలనే నిబంధన… అసలు ఉద్యోగాలే లేకుండా చేస్తే.. మొదటికే మోసం వచ్చినట్లు అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/why-are-companies-moving-to-tamil-nadu-from-ap-39-88448.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.