Publish Date:Jun 17, 2025
కల్వకుంట్ల కవిత.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తెగా మాత్రమే కాదు.. ఎంపీగా, పార్టీ సాంస్కృతిక విభాగం తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలిగా తనదైన ప్రత్యేక గుర్తింపు పొందిన నేత. తండ్రి కేసీఆర్ వాగ్ధాటిని పుణికి పుచ్చుకున్న నేత. అందులో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరినప్పటి నుంచీ కవిత పార్టీలో మమేకమై పార్టీలో మమేకమై ఉద్యమంలో ముందుండి నడిచారు. కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఉద్యమాన్ని వేరే లెవెల్ కు తీసుకు వెళ్లారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ విజయంలో కవిత పాత్ర కూడా గణనీయంగా ఉంది. వరుసగా రెండో సారి కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అంత వరకూ ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగానే సాగింది.
ఎప్పుడైతే 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైందో.. అప్పటి నుంచీ కేసీఆర్ కుటుంబంలో విభేదాలు పొడసూపాయి. కేసీఆర్ కు ఇద్దరు పిల్లలు కేటీఆర్, కవిత. పార్టీ పరాజయం తరువాత కేటీఆర్, కవిత మధ్య విభేదాలు తలెత్తాయని పార్టీ వర్గాలలోనే గుసగుసలు వినిపించడం మొదలైంది. ఎప్పుడైతే కవిత బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ లీకైందో.. అప్పటి నుంచే ఇరువురి మధ్యా విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కవిత తన సొంత దారి చూసుకుంటున్నారా? అన్న చర్చ మొదలైంది. అందుకు తగ్గట్టుగానే కవిత అడుగులూ పడ్డాయి. తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని తన ఇంటికి సమీపంలోకి మార్చుకున్న కవిత.. బీఆర్ఎస్ జెండాలు లేకుండా తెలంగాణ జాగృతి ద్వారానే రాజకీయం చేయడం మొదలు పెట్టారు. అందులో భాగంగానే యువతనుజాగృతిలోకి ఆహ్వానించారు. ఆమె పిలుపు మేరకు ఇటీవల పెద్ద ఎత్తున యువత జాగృతి సంస్థలో చేరారు. వారికి కవిత సంస్థ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన వార్త మీడియాలో ప్రముఖంగా వచ్చింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఒక మీడియా సంస్థ మాత్రం కవిత ఇంటిపేరును కల్వకుంట్ల అని కాకుండా దేవనపల్లి అని పేర్కొంది. దేవనపల్లి కవిత భర్త అనీల్ ఇంటి పేరు. ఇంత కాలంగా కవితను కల్వకుంట్ల కవితగానే అంతా పేర్కొంటూ వచ్చారు. ఇప్పుడు హఠాత్తుగా అదీ ఓ మీడియా సంస్థకు కవిత ఇంటిపేరు కల్వకుంట్ల కాదు అంటూ ప్రచురించాలనీ. ప్రచారం చేయాలనీ అనిపించింది. అంటే కేసీఆర్ కుటుంబం నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచీ ఆమెను వేరు చేసే ప్రయత్నమే ఇదని పరిశీలకులు విశ్లేషించారు.
సరిగ్గా సోదరుడితో విభేదించిన తరువాత వైఎస్ షర్మిల పేరుకు ముందు ఆమె భర్త ఇంటిపేరు ఎలా అయితే చేర్చి అప్పట్లో వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ సొంత మీడియా ప్రచురించాయో, ప్రచారం చేశాయో.. సరిగ్గా అలాగే ఇప్పుడు కవిత విషయంలో జరగడం యాధృచ్చికం ఎంత మాత్రం కాదని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/why-a-particular-media-change-kavitha-surname-39-200158.html
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.