గోషామహల్ ఓటెవరికి ?

Publish Date:Jun 17, 2023

Advertisement

తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24  హైదరాబాద్ ,సికింద్రాబాద్  పరిధిలో 15 అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. అయితే  సిటీలో ఉన్న అన్ని నియోజక వర్గాలలో  హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న గోషామహల్ నియోజక వర్గానికి  ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మినీ ఇండియా గా పేరొందిన గోషామహల్ నియోజక వర్గంలో అన్ని వర్గాలు, అన్నీ రాష్ట్రాల ప్రజలు ఉంటారు. వ్యాపార కేంద్రంగా గుర్తింపు పొందిన ఈ నియోజక వర్గంలో గెలుపు ఎవరికీ అంత ఈజీ వ్యవహారం కాదు. అయితే, కాశీ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాలు అన్ని రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా ఉండే ఈ నియోజక వర్గంలో ప్రాంతీయ భావాలకంటే జాతీయ భావాల వైపే కొంచెం ఎక్కువ మొగ్గు కనిపిస్తుంది. 

అదలా ఉంటే  2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రాజా సింగ్  వరసగా రెండవ సారి ఈ నియోజక వర్గం నుంచి విజయం సాధించారు. అంతే కాదు ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఏకైక నియోజకవర్గం గోషామహల్. బీజేపీ టికెట్ పై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజ్ సింగ్. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి రఘునందన్, హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ గెలిచినా, 2018 ఎన్నికల్లో గెలిచిన ఏకైక బీజేపీ ఏమ్మేల్యేగా రాజా సింగ్ చరిత్ర సృష్టించారు. ఆవిధంగానూ గోషామహల్  అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అయితే  రాజాసింగ్ రెండవసారి గెలిచినప్పటి నుంచీ, ఆయన్ని వివాదాలు చుట్టూ ముడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో వివాదాస్పద  స్టాండప్ కమెడీయన్ మునావర్ ఫరూఖీ నిర్వహించిన షోకు వ్యతిరేకంగా అయన చేసిన వ్యాఖ్యలు, విడుదల చేసిన వీడియో వివాదాస్పదం కావడంతో బీజీపీ అధినాయకత్వం  ఆయన్ని గత ఆగష్టు లో పార్టీ నుంచి  సస్పెండ్ చేసింది. ఇప్పటికీ సస్పెన్షన్ కొనసాగుతోంది. అదే కేసులో ఆయన అరెస్టయ్యారు ..మూడు నెలలకు పైగా జైలు జీవితం అనుభవించి, బెయిల్ పై విడుదలయ్యారు. కేసు ఇంకా నడుస్తూనే వుంది. ఈ నేపధ్యంలో  బీజేపీ ఎన్నికలలోగా సస్పెన్షన్  ఎత్తి వేస్తుందా?  ఆయనకు మళ్ళీ బీజేపీ టికెట్ ఇస్తుందా? అనే అనుమానాలు అయితే ఉన్నాయి. అయితే ఆయన  మాత్రం పోటీకి సిద్దమవుతున్నారు. వరసగా మూడవసారి గెలిచి, హ్యాట్రిక్ సాధిస్తానని  ధీమా వ్యక్త పరుస్తున్నారు.

అదలా ఉంటే ఈసారి ఎలాగైనా గోషామహల్ పై గెలుపు జెండా ఎగరేయాలని..  అటు బీఆర్ఎస్, ఇటు ఎంఐఎం పార్టీలు  తహతహలాడుతున్నాయి. ఈ మేరకు  రెండు పార్టీలు ఎవరికి వారు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాయి.మరో వంక  పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ తహతహలాడుతోంది. అయితే  గో సంరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణకు పెట్టింది పేరుగా నిలిచిన రాజాసింగ్ ను ఓడించడం ఇటు బీఆర్ఎస్, ఎంఐఎం జోడీకి, అటు దేశ వ్యాప్తంగా హిందూ వ్యతిరేక లౌకిక వాద అజెండాతో పోతున్న కాంగ్రెస్ పార్టీకి అంత ఈజీ కాదని అంటున్నారు. అయినా  గోషామహల్‌లో గెలుపు కోసం అన్ని పార్టీలు చాలా చురుగ్గా పావులు కదుపుతున్నాయి. దాంతో.. రాజాసింగ్ ఇలాకాలో తడాఖా చూపే పార్టీ ఏదన్నది ఆసక్తిగా మారింది.

2009లో గోషామహల్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఈ నియోజక వర్గంలో కాంగ్రెస్, బీజేపీలదే హవా. 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో.. కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ గౌడ్ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో.. వరుసగా బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ గెలుస్తూ వస్తున్నారు. అలాగే  ఇప్పటివరకు ఎంఐఎం నేరుగా ఇక్కడి నుంచి పోటీ చేయలేదు. గోషామహల్ అంటే.. రాజాసింగ్ అడ్డా అనే పేరుంది.  మరి రేపటి ఎన్నికల్లో గోషామహల్  ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో  చూడవలసి వుందని అంటున్నారు. 

కాగా   గోషామహల్ బీజేపీ టికెట్ రేసులో.. ఇద్దరు, ముగ్గురు కీలక నేతలున్నారు. వారిలో.. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్, భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంత్ రావు, జీహెచ్ఎంసీలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న శంకర్ యాదవ్ కమలం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఈ ముగ్గురిలో అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లో పార్టీ రాజాసింగ్‌ను ఎంపీగా పోటీ చేయిస్తుందని, దాంతో.. తమకే పోటీ చేసే అవకాశం వస్తుందని.. ఆశావహులు లెక్కలు వేస్తున్నారు.

అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గత రెండు ఎన్నికల్లో గోషామహల్ బరిలో నిలిచినా గెలవలేకపోయింది. దాంతో ఈసారి ఎలాగైనా గెలవాలనే కసితో ఉంది కేసీఆర్ పార్టీ. అయితే బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో నందకిశోర్ వ్యాస్, ఆశిష్ కుమార్ యాదవ్ , ముఖేష్ సింగ్, ఆనంద్ కుమార్ గౌడ్ ఉన్నారు. కాంగ్రెస్ విషయానికొస్తే.. గోషామహల్ నుంచి మెట్టు సాయికుమార్ పోటీ చేసే అవకాశం ఉంది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఫ్యామిలీ బీజేపీలో చేరడం మెట్టు సాయికి కలిసొస్తుందనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. గోషామహల్‌లో గెలుపు జెండా ఎగరేసేందుకు.. ఏ పార్టీకి ఆ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.మరి ఓటరు దేవుడు ..ఎవరిని కరుణినిస్తారో చూడవలసిందే..అంటున్నారు.

By
en-us Political News

  
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.